అన్వేషించండి

YSRCP WorkShop : ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ - నేరుగా ఇచ్చేసిన జగన్ ! వారెవరంటే ?

వైఎస్ఆర్‌సీపీ వర్క్ షాప్‌లో 27మంది ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే టిక్కెట్లు ఇచ్చే్ది లేదన్నారు.

YSRCP WorkShop :   27 మంది ఎమ్మెల్యేలు పార్టీ అప్పగించిన గడప గడపకూ వైఎస్ఆర్‌సీపీ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదని సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో నిర్వహించిన వర్క్ షాప్‌లో జగన్ ప్రసంగించారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్నిసీరియస్‌గా తీసుకోడం లేదని .. మొత్తం 27మందిపై జగన్ ఫైరయ్యారు. అందులో నలుగురు మంత్రులు ఉన్నారు. వీరందరూ ఇక నుంచి వారానికి మూడునాలుగు రోజులు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాల్సిందేననిస్పష్టం చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఓ గంట తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని.. వారందరి పనితీరుపై  మదింపు చేస్తున్నామని.. పనితీరు మార్చుకోపతే టిక్కెట్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు.  

నవంబర్ ఆఖరి వారంలో మరోసారి మీటింగ్ ఉంటుందని ఎవరి  పని  తీరు  ఏంటి  అనేది  చివరి  ఆరు  నెలల్లో చెబుతానని.. అప్పుడే టిక్కెట్లు ఇచ్చేది లేనిది కూడా చెబుతామని జగన్ స్పష్టం చేశారు. మాజీ మంత్రులు బాలినేని, అళ్ల  నాని పని తీరు పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని దొంగదారులు వెతకవద్దని జగన్ వారికి మొహం మీదనే చెప్పారు. నలుగురు మంత్రులు..మాజీ మంత్రులు కాకుండా జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేల్లో..  గ్రంధి శ్రీను, ధనలక్ష్మి,  అధిప్ రాజ్,  కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి, మేకపాటి చంద్రశఖరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంచి నేతలు ఉన్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.  
 
 వర్క్ షాప్‌నకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నియోజ‌కవ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, పార్టీ జిల్లా అధ్య‌క్షులు, రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్లు  హాజరయ్యారు.  ఎన్నికల దాకా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కొన‌సాగించాల్సిందేన‌ని స్పష్టం చేశారు.  2024 ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశార‌ని సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు తెలిపారు.  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ప‌నితీరు బాగా లేని వారి సంఖ్య 27గా తేలింద‌ని చెప్పిన జ‌గ‌న్‌, అయితే న‌వంబ‌ర్‌లో మ‌రోమారు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కుపై స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని, అప్ప‌టిలోగా ప‌నితీరు బాగా లేని వారు ప‌నితీరు మెరుగుప‌ర‌చుకోవాల‌ని జ‌గ‌న్ సూచించార‌న్నారు. ఎవ‌రి పనితీరు బాగా లేదో వారికే ఈ విష‌యం బాగా తెలుసున‌ని జ‌గ‌న్  వివరించినట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు. 

ప‌నితీరు ఆధారంగానే వ‌చ్చే ఎన్నికల్లో టికెట్ల‌ను కేటాయించ‌నున్నట్లు ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తు చేశార‌ని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.  ఎన్నిక‌ల‌కు ఇంకో 6 నెల‌ల స‌మ‌యం ఉంద‌న‌గా టికెట్ల కేటాయింపుపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్లు నాని వెల్ల‌డించారు. ఎన్నిక‌ల నాటికి ప‌నితీరు బాగా లేని వారికి టికెట్లు ఇచ్చే ప్ర‌సక్తే లేద‌న్నార‌ని తెలిపారు.రాజ‌కీయాల‌ను పార్ట్ టైంగా తీసుకునే వారికి అవ‌కాశాలు ఇవ్వ‌లేమ‌ని కూడా జ‌గ‌న్ చెప్పార‌న్నారు. రాజ‌కీయాల‌ను వృత్తిగా తీసుకున్న వారే రాణిస్తార‌ని చెప్పార‌న్నారు. ఎన్నిక‌ల్లో సీట్లు కావాలంటే జ‌నంలో ఉండాల్సిందేన‌ని జ‌గ‌న్ తెలిపార‌న్నారు. 

జగన్ తెలిపిన 27 మందిలో ఆరేడుగురు మంత్రులు కూడా ఉన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నందున సీరియస్‌గా తిరగలేకపోతున్నామని కొందరు చెబుతున్నారు. అయితే అలాంటివేమీ ఉండవని.. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గడప గడపకూ వెళ్లాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి -   మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
Anurag Kashyap: బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి -   మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
Anurag Kashyap: బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Heatstroke Emergency Care : సన్​స్ట్రోక్, డీహైడ్రేషన్​తో కళ్లు తిరిగి పడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
సన్​స్ట్రోక్, డీహైడ్రేషన్​తో కళ్లు తిరిగి పడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Mayasabha Season 1 Web Series: నాగచైతన్య పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ 'మయసభ' - కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు దేవకట్టా
నాగచైతన్య పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ 'మయసభ' - కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు దేవకట్టా
Vincy Aloshious: 'వాళ్లు నమ్మక ద్రోహం చేశారు' - 'దసరా' విలన్‌పై ఫిర్యాదు వెనక్కు తీసుకున్న నటి విన్సీ అలోషియస్
'వాళ్లు నమ్మక ద్రోహం చేశారు' - 'దసరా' విలన్‌పై ఫిర్యాదు వెనక్కు తీసుకున్న నటి విన్సీ అలోషియస్
Veera Dheera Sooran OTT Release Date: నెలలోపే ఓటీటీలోకి విక్రమ్ కొత్త మూవీ 'వీర ధీర శూరన్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
నెలలోపే ఓటీటీలోకి విక్రమ్ కొత్త మూవీ 'వీర ధీర శూరన్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget