అన్వేషించండి

Farmers And Governaments : తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు - ఏపీలో ఎంత ? జగన్ సర్కార్ రైతుల్ని పట్టించుకోవడం లేదా ?

ఏపీ ప్రభుత్వం రైతులను ఆదుకోలేకపోతోందా ? పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వలేకపోయిందా?నష్టపరిహారం గురించి ఎలాంటి ప్రకటనా లేదెందుకు ?మంత్రులు రైతులకు భరోసా ఇవ్వలేకపోయారా ?


Farmers And Governaments :   ఎండా కాలం వానలు తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని నిండా ముంచేశాయి. ఆరబెట్టుకున్న ధాన్యం నీళ్ల పాలయింది. కోతకు పంట నాశనం అయింది. ఎలా చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానంలో స్పష్టంగా తేడా కనిపిస్తోంది. తెలంగాణ మంత్రులు దాదాపుగా అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులకు  భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కూడా స్పందించింది. కానీ ఏపీ ప్రభుత్వంలో మాత్రం పెద్దగా కదలిక ఉండటం లేదు. వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాటలు నిరాశావాదంతో ఉంటున్నాయి. అధికారులు కూడా రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వలేకపోతున్నారు. కనీసం నష్టపరిహారం ఎంత ఇస్తామన్నది కూడా చెప్పలేదు. దీంతో ఏపీ రైతుల్లో దిగులు కనిపిస్తోంది. 

తెలంగాణలో ఎకరానికి రూ. పది వేల పరిహారం - మరి ఏపీలో ?

తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. పదివేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి  ఈ  పరిహారాన్ని సీఎం కేసీఆర్ మూడు వారాల కిందట భారీగా వడగళ్ల వాన వచ్చినప్పుడే ప్రకటించారు. కానీ ఇప్పుడు మరిన్ని వర్షాలు ఎక్కువగా పడ్డాయి. మరి కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ధాన్యం తడిచిపోయింది. అందుకే అందరికీ పన్నెండో తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. రైతుకు జరిగి నష్టం  రూ. పదివేలుతో పూడిపోదు. కానీ..ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకుందన్న భరోసా దక్కుతుంది. అలాగే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా కల్పిస్తున్నారు.  అదే సమయంలో ఏపీలో ఇప్పటి వరకూ పంట నష్టపోయిన రైతులకు ఇతమిత్థంగా ఇంత ఇస్తామన్న ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. పరిహారం అందలేదని ఒక్క రైతు కూడా చెప్పలేదని వారి మొహంలో చిరునవ్వు కనిపించేలా  అందరికీ పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ సమీక్షలో ఆదేశించారు.కానీ ఎంత ఇవ్వాలి.. ఎప్పుడు ఇవ్వాలన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

తెలంగాణలో విస్తృతంగా పర్యటించిన మంత్రులు - మరి ఏపీలో ?

ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా అండగా ఉంటే ఉండే ధైర్యం వేరు. అందుకే ఏదైనా విపత్తు జరగగానే తామున్నామంటూ ప్రభుత్వానికి చెందిన వారు వెళ్తారు. బాధితుల్లో భరోసా కల్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వ మంత్రులు అదే చేశారు. కేటీఆర్ సహా వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులందరూ రైతుల్ని పరామర్శించారు. తమది రైతు ప్రభుత్వమని ఖచ్చితంగా ఆదుకుంటామని..తడిచిన ధాన్యాన్ని కొంటామని భరోసా ఇచ్చారు. ఇది ఓ రకంగా తెలంగాణ రైతులకు నైతిక స్థైర్యం ఇచ్చింది. అయితే ఏపీలో మాత్రం ఏ ఒక్క మంత్రి రైతుల్ని పరామర్శించేందుకు ఆసక్తి చూపించడం లేదు. రైతులు సంతోషంగా ఉన్నారనే ప్రకటనలు చేస్తూ ఉంటారు కానీ.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. చేతికి వచ్చిన పంట పాడైపోయింది. చేతికి రావాల్సిన పంట వస్తుందన్న గ్యారంటీలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి  దైర్యం చెప్పడానికి కూడా ఎవరూ రాలేదు. అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన అధికారులు .. సాయం చేయలేమని కావాలంటే సలహాలిస్తామని ప్రకటించడం వివాదాస్పదమయింది. 

ఆర్థిక సమస్యల వల్లే ఏపీ ప్రభుత్వం చురుకుగా కదలలేకపోతోందా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉంది.  ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉద్యోగులకు జీతాలు, రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేకపోయారు. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకుని రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రకృతి విపత్తులకు ప్రజలకు సాయం చేయడానికి ఆర్థిక సమస్యలు ఉండటం వల్లనే చురుకుగా కదలడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.అయితే ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉంటే.. వేల మంది రైతులు నష్టాన్ని తప్పించుకునేవారనే వాదన ఉంది. ప్రభుత్వం  ఆర్థికం కాకపోయినా.. సమయానుకూలంగా చురుకుగా వ్యవహరిస్తే.. ఎంతో నష్టం తగ్గి ఉండేదని రైతులు అంటున్నారు. 

కారణం ఏదైనా తెలంగాణతో పోలిస్తే ఏపీ రైతులు ఎక్కువగా నష్టపోయారు. కానీ ప్రభుత్వం మత్రం అనుకున్న విధంగా చురుకుగా స్పందించలేకపోతోంది. ఇది రైతుల్లో ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణం అవుతోంది. అటు మంత్రులు.. అటు యంత్రాంగం మొత్తం అకాల వర్షాల వల్ల జరిగిన నష్టంపై యాంత్రికంగా వ్యవహరించడంతో రైతులకష్టాలు మరింత పెరుగుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026: పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Vaibhav Sooryavanshi: IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
Crime News: స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
Hyderabad Old Age Homes: హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
హైదరాబాద్‌లో కట్టెల పొయ్యితో ఈ వృద్దులు బతికేదెట్టా..! వృద్దాశ్రమాల్లో LPG కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
Mahieka Sharma News: హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
హార్దిక్ పాండ్యా కొడుకు గురించి మహికా శర్మ ఫైర్ :  ఇబ్బంది పెట్టొద్దంటూ ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్.. 
Embed widget