అన్వేషించండి

Telangana BJP : తెలంగాణ బీజేపీ బలోపేతానికి దారేదీ ? హైకమాండ్ కూడా లైట్ తీసుకుంటోందా ?

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ సీరియస్ నెస్ తగ్గించిందా ?గెలుస్తామన్న ఆశలు వదిలేసుకుంటోందా ?పార్టీ నేతల మధ్య సఖ్యత చూపలేకపోతున్నారా?చేరికలు ఎందుకు ఉండటం లేదు ?

 
Telangana BJP :  తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యమని బీజేపీ చాలా సార్లు చెప్పింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్నా సరే తెలంగాణలో బీజేపీ ఇంత వరకూ యాక్టివ్ కావడం లేదు. గతంలో అయినా పాదయాత్రలనీ..ఇతర కార్యక్రమాలని హడావుడి చేసేవారు. ఇటీవల పూర్తిగా సైలెంట్ కావడమే కాదు..కేంద్రం నుంచి పలుకుబడి ఉన్న నేతలు ఎవరూ రావడం లేదు.. చేవెళ్లలో అమిత్ షా సభ పెట్టారు..కానీ పెట్టినట్లుగా కూడా చాలా మందికి  గుర్తు లేదు. బీజేపీ హైకమాండ్ .. తెలంగాణ విషయంలో సీరియస్‌గా లేదా అన్న సందేహాలు ఈ కారణంగానే వస్తున్నాయి. 

బీజేపీలో చేరికలకు ప్రయత్నాలు నిల్ 

తెలంగాణలో  బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయి.  అసలు ఇతర పార్టీలన్నీ  ఖాళీ అయిపోతున్నాయని అందరూ వచ్చి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం చేశారు. కానీ ఒక్క పొటెన్షియల్ లీడర్ కూడా చేరకపోతూండటంతో  పార్టీ రాష్ట్ర నాయకత్వం నిరాశ చెందింది. పార్టీలో చేరికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేసినా జాయినింగ్స్ విషయంలో జాప్యం జరుగుతుండటంతో హైకమాండ్ అసంతృప్తితో ఉంది.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం తమదేననే  ధైర్యం నూరిపోస్తున్న హైకమాండ్.. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకురావడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతుండటంతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉండాలంటే, చేరికలు అనివార్యమని హైకమాండ్ భావిస్తోంది. గతంలో బీజేపీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్​ల నుంచి భారీగా వలసలు వచ్చినా.. గత కొద్ది నెలలుగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. పైగా వచ్చిన వాళ్లు వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. 

హైకమాండ్ ఆశలు పెట్టుకోవడం లేదా ?

సాధారణంగా బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా విజయం సాధించాలంటే వేసే స్కెచ్ వేరుగా ఉంటుంది. ఏడాది ముందుగా ప్రణాళిక ప్రారంభమవుతుంది. ముందుగా త్రివిధ దళాలను పంపుతారని విపక్షాలు సెటైర్లు వేస్తూంటాయి. ఆ త్రివిధ దళాలు సీబీఐ, ఐటీ, ఈడీ. తెలంగాణకు అవి వచ్చాయి కానీ.. పెద్దగా చూపించిన ఇంపాక్ట్ ఏమీ లేదు. ఆ తర్వాత  పెద్ద ఎత్తున చేరికలు చూపిస్తారు. చివరికి ఎన్నికల సమయానికి ఓ టెంపో క్రియేట్ చేస్తారు. తెలంగాణలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితి ఏక్కడా కనిపించడం లేదు. ప్రధాని మోదీ, అమిత్ షా లు తరచూ తెలంగాణ పర్యటనకు వస్తారని చెబుతున్నారు కానీ.. రావడం లేదు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. 

కేంద్ర పార్టీ చెప్పే కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ బీజేపీ 

తెలంగాణ బీజేపీ నేతల్లో ఉన్న అంతర్గత కలహాల కారణంగా సొంతంగా ఏమీ చేయడం లేదు. ప్రస్తుతం  9 ఏళ్ల మోదీ పరిపాలనా విజయాలపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. పరిపాలనలో ప్రధాని మోదీ సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం మే 30 నుంచి జూన్‌ 30 వరకు ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమం చేపట్టనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుం దని ప్రచారం చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఉంటే.. డబుల్‌ ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరుతాయని క్షేత్రస్థాయిలో వివరించాలని అనుకుంటున్నారు.  

అంతర్గత వివాదాలతో మొదటికే మోసం ! 

ఈ మధ్యకాలంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు  కనిపిస్తోందనీ, కలిసికట్టుగా పనిచేయకుంటే వేటు తప్పదని అధిష్టానం తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.  నేతలంతా క్రమశిక్షణతో ఉండటం కూడా చాలా ముఖ్యమని అధిష్టానం దిశానిర్దేశం చేసింది. నేతలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని  పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ కూడా హెచ్చరించారు. ఇక వచ్చే నెలలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేస్తోంది రాష్ట్ర బీజేపీ. ఓ సభకు అమిత్‌షా మరోసభకు జేపీ నడ్డా హాజరవుతారని చెబుతున్నారు. తెలంగాణ పార్టీ నేతల కారణంగానే హైకమాండ్ కార్యాచరణ ఆలస్యమవుతోంది కానీ చేతులెత్తేయలేదని.. బీజేపీ నేతలు అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget