అన్వేషించండి

Telugu Desam Party : తీవ్ర అసహనంలో టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అంచనాల్ని అందుకోలేకపోతున్నారా ?

Andhra Pradesh : తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి బహిరంగంగా కనిపిస్తోంది. దీనికికారణం వైసీపీ హయాంలో తమను వేదించిన వారిపై చర్యలు తీసుకోకపోవడమే. దీన్ని చంద్రబాబు ఎలా కవర్ చేసుకుంటారు ?

Telugu Desam Party cadre Unhappy  :  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందు కోసం ఆ పార్టీ క్యాడర్ శక్తివంచన లేకుండా పని చేసింది. ఐదేళ్ల పాటు వారు ఎదుర్కొన్న కష్టాలు, వేధింపులతో చావో రేవో అన్నట్లుగా పార్టీ కోసం నిలబడ్డారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. వారు అనుకున్నట్లుగా పార్టీ అధికారంలోకి వచ్చింది. యాభై రోజులు అవుతుంది. కానీ ఆ పార్టీ క్యాడర్ లో అధికారంలోకి వచ్చామన్న జోష్ లేదు. సొంత పార్టీ అధినాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. దీనికి కారణం తాము అనుకున్నట్లుగా వైసీపీ నేతలు, క్యాడర్‌పై చర్యలు లేకపోవడమే. వైసీపీకి కొమ్ము కాసిన అధికారుల్ని చూసీ చూడనట్లుగా వదిలేయడమే. రాను రాను టీడీపీ క్యాడర్ అసంతృప్తి సోషల్ మీడియాలో పెరిగిపోతోంది. 

అధికారం వస్తే ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా పని చేసిన టీడీపీ క్యాడర్

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో  గతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత కఠినమైన  పరిస్థితుల్ని ఎదుర్కొంది. అధికార వైసీపీ, ఆ పార్టీ చీఫ్ జగన్. టీడీపీని రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా.. శత్రువుగా.. టీడీపీ నేతల్ని వ్యక్తిగత శత్రువులుగా  చూశారు. సీఐడీ విభాగాన్ని, ప్రత్యేకంగా కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ అధికారిక ఫుల్ పవర్స్ ఇచ్చి మరీ ఏర్పాటు చేసిన సిట్‌ను అందు కోసం కేటాయించారు. చంద్రబాబు దగ్గర నుంచి కింది స్థాయి సోషల్ మీడియా కార్యకర్త వరకూ వీరి దెబ్బకు జైళ్లకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దాదాపుగా మూడు వేల కేసులు పార్టీ నేతలు, క్యాడర్‌పై నమోదు చేశారని లెక్క తేల్చారు. అధికారంలోకి వచ్చి తమపై వేధింపులకు  పాల్పడిన నేతలు, అధికారులపై కసి తీర్చుకోవాలని క్యాడర్ అంతా కసిగా పని చేశారు. 

కుప్పం వైఎస్ఆర్‌సీపీ ఖాళీ - జాడలేని ఇంచార్జ్ - టీడీపీలో చేరిపోతున్న ద్వితీయశ్రేణి కార్యకర్తలు

అధికారంలోకి వచ్చి యాబై రోజులు అయినా చంద్రబాబు సాత్విక పాలన !

చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి యాభై రోజులు అయింది. అయితే అనుకున్న విధంగా ఎవరిపై చర్యలు తీసుకోలేదు. మరీ దారి తప్పిన అధికారులుగా భావించిన వారికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకునే ఆలోచనలు ఇంకా చేయలేదు. ఇక ప్రత్యేక్షంగా క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన పోలీసులు, ఇతర అధికారులు, వైసీపీ నేతలపై కూడా చర్యలు ప్రారంభించలేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా  అసభ్యకరమైన మాటలతో విరుచుకుపడిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గతంలోలాగే దిలాసాగా ఉన్నారు. తాము చిన్న పోస్టు పెడితనే పోలీసులు అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించేవారని అంతకు మించి ఊహించుకుంటే.. వారినేమీ చేయడం లేదని టీడీపీ క్యాడర్ అసహానానికి గురవుతున్నారు. అంతకు మించి హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఎయిర్ పోర్టులో అరెస్టు చేసి తిరుపతికి తీసుకు వచ్చి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. హత్యాయత్నం సెక్షన్లు పెట్టి ఇలా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడం ఏమిటని ..మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. ఈ పరిణామాలన్నీ.. టీడీపీ కార్యకర్తల్ని నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకోలేమా అని.. మథనపడుతున్నాయి. 

పవన్‌ను ఇరుకున పడేసిన బండి సంజయ్ స్టేట్మెంట్‌- సమాధానం చెప్పాలని నిలదీస్తున్న వైసీపీ

అన్నీ చట్ట  ప్రకారమే జరుగుతాయంటున్న చంద్రబాబు

రెడ్ బుక్ పేరుతో ప్రత్యేకంగా జాబితా రెడీ చేసుకున్న లోకేష్ కూడా ఇంకా తాము రెడ్ బుక్ తెరవలేదంటున్నారు. చంద్రబాబు అంతా చట్ట ప్రకారమే చేద్దామంటున్నారు. కానీ ఆ చట్టం ప్రకారం కూడా వైసీపీ నేతలపై విపరీతమైన ఉదారత చూపిస్తున్నారన్న అసంతృప్తికి గురవుతున్నారు. నేరుగా నేరాలు చేసి దొరికినా పట్టించుకోవడం లేదని కక్ష సాధింపులన్న ఆరోపణలు వస్తాయన్న కారణంగా అతి జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌లో ఉన్నారని.. కింది స్తాయి నేతల్ని టార్గెట్ చేయడం కన్నా.. అసలు పెద్ద చేపల్నే చట్ట ప్రకారం బుక్ చేసేందుకు చాపకింద నీరులా పని చేస్తున్నారని.. వచ్చే జనవరి నాటికి పార్టీ కార్యకర్తలంతా సంతృప్తి చెందేలా చర్యలుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీతో అంటకాగిన అధికారుల్ని కింది స్థాయి నుంచి  ప్రక్షాళన చేయడం ప్రారంభించారు. డీఎస్పీల్ని 57 మందిని పక్కన పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత సీఐ,ఎస్ఐ స్తాయి పోలీసుల్లో క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన వారిని పక్కన పెట్టే అవకాశం ఉంది. 

అధికారం అందగానే కక్ష సాధింపులకు పాల్పడితే.. చెడ్డపేరు వస్తుందని టీడీపీ అధినేత భావిస్తున్నారు.  చట్ట ప్రకారం చేసినా కక్షసాధింపులు అనే అభిప్రాయం వస్తుంది కాబట్టి ఆయన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మరో వైపు వైసీపీ అధినేత కూడా పెద్దగా ఏమీ లేకపోియనా... హత్యలు జరిగిపోతున్నాయని ఢిల్లీలో కూడా ప్రచారం చేశారు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని ఇది టీడీపీ క్యాడర్ లో  అసహనానికి గురి చేస్తోందని చెబుతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Malla Reddy: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Malla Reddy: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Vijay Varma: 'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదిస్తేనే సంతోషం' - తమన్నాతో బ్రేకప్ ప్రచారం వేళ రిలేషన్ షిప్‌పై విజయ్ వర్మ ఏమన్నారంటే?
'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదిస్తేనే సంతోషం' - తమన్నాతో బ్రేకప్ ప్రచారం వేళ రిలేషన్ షిప్‌పై విజయ్ వర్మ ఏమన్నారంటే?
Ravindra Jadeja Records: రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత
రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Embed widget