అన్వేషించండి

YSRCP Party Posts : వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డి ఔట్ - కొత్త కోఆర్డినేటర్లను ఖరారు చేసిన జగన్ !

వైఎస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ల నియామకంపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డిని పార్టీ ఆఫీసుకు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను మార్చాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. మాజీ మంత్రులు కొంత మందిని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ఆయన గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు జరిపి జాబితాను ఓ కొలిక్కి తెచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవులు కొనసాగించినప్పటికీ బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్లకు జిల్లాల బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధ్యతలు బొత్స సత్యనారాయణకు ఇచ్చే అవకాశం ఉంది. 

రైతులు వరి సాగు తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టండి : మంత్రి ధర్మాన

తూర్పుగోదావరి జిల్లాకు వైవీ సుబ్బారెడ్డి , పశ్చిమ గోదావరి జిల్లాకు  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,  కృష్ణ,గుంటూరు జిల్లాలకు కొడాలి నాని , పల్నాడు జిల్లాకు మోపిదేవి , ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి, చిత్తూరు, అనంతపురం జిల్లాల బాధ్యతలు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని జిల్లాలకు ఎవరిని కో ఆర్డినేటర్లుగా నియమించాలన్నదానిపై కసరత్తు జరుగుతోంది. ఆ కసరత్తు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

14 కేసుల్లో నిందితులు కుక్కలు మొరిగితే భయపడ్డారు, కోర్టు చోరీ కేసులో ఎస్పీ కట్టుకథ : ధూళిపాళ్ల నరేంద్ర

పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలకు సెంట్రల్ ఆఫీస్ బాధ్యతలు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఉన్నారు. అక్కడి వ్యవహారాలన్నింటినీ కనుచూపుతో శాసిస్తున్నారు. అధికారులు కూడా ఆయన  మాటే ఎక్కువగా వింటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఉత్తరాంధ్ర నుంచి తప్పించి పార్టీ కార్యాలయానికి పరిమితం చేస్తే ఆయన స్థాయి తగ్గినట్లే అవుతుంది. ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్‌సీపీలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయన తిరుపతిలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ ఆయనను కలవడానికి వెళ్లలేదు. దీంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. 

మరో వైపు మంత్రి పదవులు కోల్పోయిన వారికి జిల్లా అధ్యక్ష పదవులు, జిల్లా డెలవప్‌మెంట్ బోర్డు చైర్మన్ పదవులు ఇవ్వనున్నారు. ఆ దిశగా కూడా కసరత్తు జరుగుతోంది. అన్ని పదవులను ఒకే సారి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ పదవులను... జిల్లాలకు బాధ్యులను వీలైనంత త్వరగా భర్తీ చేసి... ఎన్నికల సన్నాహాలను ప్రారంభించుకోవాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ సీపీ హైకమాండ్ ఉన్నట్లుా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Embed widget