అన్వేషించండి

KTR: పేదల ఇళ్లు, కడుపు కొట్టడానికే ముఖ్యమంత్రి అయ్యావా? - సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి పేదవారి ఇళ్లు కూల్చారని.. వారి కడుపు కొట్టేందుకే సీఎం అయ్యారా.? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దివ్యాంగులను రోడ్డు మీద పడేశారన్నారు.

KTR Comments On CM Revanth Reddy: పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారని.. పేదల కడుపు, ఇళ్లు కొట్టేందుకేనా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో (Jadcherla) శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ పట్టణంలో 4 వేల డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలనే ఆక్రమణలుగా చిత్రీకరించారు. పేదవాళ్లు, దివ్యాంగులు అనే సోయి లేకుండా దయాదాక్షిణ్యం లేకుండా 75 మంది ఇళ్లు కూలగొట్టారు. ఏ కారణంతో వాళ్ల ఇళ్లు కూలగొట్టారో ఈ ప్రభుత్వం సమాధానం చెబుతుందా?. పేదవాళ్లు ఎక్కడైనా తెలియక ఇళ్లు కట్టుకుంటే వారికే రెగ్యులరైజ్ చేసే విధంగా జీవో 58, 59 తెచ్చాం. కానీ మీ ప్రభుత్వం బడికి పోయే పిల్లలు, దివ్యాంగులను రోడ్డు మీద పడేసింది. రేవంత్ రెడ్డికి సంస్కారం ఉంటే పేదల పట్ల ప్రేమ ఉంటే, ఆ 75 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి. ఏ అధికారులైతే అక్రమంగా పేదల ఇళ్లు కూల్చారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి.' అని పేర్కొన్నారు.

'8 లక్షల ఎకరాలకు నీళ్లు'

పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారని.. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా అన్ని రిజర్వాయర్లు పూర్తి చేశామని కేటీఆర్ అన్నారు. 95 శాతం పని పూర్తైందని మిగిలిన 5 శాతం పనిని భూసేకరణ చేసి పూర్తి చేయాలని చెప్పారు. అయితే, దానికి సంబంధించిన టెండర్లు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. 'పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయట్లేదు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే చేయడం లేదా.?. సుంకిశాలలో ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్  దాదాపు రూ.4,350 కోట్ల పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థకే ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాల్సినప్పటికీ ఆ సంస్థకే పనులు అప్పగించారు. చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలి. ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా అని అన్నారో అదే మేఘా కంపెనీకి పనులు అప్పగిస్తుంటే నీ నైజం, నీ రంగు, నీ నిజాయితీ  ఏంటో ప్రజలకు తెలిసిపోతోంది. పాలమూరు బిడ్డలకు చేతులేత్తి నమస్తారిస్తున్నా. ఎంతోమంది భూములిచ్చి సహకరించటంతోనే ఆ పనులు పూర్తి చేయగలిగాం.' అని వెల్లడించారు.

త్వరలో పాలమూరు సందర్శనకు

మేడిగడ్డకు ఏ విధంగా పార్టీ నాయకులంతా వెళ్లామో పాలమూరు ప్రాజెక్ట్ సందర్శనకు కూడా అలాగే వెళ్తామని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే కేసీఆర్ పర్మిషన్ తీసుకొని రెండు రోజుల పర్యటన పెట్టుకుంటామని చెప్పారు. 'పాలమూరులో కేసీఆర్ కట్టించిన రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లను ప్రజలకు వివరిస్తాం. కొడంగల్ ప్రాజెక్టుకు పైసలు ఖర్చు చేస్తూ పాలమూరును ఎలా ఎండబెడుతున్నాడో కూడా ప్రజలకు తెలిసేలా చేస్తాం.' అని స్పష్టం చేశారు.

Also Read: HYDRA In Hyderabad: హైడ్రాకు అధికారాలు ఎలా వచ్చాయి? తెలంగాణ హైకోర్టు ఐదు సూటి ప్రశ్నలు ఇవే

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Embed widget