అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

KTR: పేదల ఇళ్లు, కడుపు కొట్టడానికే ముఖ్యమంత్రి అయ్యావా? - సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి పేదవారి ఇళ్లు కూల్చారని.. వారి కడుపు కొట్టేందుకే సీఎం అయ్యారా.? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దివ్యాంగులను రోడ్డు మీద పడేశారన్నారు.

KTR Comments On CM Revanth Reddy: పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారని.. పేదల కడుపు, ఇళ్లు కొట్టేందుకేనా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో (Jadcherla) శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ పట్టణంలో 4 వేల డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలనే ఆక్రమణలుగా చిత్రీకరించారు. పేదవాళ్లు, దివ్యాంగులు అనే సోయి లేకుండా దయాదాక్షిణ్యం లేకుండా 75 మంది ఇళ్లు కూలగొట్టారు. ఏ కారణంతో వాళ్ల ఇళ్లు కూలగొట్టారో ఈ ప్రభుత్వం సమాధానం చెబుతుందా?. పేదవాళ్లు ఎక్కడైనా తెలియక ఇళ్లు కట్టుకుంటే వారికే రెగ్యులరైజ్ చేసే విధంగా జీవో 58, 59 తెచ్చాం. కానీ మీ ప్రభుత్వం బడికి పోయే పిల్లలు, దివ్యాంగులను రోడ్డు మీద పడేసింది. రేవంత్ రెడ్డికి సంస్కారం ఉంటే పేదల పట్ల ప్రేమ ఉంటే, ఆ 75 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి. ఏ అధికారులైతే అక్రమంగా పేదల ఇళ్లు కూల్చారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి.' అని పేర్కొన్నారు.

'8 లక్షల ఎకరాలకు నీళ్లు'

పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారని.. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా అన్ని రిజర్వాయర్లు పూర్తి చేశామని కేటీఆర్ అన్నారు. 95 శాతం పని పూర్తైందని మిగిలిన 5 శాతం పనిని భూసేకరణ చేసి పూర్తి చేయాలని చెప్పారు. అయితే, దానికి సంబంధించిన టెండర్లు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. 'పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయట్లేదు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే చేయడం లేదా.?. సుంకిశాలలో ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్  దాదాపు రూ.4,350 కోట్ల పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థకే ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాల్సినప్పటికీ ఆ సంస్థకే పనులు అప్పగించారు. చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలి. ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా అని అన్నారో అదే మేఘా కంపెనీకి పనులు అప్పగిస్తుంటే నీ నైజం, నీ రంగు, నీ నిజాయితీ  ఏంటో ప్రజలకు తెలిసిపోతోంది. పాలమూరు బిడ్డలకు చేతులేత్తి నమస్తారిస్తున్నా. ఎంతోమంది భూములిచ్చి సహకరించటంతోనే ఆ పనులు పూర్తి చేయగలిగాం.' అని వెల్లడించారు.

త్వరలో పాలమూరు సందర్శనకు

మేడిగడ్డకు ఏ విధంగా పార్టీ నాయకులంతా వెళ్లామో పాలమూరు ప్రాజెక్ట్ సందర్శనకు కూడా అలాగే వెళ్తామని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే కేసీఆర్ పర్మిషన్ తీసుకొని రెండు రోజుల పర్యటన పెట్టుకుంటామని చెప్పారు. 'పాలమూరులో కేసీఆర్ కట్టించిన రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లను ప్రజలకు వివరిస్తాం. కొడంగల్ ప్రాజెక్టుకు పైసలు ఖర్చు చేస్తూ పాలమూరును ఎలా ఎండబెడుతున్నాడో కూడా ప్రజలకు తెలిసేలా చేస్తాం.' అని స్పష్టం చేశారు.

Also Read: HYDRA In Hyderabad: హైడ్రాకు అధికారాలు ఎలా వచ్చాయి? తెలంగాణ హైకోర్టు ఐదు సూటి ప్రశ్నలు ఇవే

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Priyanka Jawalkar: అరెరే ప్రియాంక... కుర్రకారు గుండెలు అదిరేలా... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అరెరే ప్రియాంక... కుర్రకారు గుండెలు అదిరేలా... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Ande Sri Last Rites: అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న  సీఎం
అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న సీఎం
Gopi Galla Goa Trip: నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
Surendra Koli: ఉరిశిక్ష పడినా నిర్దోషిగా బయటకు వస్తున్న కోలీ - మరో సారి హాట్ టాపిక్ గా మారిన నిథారీ హత్యల కేసు
ఉరిశిక్ష పడినా నిర్దోషిగా బయటకు వస్తున్న కోలీ - మరో సారి హాట్ టాపిక్ గా మారిన నిథారీ హత్యల కేసు
Embed widget