అన్వేషించండి

Annamalai We The Leaders : తమిళనాడు బీజేపీ ఖాళీ! అన్నామలై వెంటే కీలక నేతలు! దిల్లీ పెద్దల వ్యూహాత్మక మౌనం వెనుక అసలు కథ!

Tamil Nadu Annamalai : బీజేపీకి అన్నామలై రాజీనామా చేసి వి ద లీడర్ ప్రారంభించిన వేళ అమర్ ప్రసాద్ రెడ్డి, కారు నాగరాజన్ వంటి సీనియర్ నేతలు కమలం వీడారు. బీజేపీ పెద్దలు ఎవర్నీ ఆపేందుకు ప్రయత్నించడంలేదు.

We The Leaders Digital Volunteers Registration: తమిళనాడు రాజకీయ చరిత్రలో గత కొన్నేళ్లుగా ద్రావిడ కోటలను బద్దలు కొట్టే ఏకైక ఆశాకిరణంగా కనిపించిన భారతీయ జనతా పార్టీ  ఇప్పుడు రాష్ట్రంలో ఉనికి చాటుకోవడానికే కష్టపడాల్సిన తీవ్ర సంక్షోభంలో పడింది. జూన్ 5న బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలై పార్టీకి అధికారికంగా రాజీనామా చేసి,  వి ద లీడర్స్ అనే సరికొత్త సామాజిక-రాజకీయ వేదికను ప్రకటించడంతో తమిళనాడు కమలదళం నిలువునా ఖాళీ అవుతోంది. ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా అన్నామలై సృష్టించిన విపరీతమైన క్రేజ్, ఆయన దూకుడు నాయకత్వాన్ని నమ్మిన రాష్ట్ర స్థాయి కీలక నేతలంతా వరుసగా కాషాయ జెండాను వీడి ఆయన కొత్త ప్రయాణంలో భాగస్వాములవుతున్నారు. ఈ ఊహించని వలసల పర్వం తమిళనాడులో బీజేపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.

కీలక నేతలంతా అన్నామలై వెంటే 

అన్నామలై పార్టీని వీడిన కొద్ది గంటల్లోనే తమిళనాడు బీజేపీలో భూకంపం మొదలైంది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారు నాగరాజన్‌తో పాటు సుమారు 15 మందికి పైగా రాష్ట్ర, జిల్లా స్థాయి కీలక నేతలు, యువజన విభాగం లీగల్ కన్వీనర్ అభిలాష్ గోపినాథన్ వంటి వారు కమలం గూటిని వీడి అన్నామలై వెంటే నడిచారు. ఈ పరిణామాల తీవ్రత తగ్గకముందే, తాజాగా బుధవారం అన్నామలైకు అత్యంత ఆప్తుడు, ఆయన  ఎన్ మణ్, ఎన్ మక్కల్  పాదయాత్రకు, రాష్ట్ర బీజేపీ వార్ రూమ్‌కు వెన్నెముకగా నిలిచిన అమర్ ప్రసాద్ రెడ్డి కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడం హైలైట్‌గా మారింది.  నా తలైవర్  అన్నామలై తో కలిసి నా తదుపరి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తాను  అంటూ అమర్ ప్రసాద్ రెడ్డి చేసిన సోషల్ మీడియా ప్రకటన, క్షేత్రస్థాయి కేడర్ ఏ వైపు మొగ్గు చూపుతుందో స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

బీజేపీ మొత్తం అన్నామలైకే సపోర్ట్ 

"తమిళనాడులో బీజేపీకి క్యాడర్ బలం పెరగడానికి కారణమైన క్షేత్రస్థాయి మేనేజర్లు, సోషల్ మీడియా వారియర్లు ఇప్పుడు అన్నామలై వైపే నిలబడటం కమలనాథులకు కోలుకోలేని దెబ్బ." అయితే, ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన మరియు విశ్లేషించాల్సిన అంశం ఏమిటంటే.. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పార్టీ విచ్ఛిన్నమవుతున్నా, దిల్లీలోని బీజేపీ అగ్రనాయకత్వం  దీనిని ఆపడానికి  ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేయకపోవడం. దీని వెనుక గత 18 నెలలుగా నడుస్తున్న సిద్ధాంతాల ఘర్షణ దాగి ఉంది. ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు లొంగకుండా ఒంటరి పోరాటం  ద్వారానే క్లీన్ ఇమేజ్‌తో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని అన్నామలై భావించారు. కానీ, దిల్లీ పెద్దలు మాత్రం తక్షణ ఎన్నికల లబ్ధి కోసం, సీట్ల సమీకరణాల కోసం ప్రాంతీయ పార్టీలతో కూటమి రాజకీయాలు చేయడానికే మొగ్గు చూపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై తీవ్ర వ్యతిరేకతను సైతం పక్కనపెట్టి ఏఐఏడీఎంకే  తో మళ్లీ పొత్తు పెట్టుకోవడమే కాకుండా, సీట్ల సర్దుబాటులో అన్నామలై ప్రాధాన్యతను తగ్గించేలా వ్యవహరించడం వల్లే ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది.

ఢిల్లీ పెద్దలు ఎందుకు పట్టించుకోరు? 

ఈ సంక్షోభం వెనుక దిల్లీ బీజేపీ పెద్దల వ్యూహాత్మక మౌనం కూడా ఒక కారణం కావచ్చు. అన్నామలై శైలి పార్టీ లైన్‌ను దాటి  వ్యక్తిగత ఇమేజ్  వైపు వెళ్తోందని, భవిష్యత్తులో ఆయనను నియంత్రించడం కష్టమని అధిష్ఠానం భావించి ఉండవచ్చు. అందుకే ఆయనను వెళ్లనివ్వడం ద్వారా రాష్ట్రంలో మళ్లీ పాతతరం, సంప్రదాయవాద నేతలకు పగ్గాలు అప్పగించి, ప్రాంతీయ పార్టీలతో సజావుగా పొత్తులు సాగించవచ్చని దిల్లీ పెద్దల లెక్కగా కనిపిస్తోంది. కానీ, ఈ వ్యూహం క్షేత్రస్థాయిలో బెడసికొట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే తమిళనాడులో యువతకు, తటస్థ ఓటర్లకు బీజేపీ కనెక్ట్ అయిందంటే అది కేవలం అన్నామలై అవినీతి రహిత, దూకుడు రాజకీయాల వల్లే అనేది నిఖార్సైన నిజం.

దూసుకెళ్తున్న అన్నామలై

ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా అన్నామలై ప్రారంభించిన 'వి ద లీడర్స్' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కేవలం కొద్ది రోజుల్లోనే సుమారు 17 లక్షల మందికి పైగా వాలంటీర్లు నమోదు చేసుకోవడం ఆయనకున్న ప్రజాదరణను, పట్టును నిరూపిస్తోంది. తమిళ సంస్కృతి, ద్రావిడ గుర్తింపును గౌరవిస్తూనే.. దేశ సమగ్రత, జాతీయ భావాల కలయికతో ఆయన నిర్మిస్తున్న ఈ సరికొత్త రాజకీయ పంథా వైపే క్షేత్రస్థాయి శ్రేణులు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. దిల్లీ పెద్దలు అంచనా వేసినట్లుగా అన్నామలై నిష్క్రమణ కేవలం ఒక నేత వెళ్లడం కాదు, అది తమిళనాడులో బీజేపీ నిర్మించుకున్న పునాదినే కదిలించివేసింది. రాబోయే రోజుల్లో అన్నామలై తన స్వతంత్ర వేదికను పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చితే, అది అటు ద్రావిడ పక్షాలకు, ఇటు ఉనికి కోల్పోయిన బీజేపీకి సమానంగా ఊహించని సవాలుగా మారడం ఖాయం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget