అన్వేషించండి

Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి నేతలు కూటమి పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. కానీ అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

Andhra coalition parties committee has been formed For Leaders Joinings : వైఎస్ఆర్‌సీపీకి గడ్డు పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్  బై చెబుతున్నారు. వీరంతా కూటమి పార్టీల్లోకి చేరేందుకు రెడీ అవుతున్నాయి. అయితే వైసీపీని ఖాళీ చేయాలన్న ఆత్రుతో వచ్చే వారందర్నీ తమ పార్టీల్లో చేర్చుకునేందుకు సిద్ధంగా లేరు. దానికో పద్దతి పెట్టుకున్నారు. పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిన నేతల విషయంలో కూటమిపార్టీలన్నీ కలిపి ఏకాభిప్రాయానికి వస్తేనే తీసుకుంటున్నారు. అందు కోసం కూటమిలోని మూడు పార్టీలో ఐదుగురు కీలక నేతలతో కమిటీని నియమించుకున్నట్లగా తెలుస్తోంది. 

కూటమి పార్టీలకు వైసీపీ నేతల నుంచి దరఖాస్తులు

అధికారంలో ఉన్న పార్టీలోకి నేతల వలస ఉంటుంది. రాజకీయాల్లో అది సహజమే. తమ పార్టీకి బలం అవుతారని కాకపోయినా ఇతర పార్టీలు బలహీన అవుతాయన్న కారణంతో అయినా నేతల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమిలో అలాంటి చేరికల హడావుడి కనిపిస్తోంది. వైసీపీలోని అత్యంత కీలకమైన నేతలు కూటమి పార్టీలను సంప్రదిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి జగన్ బంధువు కూడా దూరమైపోయారు.ఆయన జనసేనలో చేరుతున్నారు. సామినేని ఉదయభాను కూడా చేరిక విషయం ప్రకటించారు. వీరు హఠాత్తుగా చేరలేదు. వీరి చేరికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే బయటపడ్డారు. ఇంకా చాలా మంది దరఖాస్తులు కూటమి పార్టీల వద్ద ఉన్నాయని అంటున్నారు. 

నెయ్యి కాంట్రాక్టర్‌ను మార్చడంతోనే అసలు సమస్య - తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?

చేరికలకు కూటమిలో ఓ కమిటీ - గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ! 

కూటమి పార్టీలు తమ పార్టీల్లోకి వచ్చే వారందర్నీ తీసుకోవాలని అనుకోవడం లేదు. మూడు పార్టీలకు ఇబ్బందికరం కాకుండా ...వైసీపీని బలహీనం చేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు.  ప్రకాశం జిల్లా వైసీపీ మొత్తం బాలినేని మీదనే ఆధారపడి ఉంది. ఆయన పోతే ఇక బలమైన నాయకుడే ఉండరు. ఈ కోణంలో వెంటనే ఆయన దరఖాస్తుకు ఆమోదం లభించింది. సామినేని ఉదయభానుకు కూడా అలాగే గ్రీన్ సిగ్నల్ లభించింది. టీడీపీ నేతల్ని బూతులు తిడితే మంత్రి పదవి వస్తుందని ఆయనకు పోటీ పెట్టినప్పుడు కూడా పరుషంగా మాట్లాడలేకపోయారు ఉదయభాను. ఈ కారణంగా వైసీపీలో అన్యాయం జరిగింది. పవన్ పై అతిగా స్సందించకపోవడంతో ఇప్పుడు జనసేనలోకి ఎంట్రీ వచ్చింది. కానీ ఇంకా చాలా మంది నేతల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. 

తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కన్ఫామ్, వారిపై కఠిన చర్యలు - చంద్రబాబు

పార్టీలకు సమస్య అయ్యే వారిని దూరం పెడుతున్న కూటమి

చేరికలకు వచ్చే వారిలో  కేసుల నుంచి బయటపడటానికి కొందరు.. ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కొందరు.. అలాగే కోవర్టులుగా కూడా కొందరు వచ్చే అవకాశం ఉంది. అందుకే మూడు పార్టీల్లోని ఐదుగురు నేతల కమిటీ అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలించిన తర్వాతనే నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. విడదల రజనీ ఫలితాలు వచ్చినప్పటి నుండి అయితే బీజేపీ లేకపోతే జనసేన అన్నట్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆమెపై చిలుకలూరిపేటలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇలాంటి నేతలు ఓ ఇరవై మంది వరకూ ఉంటారని.. పరిస్థితుల్ని బట్టి కొంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెబుతున్నారు. మొత్తానికి చేరికల విషయంలోనూ మూడు పార్టీల అంగీకారం మేరకే ముందుకెళ్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget