అన్వేషించండి

Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఏకతాటిపైకి వచ్చారు. ఇప్పటి వరకూ గ్రూపు గొడవతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రూటు మార్చారు.

Anantapur TDP Kalva : ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న అనంతపురం జిల్లా తెలుగుదేశం నాయకులలో పరివర్తన కనిపిస్తోంది . అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించిన తర్వాత ఈ మార్పు  కనిపిస్తోంది.  ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో నాయకుల మధ్య కీచులాట ఉండేది. గత వారం లో నారా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణలో భాగంగా అనంతపురంలో ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి ఉపదేశం చేశారు. దీంతో నాయకులలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా తాజా పరిణామాలు నిలుస్తున్నాయి. 

ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విసిరిన సవాలును స్వీకరించి రాయదుర్గం కి వెళుతున్న కాలువ శ్రీనివాసులును మార్గ మధ్యలో ఆత్మకూరు మండలం వడ్డుపల్లి దగ్గర  పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం కి వెళితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఆయనను నిర్బంధించారు. దీంతో సమాచారం అందుకున్న జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం నాయకులు మద్దతుగా నిలిచి పోలీసులు,  ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అగ్ర నాయకులలో ఒకరైన పయ్యావుల కేశవ్ లాంటి నాయకులు కాలువను కలిసి సంఘీభావం తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం కాలువకు మద్దతుగా నిలిచారు. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే వీరి మధ్య ఒకరికొకరు బాసటగా నిలవడం వెనుక అధినేత మంత్రాంగం బాగా పని చేసిందన్న చర్చ జోరుగా సాగుతోంది. 

గత కొన్ని ఏళ్లుగా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానాన్ని దీపక్ రెడ్డికి కేటాయించాలన్న విషయంలో వీరి మధ్య దూరం పెరిగింది . అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న  సమయంలో అభిప్రాయభేదాలు పక్కనబెట్టి ఐక్యతా రాగం ఆలపించడం ఇప్పుడు కార్యకర్తలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సింగనమల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బండారు శ్రావణిని బాధ్యతల నుంచి తప్పించి ద్విసభ్య కమిటీ పేరుతో ఆలం నరసానాయుడు , ముంటి మడుగు కేశవరెడ్డి లను నియమించారు . అప్పటి నుండి బండారు శ్రావణి కి కాలువకి మధ్య దూరంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కనీసం పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొనకుండా ఆమె కినుకు వహించారు. 

అయితే ప్రస్తుతం కాలువను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో బండారు శ్రావణి ఆయనను కలిసి తన సంఘీభావాన్ని తెలిపింది. ఇలా నాయకులందరూ దూరంగా ఉన్న నాయకులందరూ కాలువ కు మద్దతు పలికి చేరుతుండడంతో తో అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శించుకోడం లాంటివి తన దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హెచ్చరించిన దరిమిలా అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం కొసమెరుపు.

 

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget