అన్వేషించండి

ABP Exclusive: తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్‌ కిషోర్...! కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ వ్యూహకర్త ఆయనే..!

Kavitha New Party: కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో దూసుకెళ్తానన్న కేసీఆర్ కుమార్తె కవిత అందుకు గట్టి ఏర్పాట్లే చేస్తున్నారు. వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ బ్యాకప్‌తో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు

Kavitha New Party with Prasanth Kishore :   కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత ఇంకోసారి భారీ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  మాజీ ఎమ్మెల్సీ కవిత  కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయం చాన్నాళ్లుగా తెలుస్తూనే ఉంది. కిందటి మండలి సమావేశాల్లో ఆమే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా.  అయితే అందుకు ఆమె సన్నద్ధమవుతున్న తీరు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.  సంచలన రాజకీయ వ్యూహకర్త, చాలా కాలంగా పొలిటికల్ స్ట్రాటజీలకు దూరంగా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితకు సహాయ సహకారాలు అందిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ కిషోర్ సహకారంతో... తెలంగాణ గడ్డ మీద కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కవిత చేస్తు్న ప్రయత్నాలపై ABP Desam Excluisve  కథనం మీకోసం..  

కవితకు సాయం చేస్తానని తానే ఆఫర్ చేసిన ప్రశాంత్ కిషోర్

బయట రాజకీయాల్లో వేలు పెట్టకుండా.. చాలా కాలంగా తన సొంత పార్టీ జన సురాజ్ కార్యకలాపాలకే పరిమితమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిశోర్ తనంతట తానుగా ఆ మధ్య కవితకు ఫోన్ చేశారంట. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌ కుమార్తెకు సాయం చేస్తానని తానే ఆఫర్ చేశారంట.  రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించే IPACను స్థాపించి నడిపించిన ప్రశాంత్ కిషోర్ దేశంలో చాలా రాజకీయ పార్టీలకు సేవలందించారు. ఆ తర్వాత IPAC నుంచి బయటకువెళ్లి సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ పార్టీని నిర్మించుకున్నారు. IPAC నుంచి బయటకెళ్లాక పార్టీలు అడిగితే పర్సనల్‌గా సాయం చేయడమే తప్ప.. ప్రొఫెషనల్‌గా పనిచేయని ప్రశాంత్ కిషోర్ తనంతట తాను కవితకు సాయం చేస్తానని చెప్పడమే విశేషం. 

కవితతో వరుస భేటీలు

కవిత బీఆర్‌ఎస్‌  (BRS)ను వీడినప్పటి నుంచి ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య నాలుగైదు సార్లు చర్చలు జరిగాయి. కవితను కలవడం కోసం ప్రశాంత్‌ కిషోరే స్వయంగా హైదరాబాద్ వచ్చారు. "ప్రశాంత్ కిషోర్‌ తో చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి. ఆయనంతట ఆయనే మాతో కలుస్తామని ప్రపోజల‌్ పెట్టారు. అక్టోబర్ -నవంబర్ లో కొన్ని సమావేశాలు జరిగాయి. డిసెంబర్‌లో కూడా హైదరాబాద్‌ వచ్చారు. ఈ సంక్రాంతికి ముందు నాలుగు రోజులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. అప్పుడు ప్రతిరోజూ కవిత- ఆయన చర్చలు జరిపారు" అని  ఆ  పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ,ఈ భేటీల్లో పార్టీ నిర్మాణం, ప్రజల్లోకి వెళ్లే విధానం ,  పార్టీ సిద్ధాంతాలపై లోతైన కసరత్తు జరిగినట్లు సమాచారం. "తెలంగాణ ప్రజల కోసం.. ప్రజల భాగస్వామ్యంతో" అనే నినాదంతో ఈ పార్టీ ఉండాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. 

ప్రశాంత్ కిశోర్‌తో కవితకు బీఆర్‌ఎస్ లో ఉన్నప్పటి నుంచే సన్నిహిత సంబంధాలున్నాయి. అప్పట్లో  ఆ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆ సందర్భంగా కవితతో కలిసి పని చేశారు. ఆ సాన్నిహత్యం ద్వారానే ఇప్పుడు తనంతట తానుగా తెలంగాణలో కవితకు సహకారం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. 

50 కమిటీలతో క్షేత్రస్థాయి కసరత్తు 

పార్టీ ప్రకటనకు ముందే పక్కా ప్రణాళికతో కవిత ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 50 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు , సమస్యలపై లోతైన అధ్యయనం చేస్తున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగానే పార్టీ విధానాలను రూపొందించాలని కవిత నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుతూనే, ప్రజా కేంద్రీకృత పాలనను అందించడమే ఈ కొత్త పార్టీ ప్రధాన ఎజెండాగా ఉండబోతోందని తెలుస్తోంది.

అధికారిక ప్రకటన ఎప్పుడు? 

ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, పార్టీ పేరు , లోగోపై కూడా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ పరిణామాలపై అటు కవిత నుంచి కానీ, ఇటు ప్రశాంత్ కిషోర్ నుంచి కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. అయినప్పటికీ, కమిటీల ఏర్పాటు, పీకేతో వరుస భేటీలు చూస్తుంటే, తెలంగాణలో త్వరలోనే ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.                             

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Advertisement

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget