అన్వేషించండి
Puri Jagannath Rath Yatra 2025: గర్భగుడి నుంచి భక్తజనం మధ్యకు తరలివచ్చే జగన్నాథుడు .. రథయాత్ర గురించి ఈ విషయాలు తెలుసా!
Jagannath Rath Yatra 2025: ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో విదియ రోజు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 27న వచ్చింది. ఈ రథయాత్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
Puri Jagannath Rath Yatra 2025
1/6

ప్రపంచంలో అత్యంత పురాతనమైనది పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఎప్పుడు మొదలైందన్నది స్పష్టమైన ఆధారాలు లేవు.. బ్రహ్మపురాణం, పద్మపురాణంలోనూ రథయాత్ర గురించి ఉంది
2/6

గర్భగుడిలో ఒక్కసారి ప్రతిష్ఠించిన విగ్రహాలు బయటకు తీసుకురారు..కేవలం ఉత్సవ విగ్రహాలనే ఊరిగేస్తారు. కానీ పూరీ ఆలయంలో మాత్రం గర్భగుడిలో కొలువైన జగన్నాథుడినే బయటకు తీసుకొస్తారు
3/6

రథయాత్రకు ఏటా కొత్త రథాలు వినియోగిస్తారు..ఇందుకోసం అక్షయ తృతీయ నుంచి ఏర్పాట్లు ప్రారంభిస్తారు
4/6

జగన్నాథ స్వామి రథం పేరు గరుడధ్వజం, బలరాముడి రథం పేరు తాళధ్వజం, సుభద్ర రథ పేరు దేవదాలన. ఒక్కో రథం తయారీకి కొన్ని లెక్కలుంటాయి..వాటిని అనుసరించి తయారు చేస్తారు
5/6

విశ్వానికి రాజు జగన్నాథుడు..అందుకే రథయాత్ర ప్రారంభానికి ముందు పూరీ రాజు బంగారుచీపురుతో రథ ముందు ఊడ్చే సేవలో పాల్గొంటారు
6/6

ఏ రథయాత్ర అయినా ఊరంతా తిరిగిన తర్వాత తిరిగి ఆలాయానికే చేరుకుంటుంది కానీ జగన్నాథుడి రథయాత్రలో మాత్రం గుండిచా ఆలయం వద్ద ఆగిపోతుంది..పదో రోజు తిరిగి ఆలయానికి చేరుకుంటాడు జగన్నాథుడు
Published at : 26 Jun 2025 12:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
శుభసమయం
లైఫ్స్టైల్

Nagesh GVDigital Editor
Opinion




















