అన్వేషించండి

Plane Crash: ఖాట్మండ్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎలా కూలిపోయిందో చూశారా, ప్రమాద దృశ్యాలు వైరల్

Viral Video: ఖాట్మండులోని ఎయిర్‌పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kathmandu Plane Crash Video: నేపాల్‌ని ఖాట్మండు ఎయిర్‌పోర్ట్‌లో విమానం కుప్ప కూలింది. టేకాఫ్ అవుతుండగానే ప్రమాదానికి గురైంది. ఫ్లైట్‌లో సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణిస్తున్నారు. వీళ్లంతా చనిపోయి ఉంటారని భావించారు. పైలట్ మాత్రం అనూహ్యంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతానికి మృతదేహాల్ని ఘటనా స్థలం నుంచి తరలిస్తున్నారు. స్థానిక మీడియా మాత్రం మిగతా 18 మంది చనిపోయారని వెల్లడించింది. అయితే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎలా ప్రమాదానికి గురైందో ఇందులో స్పష్టంగా కనిపించింది. టేకాఫ్ అయిన ఫ్లైట్‌ ఓ వైపు ఒరిగిపోయింది. వేగంగా వచ్చి నేలపై కుప్ప కూలింది. అలా కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 11.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. నేపాల్ మిలిటరీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. 

అసలు ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదు. అయితే..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఈ ఘటన షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ భద్రతా ప్రమాణాలున్న ఎయిర్‌లైన్స్‌గా నేపాల్‌కి పేరుంది. పైలట్‌లకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం, నిర్వహణ సరిగ్గా లేకపోవడం లాంటి సమస్యలతో నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే ఐరోపా సమాఖ్య నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఏ విమానమూ తమ గగనతలంలోకి రావడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పూర్తిగా నిషేధం విధించింది. ఇక భౌగోళిక స్థితిగతులూ ఇక్కడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హిమాలయాల ప్రాంతంలో ఉండడం వల్ల చుట్టూ కొండలు, లోయల మధ్యలో ఎయిర్‌పోర్ట్‌లు కట్టుకోవాల్సి వస్తోంది. అవి చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి. ఇలాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పుడు పైలట్‌లకు ఇంకాస్త ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇదే జరగడం లేదు. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. ఇన్ని సవాళ్ల మధ్య ఫ్లైట్‌ సర్వీస్‌లు నడపాల్సి వస్తోంది.

శౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన Bombardier CRJ-200ER ఫ్లైట్‌ ఈ ప్రమాదానికి గురైంది. 2003లో తయారైన ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఇంకా నడుపుతున్నారు. అయితే..2019లోనే భారత్‌కి చెందిన కుబేర్ గ్రూప్ ఈ ఎయిర్‌లైన్స్‌ని కొనుగోలు చేసింది. 2021లోనే ఎయిర్‌లైన్స్ పేరు మార్చి కుబేర్ ఎయిర్‌లైన్స్‌గా ప్రకటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థ 2018లో ఓ సారి సర్వీస్‌లను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోందనుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read: Plane Crash: ఖాట్మండ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం, టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం - పైలట్ మినహా 18 మంది మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget