అన్వేషించండి

corona virus: ఆ దేశాధ్యక్షులు సారీ చెబుతున్నారు..! ఇండియాను చూసి నేర్చుకోలేదా..?

కరోనా టైంలో ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. కొన్ని దేశాల్లో ముందస్తుగా పరిస్థితి అంచనా వేయలేకపోవడంతో చాలా మంది మృతి చెందారు. దీనిపై ఆయా దేశాధ్యకులు క్షమాపణలు చెప్పారు.

ప్రపంచంలో అనేక దేశాల అధ్యక్షులు సారీ చెబుతున్నారు. ఎవరికో కాదు. తమ ప్రజలకే చెబుతున్నారు. ఎందుకంటే.. కరోనాను సమర్థంగా డీల్ చేయలేకపోయామని.. ప్రజలు చనిపోయారని... అందుకే క్షమాపణలు కోరుతున్నామని చెబుతున్నారు.  ఆస్ట్రేలియాప్రధానమంత్రి ఈ విషయంలో ఎమోషనల్ అయ్యారు. ఐయామ్ సారీ అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పోలాండ్, తైవాన్ ప్రెసిడెంట్లు కూడా అదే చేశారు. పదవిలో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సారీ చెప్పారు. ఇక కరోనా వ్యవహారంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్స్ నారో కూడా అదే తరహాలో క్షమాపణలు చెప్పారు. 

అధ్యక్షులు చేస్తున్నఈ క్షమాపణల ప్రకటనలు... అంతర్జాతీయంగా హెడ్ లైన్స్ అవుతున్నాయి. ఇంత నిజాయితీగా వారు ప్రజలకు సారీ చెబుతూండటం.. చాలా మందికి నచ్చుతోంది. కానీ.. ఇండియాలో మాత్రం.. వారిపై జాలిగా చూస్తున్నారు. వారంతా ఇండియాను చూసి నేర్చుకోకుండా తప్పు చేశారని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత బాగా కరోనాను నియంత్రించిన దేశం భారత్. ఎంతగా అంటే... ఒక్కటంటే.. ఒక్క ఆక్సీజన్ అందని మరణం ఇండియాలో చోటు చేసుకోలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. పార్లమెంట్‌లోనే గొప్ప తనాన్ని ఆవిష్కరించింది. 

అలాగే.. ప్రపంచం మొత్తం కరోనా కట్టడి విషయంలో భారత్ వైపు చూసిందని మోడీ చాలా సార్లు స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఇక కోవిన్ యాప్ గురించి.. ఓ పెద్ద వర్క్ షాప్‌ను ప్రపంచానికి అవగాహన కల్పించడానికి నిర్వహించారు కూడా. ఆ కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఇప్పటికీ.. వ్యాక్సిన్ అందకపోవడం పెద్ద విషయం కాదు . ఆ యాప్ ఎన్నో సార్లు క్రాష్అయినా లెక్కలో లేదు. కానీ.. యాప్ మాత్రం.. ప్రపంచ అద్భుతం. ఇలాంటి యాప్ గురించి.. ఇండియా నుంచి ముందే తెలుసుకునే ప్రయత్నాన్ని ఆ దేశాధ్యక్షులు చేయలేదు.  
  
ఇండియా ప్రభుత్వం కరోనా కట్టడికి ఏం చేసిందో.. ఎలా చేసిందో.. కాస్త చూసినట్లయితే.. ఆ విధంగా సారీ చెప్పే పరిస్థితి వచ్చి ఉండేది కాకపోవచ్చునని కొంత మంది సీరియస్‌గానే చెబుతున్నారు. వినే వాళ్లకు అది కామెడీగా ఉండొచ్చు. కానీ.. కరోనాను కట్టడి చేయలేకపోయినా.. ప్రజల్ని చప్పట్లు కొట్టించడం.. దీపాలు వెలిగించడం వంటి ఎమోషన్లు అయినా వారు నేర్చుకుని ఉండేవారు. టీకాలు ప్రజలకు పెద్దగా పంపిణీ చేయకపోయినా బాహుబలి గురించి ధైర్యం మాట్లాడగలిగేవాళ్లు. అన్నింటి కన్నా ముఖ్యంగా కళ్ల ముందు జరిగిన దాన్ని కూడా.. జరగలేదని చెప్పడం.. ప్రచారం చేయడం నేర్చుకుని ఉండేవారు. అప్పుడు.. వారు ఎవరికీ సారీ చెప్పాల్సిన పనే ఉండేది కాదు. అందుకే.. వారంతా ఇండియా వైపు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది సెటైర్ కాదు.. సీరియస్సే..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Indore News Viral: బిచ్చమెత్తుకునే వ్యక్తి కోట్ల ఆస్తి! ఇండోర్‌లో వడ్డీకి డబ్బులు ఇస్తున్న బెగ్గర్!
బిచ్చమెత్తుకునే వ్యక్తి కోట్ల ఆస్తి! ఇండోర్‌లో వడ్డీకి డబ్బులు ఇస్తున్న బెగ్గర్!
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Embed widget