అన్వేషించండి

Maldives: పీఎం మోదీపై అనుచిత వ్యాఖ్యలు - ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు

Maldives Ministers: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. ముగ్గురు మంత్రులపై అక్కడి ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది.

Maldives Ministers Suspend: భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాల్దీవులు (Maldives) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. మంత్రులు మరియం షియునా (Maryam Shiuna), మల్షా షరీఫ్ (Malsha Shareef ), మహ్జూమ్ మజీద్ (Mahzoom Majid) సస్పెన్షన్‌కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం వేటు వేసింది.

'బాయ్ కాట్ మాల్దీవ్స్'

భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై మాల్దీవుల మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ చేసిన వ్యాఖ్యలతో నెట్టింట పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియాలో భారతీయులు ట్రెండింగ్ చేశారు. నెటిజన్లతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు.. తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ తాజాగా వెల్లడించారు. షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

విషయం ఏంటంటే?
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లారు. అక్కడి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యలు చేశారు. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ దేశపు తోలు బోమ్మ అంటూ అనుచిత  కామెంట్‌ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు.

మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ సైతం ప్రస్తుత మంత్రులు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు అవమానకరమైన, జాత్యహంకార వ్యాఖ్యలు అంటూ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత్‌తో దౌత్యపరమైన విభేదాలకు కారణమవుతుందని మండిపడ్డారు. మొహమ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌తో ఆ దేశ సంబంధాలు తెబ్బతిన్నాయి. భారత్‌తో ఉన్న ఇండియా ఫస్ట్ విధానాన్ని మార్చాలంటూ ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చారు. మాల్దీవుల్లో భారత సైన్యం ఉపసంహరించుకోవాలని ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత తన తొలి పర్యటన సంప్రదాయ రీతిలో భారత్‌లో కాకుండా టర్కీలో పర్యటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget