అన్వేషించండి

Cancer Drug: క్యాన్సర్‌ రోగులకు గుడ్‌న్యూస్ - పూర్తిగా నయం చేసే డ్రగ్‌ ట్రయల్స్ విజయవంతం

18 మంది మల క్యాన్సర్ ఉన్న రోగులపై ఈ మందును ప్రయోగించారు. ఆరు నెలల చికిత్స అనంతరం వాళ్లకు క్యాన్సర్ పూర్తిగా నయమైంది.

వైద్య చరిత్రలోనే మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి డ్రగ్‌ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది. మల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు  వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. 18 మంది రోగులకు దాదాపు ఆరు నెలల పాటు దోస్టార్‌లిమాబ్ అనే ఔషధాన్ని ఇచ్చారు. ఆరు నెలల తర్వాత పరీక్షలు చేస్తే వారిలో క్యాన్సర్ కణాలు పూర్తిగా మాయమైనట్టు గుర్తించారు.  

దోస్టార్లిమాబ్ అనే ఔషధం మానవ శరీరంలో ప్రత్యామ్నాయ ప్రతిరోధకాలును ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 18 మల క్యాన్సర్ రోగులకు ఇదే మందు ఇచ్చారు. చికిత్స ఫలితంగా ప్రతి రోగిలో క్యాన్సర్ పూర్తిగా నిర్మూలనైంది. ఆ 18 మందికి ఎండోస్కోపీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లేదా PET స్కాన్‌లు, MRI స్కాన్‌ ఏ పరీక్షలు చేసినా క్యాన్సర్ కణాలు కనిపించలేదు. 

న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ లూయిస్ ఎ. డియాజ్ జె మాట్లాడుతూ... "క్యాన్సర్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి" అని అన్నారు.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్న రోగులు క్యాన్సర్‌ తగ్గ ముందు కూడా చాలా చికిత్సలు తీసుకున్నారు.  కీమోథెరపీ, రేడియేషన్, ఇన్వాసివ్ సర్జరీలు కూడా జరిగాయి. అయినా వాళ్లకు ప్రయోజనం కనిపించలేదు. చివరి ప్రయత్నంగా 18 మంది రోగులపై దోస్టార్లిమాబ్‌ను ప్రయోగించి చికిత్స అందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వారు చేసిన ప్రయత్నం ఆశ్చర్యపరిచే విధంగా ఫలితాలు ఇచ్చింది. 

ఈ ఫలితాలు ఇప్పుడు వైద్య ప్రపంచంలో సంచలనం రేపుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కొలొరెక్టల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ అలాన్ పి. వేనూక్ మాట్లాడుతూ... ప్రతి ఒక్క క్యాన్సర్‌ రోగికి పూర్తి ఉపశమనం అనేది ఇప్పటి వరకు వినలేదని అన్నారు. ఇప్పుడు జరిగిన పరిశోధన ఫలితాలు మాత్రం వైద్య చరిత్రలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. ట్రయల్స్‌లోనే మంచి ఫలితాలు సాధించిన ఈ కచ్చితంగా ప్రత్యేకమైందని, అందర్నీ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. 

క్యాన్సర్‌ను జయించామన్న రోగుల ఆనందాన్ని వివరించారు మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆండ్రియా సెర్సెక్. "రోగులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు" అని అన్నారు.

క్యాన్సర్‌ రోగులకు ప్రతి మూడు వారాలకోసారి ఆరు నెలల పాటు దోస్టార్‌లిమాబ్‌ను ఇచ్చారు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 18 మంది కూడా ఒకే స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్‌ రోగులు.ఈ క్యాన్సర్‌ రెక్టమ్‌లోనే కేంద్రీకృతమైందని... ఇతర అవయవాలకు వ్యాపించలేదని వైద్యులు తెలిపారు. 

ఔషధాన్ని సమీక్షించిన క్యాన్సర్ పరిశోధకులు... చికిత్స ఆశాజనకంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఎక్కువ మంది రోగులకు పని చేస్తుందో లేదో చూడాలన్నారు. మిగతా క్యాన్సర్‌లకు ఉపశమనం కలిగిస్తుందో లేదో తెలియాలంటే పెద్ద ఎత్తున ట్రయల్స్ అవసరం ఉందని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
US Woman Liz Shocked Indian Medicine Prices Cancer: అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
New Jersey Indian Grocery Store Parval Sale: కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా !
కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా ! వీడియో
Iraq Anti Corruption Raid: ఇరాక్ మహిళా ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు .. అవినీతి సోదాల్లో అధికారులకే మైండ్ బ్లాంక్!
ఇరాక్ మహిళా ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు .. అవినీతి సోదాల్లో అధికారులకే మైండ్ బ్లాంక్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget