అన్వేషించండి

Dharmavaram terrorist: ధర్మవరంలో జైషే మహమ్మద్ టెర్రరిస్టు అరెస్ట్ - ఇంతకీ ఏం ప్లాన్ చేశాడు ?

Terrorist arrested in Andhra: ఏపీలోని ధర్మవరంలో జైషే మహ్మద్‌కు చెందిన టెర్రరిస్టును అరెస్టు చేశారు. అతను ఏపీలో ఏ విధ్వంసానికి ప్లాన్ చేశాడో ఎన్ఐఏ వెలికి తీస్తోంది.

What is terrorist Noor doing in Dharmavaram : అనంతపురం జిల్లా ధర్మవరంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ  జేషే మహమ్మద్ కు చెందిన  నూర్ మహమ్మద్ షేక్ (40) అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది. ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివసిస్తున్న నూర్, స్థానిక హోటల్‌లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఎన్‌ఐఏ అతని నివాసంలో సోదాలు చేసి 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. నూర్ జైషే మహ్మద్‌కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడని, ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వ్యాఖ్యలు చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. స్థానిక పోలీసులు మొదట అతన్ని అరెస్ట్ చేసి, ఆ తర్వాత ఎన్‌ఐఏ విచారణకు అప్పగించారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. 

జైషే మహ్మద్ 2000లో మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన ఉగ్రవాద సంస్థ. భారత్‌పై దాడులు చేయడం దీని లక్ష్యం. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి ఘటనలకు ఈ సంస్థ బాధ్యత వహించింది. మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో .. అతని ముఠాను భారత్ టార్గెట్  చేసింది. అయితే అతని ఉగ్రవాద సంస్థలోనే పని చేస్తూ.. నూర్ ఏపీలో మకాం పెట్టడం సంచలనంగా మారింది. 

ఎన్‌ఐఏ మరియు ఐబీ అధికారులు నూర్   కార్యకలాపాలు, అతని సంబంధాలు,  ఇతర  ఉగ్రవాద కనెక్షన్లపై లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. నూర్‌తో పాటు, ఎర్రగుంట ప్రాంతానికి చెందిన రియాజ్ అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతను పాకిస్తాన్ జెండాతో సంబంధం ఉన్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ధర్మవరంలో కలకలం సృష్టించింది. స్థానికులు, ముఖ్యంగా కోట ప్రాంతంలో నివసించే వారు, ఎన్‌ఐఏ సోదాలతో ఉలిక్కిపడ్డారు.

ఏపీలో ఉగ్రవాదుల్ని అరెస్టు చేయడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల కిందట అన్నమయ్య జిల్లాలో ఇద్దరు  తమిళనాడు   మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి పేర్లు  అబుబక్కర్ సిద్దీక్ , మహమ్మద్ అలీ  అలియాస్  మన్సూర్.  అన్నమయ్య జిల్లాలో జూలై 1, 2025న తమిళనాడు యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. ఈ ఇద్దరూ దాదాపు 30 సంవత్సరాలుగా సిద్దీక్ 1995 నుంచి, అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలలో జరిగిన బాంబు దాడులతో సహా బహుళ ఉగ్రవాద కేసులలో నిందితులుగా ఉన్నారు. వారి తలపై ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఈ అరెస్టులు రాయచోటి పట్టణంలో జరిగాయి, ఇక్కడ వారు రెండు దశాబ్దాలకు పైగా నకిలీ గుర్తింపులతో నివసిస్తూ, చిన్న వ్యాపారాలు నడుపుతూ దాక్కున్నారు. 

టెర్రరిస్టులకు ఇలా ఏపీ షెల్టర్ జోన్ గా మారిందా.. ఇక్కడ ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలను చేపడుతున్నారా అన్నది విచారణలో తేాలాల్సి ఉంది. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు వీరు  ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.           

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Kaleshwaram Project: కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత రామచందర్‌రావు లేఖ
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్, NDSA నివేదిక పట్టించుకోలేదు: CM రేవంత్‌‌కు రామచందర్‌రావు లేఖ
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget