అన్వేషించండి

Afghanistan Taliban Rule: 'ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి'.. ఐరాసకు తాలిబన్ల లేఖ

ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు తాలిబన్లు లేఖ రాశారు. ఈ ఏడాది ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం ఇవ్వాలని తాలిబన్లు కోరారు.

అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు తహతహలాడుతున్నారు. ఇతర దేశాలతో తాము సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్లు ఇప్పటికే తాలిబన్ల ప్రకటించారు. అయితే తాజాగా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు తాలిబన్లు లేఖ రాశారు.

Also Read:Trending: యాసిడ్ - జాన్వి డెస్టినేషన్ పెళ్లి... విందులో చికెన్ బిర్యానీ, ట్రెండవుతున్న పెళ్లి వీడియో

న్యూయార్క్‌లో ఈ వారం జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం ఇవ్వాలని కోరారు. దోహాలోని తమ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ను ఐరాసలో అఫ్గాన్‌ ప్రతినిధిగా తాలిబన్లు ప్రతిపాదించారు. ఈ మేరకు తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే అఫ్గాన్ ముందున్న అఫ్రాష్‌ ఘనీ ప్రభుత్వం తరపున ఐరాసకు ప్రాతినిధ్యం వహిస్తోన్న గులాం ఇసాక్జాయ్‌ ఇంకా కొనసాగుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం, అఫ్గానిస్థాన్‌ తరపున గులాం ఇసాక్జాయ్‌ ఈ సమావేశాల చివరి రోజున ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఇకపై ఆయన తమ దేశానికి ప్రాతినిధ్యం వహించరని తాలిబన్లు స్పష్టం చేశారు.

Also Read:Tumkur Condom Case: హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు!

ఈ లేఖను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ ధ్రువీకరించారు. తాలిబన్ల లేఖను 9 మంది సభ్యుల ఆధారాల కమిటీకి పంపినట్లు ఫర్హాన్ హక్‌ తెలిపారు. ఈ కమిటీలో అమెరికా, చైనా, రష్యా సభ్యులుగా ఉన్నాయి. మరి ఈ కమిటీ తాలిబన్ల విజ్ఞప్తిని అనుమతిస్తుందో లేదో చూడాలి.

Also Read:PM Modi US Visit: అమెరికా టూర్‌కు మోదీ పయనం.. బైడెన్‌తో భేటీపైనే అందరి దృష్టి

ఐరాస సమావేశాలు..

ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఉపన్యాసం సందర్భంగా ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్‌ ప్రపంచాన్ని హెచ్చరించారు. ఇదివరకు ఎన్నడూ చవిచూడని విధంగా యావత్‌ ప్రపంచం విపరీత సంక్షోభాలను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. కొవిడ్‌ విజృంభణ, వాతావరణ సంక్షోభం, అఫ్గానిస్థాన్‌ నుంచి ఇథియోపియా వరకు ఉద్రిక్త పరిస్థితులతోపాటు ఇతర దేశాల్లో శాంతికి విఘాతం కలిగిస్తున్న తిరుగుబాటు వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఐరాస పేర్కొంది. ఈ తరహా ఉపద్రవాన్ని లేదా విభజనను ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడలేదని అభిప్రాయపడింది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
Telangana Congress: మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
300 Kg Drugs Seized: గుజరాత్ తీరంలో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం, వాటి విలువ ఎంతో తెలుసా ?
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Embed widget