Speaker Om Birla: ప్రధాని మోదీపై దాడికి విపక్ష ఎంపీల కుట్ర - అందుకే సభకు రావొద్దన్నాను - స్పీకర్ బిర్లా సంచలన ప్రకటన
Lok Sabha:లోక్సభలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లా చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై దాడికి విపక్ష ఎంపీలు కుట్రచేశారని ఆరోపించారు.

Speaker Om Birla says he advised PM not to come to Lok Sabha: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాల్సి ఉండగా, లోక్సభలో విపక్షాల ఆందోళనల దృష్ట్యా స్పీకర్ ఓం బిర్లా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు ముందస్తు ప్రణాళికతో దాడి చేసే తరహాలో నిరసనలు తెలపడానికి సిద్ధమయ్యారని తనకు ఖచ్చితమైన సమాచారం ఉందని, అందుకే ప్రధానిని సభకు రావద్దని తానే స్వయంగా సూచించినట్లు స్పీకర్ వెల్లడించారు. దీనితో ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం సభలో ఆమోదం పొందింది.
సభలో విపక్షాల తీరును స్పీకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా బిజెపి ఎంపి నిషికాంత్ దూబే ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన ఛాంబర్కు వచ్చి ప్రవర్తించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రధానులపై నిషికాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రధాని మోదీ కేటాయించిన సీటు వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడం సభా మర్యాదలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు విపక్షాలు తమ వాదనను బలంగా వినిపిస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు, ప్రధానిని కూడా మాట్లాడనివ్వబోమని కాంగ్రెస్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, ఎంపీల సస్పెన్షన్ మరియు ఇతర పరిణామాలు ప్రజాస్వామ్యానికి మచ్చ అని రాహుల్ గాంధీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. నిషికాంత్ దూబే చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
There was unprecedented evidence that Congress MPs wanted to physically assault PM Modi yesterday. PM Modi did not come to the House on my request!
— Political Kida (@PoliticalKida) February 5, 2026
Lok Sabha Speaker Om Birla exposes just how low the Congress has stooped.
Planning to assault India’s Prime Minister? Absolute… pic.twitter.com/puqKAqEe0z
ఈ గందరగోళ పరిస్థితుల మధ్య, స్పీకర్ కార్యాలయం నిషికాంత్ దూబే ప్రసంగంలోని కొన్ని అభ్యంతరకర భాగాలను రికార్డుల నుండి తొలగించినట్లు తెలిపింది. అయితే, ప్రధాని సమాధానం చెప్పకుండానే ధన్యవాద తీర్మానం ఆమోదం పొందడం పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన, వివాదాస్పద అంశంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణం బడ్జెట్ సమావేశాల కొనసాగింపుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















