అన్వేషించండి

CM Jagan Nellore Tour: సీఎం పర్యటనకు భారీ బందోబస్తు, వామపక్ష నేతల హౌస్ అరెస్ట్

మరికాసేపట్లో సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

మరికాసేపట్లో సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ విజయరావు పర్యవేక్షించారు.

 

సిబ్బంది కేటాయింపు ఇలా..

ఏఎస్పీలు -4

డీఎస్పీలు -4

సీఐలు - 31

ఎస్సైలు - 96

ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు - 285

కానిస్టేబుళ్లు - 465

మహిళా పోలీస్ స్టాఫ్ -109

హోం గార్డ్ లు – 192

వీరితోపాటు ఏఆర్ కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ విజయరావుతో సమీక్షించారు. పర్యటన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.


CM Jagan Nellore Tour: సీఎం పర్యటనకు భారీ బందోబస్తు, వామపక్ష నేతల హౌస్ అరెస్ట్

సీఎం జగన్ పర్యటన ఇలా..

ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రయాణం

ఉదయం 10:55 గంటలకు కృష్ణపట్నం వద్ద హెలిప్యాడ్ కి చేరిక

11:10 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు నేలటూరులో పర్యటన

1.10నుంచి బహిరంగ సభ

సాయంత్రం 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరిక

ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం మూడు యూనిట్లతో ఇది పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు తొలి యూనిట్ ను 2015లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. ప్రస్తుతం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. మూడో యూనిట్ పనులు కూడా పూర్తికావడంతో సీఎం జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు.

అయితే థర్మల్ పవర్ ప్లాంట్ మూడో యూనిట్ ని జాతికి అంకితం చేసిన తర్వాత దాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నారు. ఈ ప్లాంట్ ప్రైవేటుపరం చేయొద్దని ఉద్యోగులు కోరుతున్నారు. వీరికి మద్దతుగా వామపక్షాలు ఉద్యమం మొదలు పెట్టాయి. జనసేన, టీడీపీ కూడా వారికి మద్దతిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న కారణంతో ప్రాజెక్ట్ ని లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటున్నారు ఉద్యమ నాయకులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, నాగార్జున సాగర్, శ్రీశైలం విద్యుత్ కేంద్రాలు సమర్థంగా నడుస్తున్నా.. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ ని ఎందుకు ప్రైవేటు పరం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాల ఉద్యమ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగించాలని అధికారులు హడావిడి పడుతున్నారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఈరోజు కొంతమంది వామపక్షాల నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బందోబస్తు విధుల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని సూచించారు జిల్లా ఎస్పీ. కేవలం ముఖ్యమైన నేతల్ని మాత్రమే జగన్ సభావేదికపైకి అనుమతిస్తున్నారు. సభకు వచ్చేవారి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభలో ఎక్కడా నినాదాలు కానీ, గొడవలు కానీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షరూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Mowgli 2025 OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
Bajaj Pulsar: భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
భారీ మార్పులతో పల్సర్ 150 భారత్‌లో రీలాంచ్! చేసిన మార్పులేంటో చూడండి!
Embed widget