అన్వేషించండి

PM Narendra Modi: రాత్రి 8 గంటలకు రెడీగా ఉండండి - సంచలన విషయాలు చెప్పబోతున్న ప్రధాని మోదీ

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాత్ర ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవల పాకిస్తాన్ తో ఘర్షణ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.

PM Narendra Modi Address To Nation Today Night at 8 PM: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు కీలక విషయాలు చెప్పనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ అంశంలో జరిగిన పరిణామాలు, కాల్పుల విరమణ గురించి మాట్లాడే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన రోజు రాత్రి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన  ఇండియా @ 2047 సమ్మిట్ లో ప్రసంగించారు. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ ను లైవ్ లో పర్యవేక్షించారు. అప్పటి నుంచి జరుగుతునన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ .. త్రివిధ దళాలు, అధికారులు,  మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. 

ఇప్పుడు అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఈ మొత్తం అంశంపై ప్రధాని దేశ ప్రజలకు కీలక విషయాలను చెప్పాలనుకుంటున్నరాు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ సాధించిన విజయాలతో పాటు పాకిస్తాన్ ను ఎలా దెబ్బ కొట్టాం అన్న అంశంపై వివరించే అవకాశం ఉంది. భారత త్రివిధ దళాల వీరత్వం గురించి మోదీ చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారత్ తన ధృడ వైఖరితో ఉందని.. పాకిస్తాన్ మరో సారి ఉగ్రవాద చర్యలకు పాల్పడితే సహించేది లేదని సంకేతాలు పంపే అవకాశాలు ఉన్నాయి. 

భారత్ , పాకిస్తాన్ మధ్య మిలటరీ జనరల్స్ స్థాయిలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ అంశంపైనా ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఉదయం  జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌, పాక్‌ చర్చల నేపథ్యంలో వివిధ అంశాల పై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రక్షణ ఉన్నతాధికారులతో  కూడా ప్రధాని సమావేశమయ్యారు. మిలటరీ జనరల్స్ స్థాయి చర్చల్లో    48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు , ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి.    పాక్ లో ఉన్న మసూద్ అజార్ తో పాటుగా టాప్ ఉగ్రవాదులను అప్పగించాలని భారత్ డిమాండ్ చేయనుంది.  

ప్రధానమంత్రి  మోదీ దేశప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. దేశ భద్రత విషయంలో  రాజీ పడేది లేదని.. ఎలాంటి యుద్దాలనైనా అవలీలగా అధిగమించే, గెలిచే సత్తా భారత్ సొంతమయిందని తెలిపే అవకాశం ఉంది.                               

టాప్ హెడ్ లైన్స్

విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget