India Pak Tension: చైనీస్ మిస్సైల్స్ వాడిన పాకిస్తాన్ - కూల్చేసిన భారత్ సైన్యం - కీలక విషయాలు వెల్లడిచిన సైనికాధికారులు
Army News: భారత్ పై వేయడానికి పాకిస్తాన్ కు చైనా ఆయుధాల సాయం చేసింది. చైనా PL 15 క్షిపణులను ప్రయోగింది. అయితే భారత్ వాటిని కూల్చివేసింది.

Chinese PL 15 missiles brought down by Indian air defence systems : భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కానీ మూడు, నాలుగు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణుల గురించి సంచలన విషయాలు వెలుగు చూశాయి. భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ దాడులు చేసిదంి. పాకిస్తాన్ ఉపయోగించిన వాటిలో చైనా తయారీ PL 15 క్షిపణులు కూడా ఉన్నాయి. వాటిని వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు భారత వైమానిక దళం సోమవారం (మే 12) ప్రకటించాయి.
పాక్ సైన్యానికి జరిగిన నష్టానికి పాకిస్తాన్ బాధ్యత వహించాలని సాయుధ దళాలు తెలిపాయి. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ బలంగా ఉందని , పాకిస్తాన్ ఆ వ్యవస్థ జొలికి రాలేకపోయిందని స్పష్టం చేసారు. మా పోరాటం ఉగ్రవాదులు , వారి మద్దతుగా ఉన్న వ్యవస్థలపైనేనని యిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ AN భారతి స్పష్టం చేశారు. తాము పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేయలేదన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని.. కానీ పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల తరపున పోరాడుతుండటం దురదృష్టకరమని ఎయిర్ మార్షల్ AN భారతి అన్నారు.
#WATCH | Delhi | The Indian military shows the debris of a likely PL-15 air-to-air missile, which is of Chinese origin and was used by Pakistan during the attack on India.
— ANI (@ANI) May 12, 2025
The wreckage of the Turkish-origin YIHA and Songar drones that were shot down by India has also been shown pic.twitter.com/kWIaIqnfkQ
పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది.. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం వాటిని అడ్డుకున్నామని ఏ ఎన్ భారతి తెలిపారు. . ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నామని తెలిపారు. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశామని తెలిపారు. పాక్ లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. నూర్ఖాన్ ఎయిర్బేస్ రన్ వే కు తీవ్ర నష్టం జరిగింది.
దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారని ఎయిర్ మార్షల్ సంతృప్తి వ్యక్తంచేశారు. శత్రువుల విమానాలను మన దేశం లోకి రాకుండా అడ్డుకున్నాం.. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి.. ఎలాంటి ఆపరేషన్కు అయినా మేం సన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పాక్కు జరిగిన డ్యామేజీ ఆ దేశం చెప్పుకోవడం లేదన్నారు. మరో వైపు భారతదేశం , పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మధ్య చర్చలు సోమవారం (మే 12) సాయంత్రం వరకు వాయిదా పడ్డాయి. ఈ రోజు మధ్యాహ్నం చర్చలు జరగాల్సి ఉంది.
దాడుల్లో భారత్ పూర్తిగా సంయమనం పాటించిందని.. సామాన్య ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అమాయక పౌరులను టార్గెట్ చేసుకుందని సైనికాధికారులు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు





















