News
News
X

PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ

PM Modi On Opposition: ప్రధాని మోదీ పార్లమెంట్‌ ప్రసంగంలో ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు.

FOLLOW US: 
Share:

PM Modi On Opposition: 

అన్నీ స్కామ్‌లే: కాంగ్రెస్ 

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య  పార్లమెంట్‌లో ప్రసంగించిన ఆయన పదేళ్ల యూపీఏ పాలనపై విరుచుకు పడ్డారు. ఆ దశాబ్ద కాలంలో అన్నీ స్కామ్‌లే జరిగాయని విమర్శించారు. 

"2004-14 మధ్య యూపీఏ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. హింస చెలరేగింది. యూపీఏ అసమర్థత కారణంగా ప్రతి అవకాశమూ సంక్షోభానికే దారి తీసింది. మోదీని తిట్టాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంటే...140 కోట్ల మంది ప్రజలు నన్ను కవచంలా రక్షిస్తున్నారు" 

- ప్రధాని నరేంద్ర మోదీ 

దేశంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ చూడలేకపోతోందని ఎద్దేవా చేశారు. అంతే కాదు. యూపీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ అస్యవ్యస్తంగా ఉందని అన్నారు. 

"2014కి ముందు 2004-14 వరకూ ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆ పదేళ్లలోనే ఎక్కువగా అవినీతి జరిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశం ఉగ్రవాదంతో వణికిపోయింది. హింస తప్ప అక్కడి ప్రజలు ఏ అభివృద్ధీ చూడలేకపోయారు. ఆ పదేళ్లలో అంతర్జాతీయంగా భారత్‌ చాలా బలహీనపడిపోయింది" 

- ప్రధాని నరేంద్ర మోదీ 

కాంగ్రెస్‌పై సెటైర్లు..

ఆ పదేళ్లలో చేసిన అవినీతి కారణంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు ఈడీ దాడులను ఎదుర్కొంటున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సెటైర్‌లు కూడా వేశారు. ఓటర్లు చేయలేని పని ఈడీ చేయగలిగిందని...ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేలా చేసిందని అన్నారు. విమర్శలకూ ఓ విధానం ఉంటుందని, అలా కాకుండా వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలు చేశారు మోదీ. హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియాకు వచ్చే విషయంపైనా మాట్లాడారు. 

"భారత్ ఆర్థిక వ్యవస్థ ఎలా దిగజారిపోతోందన్న విషయమే హార్వర్డ్ యూనివర్సిటీకీ ఓ కేస్‌ స్టడీ అవుతుందని కాంగ్రెస్ చెబుతోంది. కొన్నేళ్లుగా ఆ యూనివర్సిటీ ఓ స్టడీ చేసింది. రైజ్ అండ్ డిక్లైన్ ఆఫ్ కాంగ్రెస్ అనే టాపిక్‌పై అధ్యయనం చేసింది. భవిష్యత్‌లో హార్వర్డ్‌ యూనివర్సిటీతో పాటు ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ కాంగ్రెస్ పతనం గురించి చెప్పుకుంటారు" 

- ప్రధాని నరేంద్ర మోదీ 

అటు ప్రతిపక్షాలు మాత్రం అదానీ అంశంపై ప్రధాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాయి. అదాని..ప్రధాని ఫ్రెండ్ కాకపోయింటే ఇంత వరకూ విచారణ ఎందుకు జరిపించడం లేదని అడుగుతున్నాయి. ఈ విచారణకు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని ప్రసంగాన్ని
అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

Also Read: PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

Published at : 08 Feb 2023 06:15 PM (IST) Tags: PM Modi ED Enforcement directorate PM Modi Speech Parliament PM Modi on Opposition

సంబంధిత కథనాలు

Bihar Ram Navami Clash: బిహార్‌లో హై అలెర్ట్,అన్ని చోట్లా భద్రత కట్టుదిట్టం - రంగంలోకి అదనపు బలగాలు

Bihar Ram Navami Clash: బిహార్‌లో హై అలెర్ట్,అన్ని చోట్లా భద్రత కట్టుదిట్టం - రంగంలోకి అదనపు బలగాలు

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ