Parliament: దేశభద్రతపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు - భగ్గుమన్న బీజేపీ - ఇంతకీ నవరణె బుక్లో ఏముంది?
Parliament Budget Session : దేశభద్రతపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని పార్లమెంట్ లో దుమారం రేగింది. కల్పిత కథలను చెబుతూ దేశాన్ని కించ పరుస్తున్నారని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Parliament Budget Session Rahul Controversial Comments: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్సభలో దేశభద్రత అంశంపై తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశ భద్రతపై ఆరోపణలు చేశారు. భారత సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతోందని, కైలాష్ పర్వాతల వద్ద చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసినట్లుగా చెబుతున్న ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను ఆయన ఉటంకిస్తూ, దేశ రక్షణ సన్నద్ధతపై ప్రశ్నలు సంధించడం సభలో తీవ్ర దుమారానికి దారితీసింది.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోక్యం చేసుకుంటూ.. ఆధారాలు లేని, ఇంకా ప్రచురణకు నోచుకోని పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. దేశ భద్రత వంటి సున్నితమైన అంశంపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కల్పిత వాదనలు చేయడం సైన్యాన్ని అవమానించడమేనని రిజిజు మండిపడ్డారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట, నినాదాలతో సభ అట్టుడికిపోయింది.
BREAKING: Amit Shah demolishes Rahul Gandhi’s propaganda in under 2 minutes😂
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) February 2, 2026
Rahul waves a magazine claim, falsely attributing it to Narvane's book. Shah stands up, name the source in the House. Silent Rahul Gandhi couldn't speak a word because NGO SCRIPTS didn't have the… pic.twitter.com/fZ2fmnqKKm
ఈ గందరగోళంపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభా నిబంధనల ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలను లేదా అధికారికంగా ధృవీకరించని పుస్తకాలను సభలో ప్రామాణికంగా చూపకూడదని ఆయన స్పష్టం చేశారు. గౌరవ సభ్యులు సభా మర్యాదలను పాటించాలి. ఇది అత్యున్నత సభ, ఇక్కడ చేసే వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలి అని హితవు పలికారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించడానికి ప్రయత్నించినప్పటికీ, స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు.
#WATCH | Delhi | On Lok Sabha LoP Rahul Gandhi's statement in the Parliament, BJP MP Nishikant Dubey says, "What we say in Parliament is governed by Article 105 of the Constitution, which states that we have freedom of speech. Article 105 also states that the Speaker has to make… pic.twitter.com/Fj5728AbCR
— ANI (@ANI) February 2, 2026
అయినప్పటికీ సభలో గందరగోళం సద్దుమణగలేదు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అధికార పక్ష సభ్యులు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభను నియంత్రించడం సాధ్యం కాకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభను వాయిదా వేశారు. దేశభద్రత వంటి కీలక అంశంపై రాజకీయ పోరు సాగడం పట్ల సభా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
ట్రెండింగ్ వార్తలు






















