అన్వేషించండి

Pappu Yadav: లోక్‌సభలో ఎంపీ ’నీట్’గా నిరసన, అధికార పక్షం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన పప్పు యాదవ్!

Re NEET | దేశమంతటా నీట్ మీద చర్చ జరుగుతోన్న నేపథ్యంలో  బిహార్ నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన ఓ ఎంపీ తన ప్రమాణ స్వీకార సమయంలోనే నీట్ పై నిరసన తెలిపి కొత్త సంస్కృతికి తెరలేపారు. 

Pappu Yadav demands for Re NEET 2024 | దేశమంతటా నీట్ మీద చర్చ జరుగుతోన్న నేపథ్యంలో  బిహార్ రాష్ట్రం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన ఓ ఎంపీ తన ప్రమాణ స్వీకార సమయంలోనే నీట్ పరీక్షపై నిరసన తెలిపి కొత్త సంస్కృతికి తెరలేపారు. బిహార్ రాష్ట్రం పుర్నియా నుంచి ఎంపీగా ఎన్నికై మంగళవారం లోక్ సభలో ప్రమాణం చేసిన పప్పూ యాదవ్ రీనీట్ అని రాసి ఉన్న ఒక టీషర్ట్ వేసుకొచ్చారు. అయితే పప్పూ యాదవ్ అక్కడితో ఆగలేదు.

ప్రమాణం చేసిన అనంతరం సైతం.. రీ నీట్, బిహార్ కి స్పెషల్ స్టేటస్, సీమాంచల్ జిందాబాద్, మానవతా వాద్ జిందాబాద్, బీమ్ చిందాబాద్, సంవిధాన్ జిందాబాద్ అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే ట్రెజరీ బెంచ్ పై ఉన్న సభ్యుడితో ఆయనకు వాగ్వాదమూ జరిగింది. ప్రమాణం అనంతరం బెంచ్ సభ్యులు ఏదో అంటుంటే.. ‘‘నేను ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. ఏం చేయొచ్చో ఏం చేయకూడదో నాకు తెలుసు. మీరు గుంపుగా వస్తారు. కానీ నేను సింగిల్ గా వస్తాను. నాలుగో సారి ఇండిపెండెంట్ గా గెలిచాను. మీరు నాకు నేర్పిస్తారా?’’ అంటూ ఛైర్మన్ కి  షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పప్పూ యాదవ్ స్టేజ్ దిగారు.

ఆరు సార్లు ఎంపీ.. 

పప్పు యాదవ్ 1990 లో మొదటి సారి బిహార్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్తిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. అయితే 1991 లో తిరిగి లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికై ఎంపీ అవతారమెత్తారు. 1991, 1996, 1999, 2004, 2014, 2024 ఇలా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.  ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన ప్రస్తానం మొదలు పెట్టిన పప్పు యాదవ్ సమాజ్ వాదీ పార్టీ, లోక్ జన శక్తి పార్టీ, ఆర్‌జేడీ ఇలా పలు పార్టీల తరఫున పోటీ చేసి గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయా పార్టీలు బయటకు పంపినప్పుడల్లా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవారు. 2015లో ఆర్ జేడీ నుంచి ఆయన్ని బయటకు పంపగానే సొంతంగా  జన అధికార్ పార్టీని పెట్టారు అయితే ఆ పార్టీ కేవలం రెండు శాతం ఓటు బ్యాంకుతో పెద్దగా ప్రభావం చూపకపోవదంతో దాన్ని 2024 ఎన్నికల కు ముందు కాంగ్రెస్‌లో కలిపేశారు. 

వివాదాలకు కేంద్ర బిందువు.. 

పప్పు యాదవ్ ముందు నుంచీ వివాదలాకు కేంద్ర బిందువుగానే ఉన్నారు. 1998లో అజిత్ సర్కార్ అనే సీపీఎం నాయకుడి హత్య జరిగిన నేపథ్యంలో.. పప్పు యాదవ్ కు ఈ కేసుతో సంబంధం ఉందని 2008లో తేలింది. దీంతో ఆయన జైలుకెళ్లారు.  జైల్లో ఉంటూ కూడా పలు వివాదాలతో  వార్తల్లోకెక్కారు. నియంత్రణ లేకుండా సెల్ ఫోన్లు వాడారని, జైలు నుంచే పలువుర్ని సంప్రదించారని ఆయనపై ఆరోపణలున్నాయి. 2013లో  పాట్నా హైకోర్టు ఆయనపై ఈ కేసును కొట్టేసింది.  

2013లో తన ఆటో బయోగ్రఫీ విడుదల చేసిన పప్పూ యాదవ్.. 2001లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ముగ్గురు ఎంపీలకు డబ్బులివ్వడంతో వారు ఎన్ డీ ఏకు మద్దతిచ్చారని వెల్లడించారు. అలాగే 2008 అవిశ్వాస సమయంలో కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలు ఎంపీలకు 40 కోట్ల చొప్పున ఆఫర్ చేశాయని సైతం వెల్లడించి దుమారం లేపారు. 

2015లో ఓ ఎయిర్ హోస్టెస్ ని చెప్పుతో కొట్టినట్లూ ఆరోపణలెదుర్కొన్న పప్పూయాదవ్ 2021లో ఓ 32 ఏళ్ల వ్యక్తిని కడ్నాప్ చేశారన్న ఆరోెఫణలపై మరోసారి అరెస్టయ్యారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
Embed widget