అన్వేషించండి

Delhi Blast: ఢిల్లీలో పేలుడు విద్రోహక చర్య? ప్రమాదమా?

Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందారు. ఈ దుర్ఘటనకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను అరెస్టు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్రోహక చర్యలు చేపట్టేందుకు ఉగ్రవాదులు ప్లాన్‌లు వేస్తున్నట్టు ఇంటిలిజెన్స్‌ వర్గాలు పదే పదే రాష్ట్రాలకు చెబుతున్నాయి. మరోవైపు కేంద్రం కూడా భద్రతాబలగాలను అప్రమత్తం చేసి ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు. వారి సానుభూతిపరులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి వారికి ఉన్న శక్తులను నిర్వీర్యం చేస్తున్నారు. 

కేంద్రం తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉగ్రవాదులు తమ ఉనికి చాటుకునేందుకు ఈ పేలుడు జరిపి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. కేంద్రం దృష్టి మరల్చేందుకు, తాము ఏ స్థాయి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చినట్టు మరికొందరు భావిస్తున్నారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు కారణాలు ఇంత వరకు వెల్లడి కాలేదు. విచారణాధికారులు ఆ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.

పేలుడు జరిగిన కారు ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన పేలుడు కారణంగా చాలా విధ్వంసం జరిగింది. కారుకు సమీపంలో ఉన్న వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎగసిపడ్డ అగ్ని కీలలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. 

ఈ మధ్యకాలంలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు, పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వారు ఇస్తున్న సమాచారం బట్టి ఉగ్రచర్యలకు అడ్డుకట్ట వేస్తున్నారు ఆదివారం కూడా పలువురు ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన 24 గంటల్లోనే ఢిల్లీలో పేలుడు జరగడం షాక్‌కి గురి చేస్తోంది. ఈ మధ్య ఫరీదాబాద్‌లో ఉగ్రమూకల దుశ్చర్యను పోలీసులు ముందే పసిగట్టి ప్రమాదాన్ని నివారించారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఫరీదాబాద్‌లో ఉగ్రవాద దర్యాప్తునకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు లక్నోలోని లాల్ బాగ్ నివాసి డాక్టర్ షహీన్ షాహిద్ అనే మహిళా వైద్యుడిని అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం, డాక్టర్ షహీన్ కు చెందిన కారును ఇదే కేసులో గతంలో అరెస్టయిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ వాహనం నుంచి పోలీసులు ఒక రైఫిల్, లైవ్ కార్ట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నారు.

డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఎవరు?
పేలుడు పదార్థాలు, ఆయుధాలు గుర్తించి ధౌజ్ వసతి గృహంలో MBBS వైద్యుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్ షకీల్ ప్రస్తుతం అరెస్టులో ఉన్నాడని, ఉగ్రవాద నెట్‌వర్క్‌లో అతని ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు.

విలేకరుల సమావేశంలో ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నివేదికలలో వివిధ స్పెల్లింగ్‌లతో కనిపించే డాక్టర్ ముజమ్మిల్ ధౌజ్‌లోని అల్ ఫలా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థ అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం ఢిల్లీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. డాక్టర్ షకీల్ దాదాపు మూడు నెలల క్రితం ఈ వసతిని అద్దెకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉన్న మరో నిందితుడు డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్‌ను అరెస్టు చేసిన తర్వాత, అక్టోబర్ 30న జమ్మూ & కాశ్మీర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

విచారణ ప్రకారం, ఈ ఇద్దరు అనుమానితులను విచారిస్తున్న సమయంలో లభించిన నిఘా సమాచారం ఆదివారం ఫరీదాబాద్‌లో రికవరీ ఆపరేషన్‌కు దారితీసింది. ఇద్దరు వ్యక్తులు అనుమానిత సరిహద్దు సంబంధాలతో కూడిన పెద్ద ఉగ్రవాద మాడ్యూల్‌లో భాగమని, ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళికలు వేస్తున్నారని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి.

భద్రతా సంస్థలు ఇప్పుడు నిందితులతో సంబంధం ఉన్న అంతర్జాతీయ సంబంధాలు, నిధుల మార్గాలు, కమ్యూనికేషన్ మార్గాలను పరిశీలిస్తున్నాయి. దేశ రాజధానికి దగ్గరగా ఉన్న నగరంలో ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా హెచ్చరికలను జారీ చేసింది, అధికారులు ఏదైనా ముప్పును నివారించడానికి నిఘా, సమన్వయాన్ని కఠినతరం చేశారు.

వివిద రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్లు భావిస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడానికి ఏజెన్సీలు పనిచేస్తున్నందున దర్యాప్తు కొనసాగుతోంది. ఈ టైంలోనే ఢిల్లీలో భారీ పేలుడు జరగడంతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.   

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget