అన్వేషించండి

Spicejet Special Offers: అయోధ్య వెళ్లే భక్తులకు స్పైస్‌జెట్‌ స్పెషల్‌ ఆఫర్స్‌

Spicejet Discount: అయోధ్య వెళ్లేవారికి విమానయాన కంపెనీలు బంపర్‌ ఆఫర్లు ప్రకటించాయి. అయోధ్య టికెట్ల మీద భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

SpiceJet offers bookings starting at Rs 1622: ఎన్నో ఏళ్ల కల. ఆ రాముడి ఆగమనం కోసం ఎన్నో ఏళ్లు వేచి చూసిన రోజు రానే వచ్చింది. బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం (Ram mandir inauguration) అంగరంగ వైభవంగా జరిగింది. స్వయంగా అయోధ్యలో కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లే కాకుండా.. టీవీల ముందు కూర్చుని చూస్తున్న ప్రతి ఒక్కరు తన్మయత్వంలో మునిగిపోయారు. స్వయంగా అయోధ్యకు వెళ్లి ఆ స్వామి వారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు. అలా అయోధ్య వెళ్లేవారికి విమానయాన కంపెనీలు బంపర్‌ ఆఫర్లు ప్రకటించాయి. అయోధ్య (Ayodhya) టికెట్ల మీద భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

ఫ్లైట్‌ టికెట్స్‌పై స్పైస్‌జెట్‌ డిస్కౌంట్‌
ప్రముఖ విమాయనయాన సంస్థ స్పైస్‌జెట్‌ అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకునే వారికోసం ఫ్లైట్‌ టికెట్స్‌పై డిస్కౌంట్‌ ఇస్తోంది. అయోధ్య విమాన టికెట్‌ ప్రారంభ ధరను 1622గా ప్రకటించింది స్పైస్‌జెట్‌. రూల్స్‌కి అనుగుణంగా ప్రయాణికులు ప్రయాణ తేదీని మార్చుకోవచ్చని, దానికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి చెన్నై, అహ్మదాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్‌, పాట్నా, దర్బంగా నుంచి అయోధ్యకు డైరెక్ట్‌ ఫ్లైట్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల నుంచి దాదాపూ 200 విమానాల్లో అయోధ్య‌కు చేరుకునే సౌక‌ర్యం ఉంది. భార‌త్‌లో ప్రారంభ విమాన టికెట్ ధ‌ర రూ.5000 ఉండ‌గా.. ఇత‌ర దేశాల నుంచి అయోధ్య‌కు చేరుకునేందుకు విమాన‌యాన సంస్థ‌ను బ‌ట్టి టికెట్ ధ‌ర మారుతుంది. కానీ, స్పైస్‌జెట్ మాత్రం ప్ర‌త్యేక ఆఫ‌ర్ కింద రూ.1622కే అందిస్తుంది. జ‌న‌వ‌రి 22 నుంచి జ‌న‌వ‌రి 28 మ‌ధ్య బుక్ చేసుకుంటే జ‌న‌వ‌రి 22 నుంచి సెప్టెంబ‌ర్ 30,2024లోపు మీరు ఎప్పుడైనా ప్ర‌యాణించ‌వ‌చ్చు. తేదీల‌ను మార్చుకోవ‌చ్చు అని ప్రకటించింది. 

ఇప్పటికే ఆ రాములవారిని దర్శించుకునేందుకు ఎంతోమంది సన్నాహాలు చేసుకుంటున్నారు. రామ్‌లల్లాను చూసేందుకు ఎప్పుడెప్పుడు వెళ్దామా? అని ఉవ్విళూరుతున్నారు. కాగా.. అయోధ్యను చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రధాన రైల్వే స్టేషన్ల ఉంచి అయోధ్యకు రైళ్లను నడుపుతోంది మన ఇండియన్‌ రైల్వే. 

ఇక జనవరి 22న ప్రాణప్రతిష్ఠాపన అనంతరం.. జనవరి 23 నుంచే సామాన్య భక్తులకు రాములవారి దర్శనాన్ని కల్పిస్తోంది శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం కూడా అందిస్తోంది. కాగా.. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, ఆ తర్వాత 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. ఇక రాములవారికి రోజుకి 3 సార్లు హారతులు ఇస్తారు.

Read Also: మన రాముడొచ్చేశాడు, ఇక టెంట్‌లో ఉండాల్సిన ఖర్మ లేదు - ప్రధాని మోదీ భావోద్వేగం

టాప్ హెడ్ లైన్స్

Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
EPFO Interest Rate: 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు ఫిక్స్, ఖాతాల్లోకి జమ అయ్యేది ఎప్పుడంటే
7 కోట్ల పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు ఫిక్స్, ఖాతాల్లోకి జమ అయ్యేది ఎప్పుడంటే

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Embed widget