అన్వేషించండి

Ram Mandir: మన రాముడొచ్చేశాడు, ఇక టెంట్‌లో ఉండాల్సిన ఖర్మ లేదు - ప్రధాని మోదీ భావోద్వేగం

Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తరవాత ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు.

Ayodhya Ram Mandir Opening: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని అన్నారు. ఎన్నో శతాబ్దాల తరవాత అయోధ్యకు రాముడు వచ్చాడని అన్నారు. ఇకపై రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. శ్రీరామ చంద్రమూర్తి జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఆద్యంతం ఎమోషనల్‌గా మాట్లాడారు. జనవరి 22 అనేది కేవలం క్యాలెండర్‌లో ఓ తేదీ కాదని, నవశకానికి ప్రారంభం అని వెల్లడించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ తనకు అలౌకిక ఆనందాన్నిస్తోందని అన్నారు. 

రామ భక్తులందరికీ ప్రణామాలు చేశారు. ఎన్నో శతాబ్దాలుగా రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయని, ఇన్నాళ్లకు అవన్నీ తొలగిపోయాయని అన్నారు. రాముడికి మందిరం నిర్మించాలనుకునే సంకల్పంలో ఎక్కడో లోపం ఉండి ఉండొచ్చని..అందుకే ఇంత ఆలస్యమైందని చెప్పారు.

"ఇవాళ దేశమంతా అలౌకిక ఆనందంలో మునిగిపోయింది. ఇన్నేళ్ల నిరీక్షణ తరవాత మన అయోధ్యకు రాముడు వచ్చేశాడు. ఇకపై మన రామయ్య టెంట్‌లో ఉండాల్సిన ఖర్మ లేదు. ఆయన కోసం ఇవాళ భారీ మందిరం నిర్మించాం. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఈ రోజు క్యాలెండర్‌లో కేవలం ఓ తేదీ కాదు. ఇది నవశకానికి ప్రారంభం. రామ భక్తులందరికీ ప్రణామాలు"

- ప్రధాని నరేంద్ర మోదీ


ఈ సమయంలో రాముడి గొప్పదనాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. రాముడే ఈ దేశ విశ్వాసం అని ఆయన పాఠాలే దేశానికి చట్టంగా మారిందని వెల్లడించారు. ఈ దేశ గర్వం, గౌరవం అన్నీ రాముడే అంటూ కీర్తించారు. అలాంటి రాముడికి తగ్గ స్థానం ఇస్తే ఆ ప్రభావం మన దేశంపై వేల ఏళ్ల పాటు నిలిచి ఉంటుందని తేల్చి చెప్పారు. 

"ఈ రామ మందిరం జాతిని మొత్తం మేల్కొల్పుతుంది. భారత దేశ విశ్వాసం, పునాది, గర్వం, గౌరవం..అన్నీ శ్రీరామ చంద్రుడే. మన భరత జాతి కీర్తి వెలుగొందింది ఆయన వల్లే. ఆయన చెప్పిందే మన దేశం అనుసరిస్తున్న చట్టం. ఆయనకు తగిన గౌరవం ఇస్తే ఆ కటాక్షం, ప్రభావం మన దేశంపై శతాబ్దాలు మాత్రమే కాదు..వేలాది సంవత్సరాలు ఉంటుంది"

- ప్రధాని నరేంద్ర మోదీ 

 

ప్రాణ ప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు కఠిన దీక్షను చేపట్టినట్టు చెప్పారు ప్రధాని మోదీ. ఈ 11 రోజుల్లో దేశంలోని ప్రముఖ రామాలయాలను సందర్శించానని, అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నానని వెల్లడించారు. భాష ఏదైనా రాముడిపై భక్తి మాత్రం ఒకటే అని స్పష్టం చేశారు. రాముడు వివాదం కాదని, ఎన్నో ప్రశ్నలకు సమాధానం అని తేల్చి చెప్పారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాల తరవాత ఈ అపురూప ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు. రాముడు అయోధ్య వీడినప్పుడు ప్రజలు కేవలం 14 ఏళ్ల పాటు మాత్రమే ఆయనకు దూరమయ్యారని, కానీ ఇప్పుడు భారతీయులు వందల ఏళ్ల పాటు రాముడి దూరమైపోయారని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War: గల్ఫ్ దేశాల్లోని 8 ప్రధాన వంతెనలు పేల్చేస్తాం! అమెరికా- ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా హిట్‌ లిస్ట్ విడుదల చేసిన ఇరాన్!
గల్ఫ్ దేశాల్లోని 8 ప్రధాన వంతెనలు పేల్చేస్తాం! అమెరికా- ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా హిట్‌ లిస్ట్ విడుదల చేసిన ఇరాన్!
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Eiffel Tower : వేలానికి ఈఫిల్‌ టవర్‌ మెట్టు! ప్రారంభ ధర కోటి రూపాయలు!
వేలానికి ఈఫిల్‌ టవర్‌ మెట్టు! ప్రారంభ ధర కోటి రూపాయలు!

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Biker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Mrithyunjay OTT : ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
Embed widget