అన్వేషించండి

Pamban Rail Bridge:ఫెయిత్ అండ్ ప్రోగ్రెస్‌ బ్రిడ్జ్‌; రామనవమి నాడు పీఎం ప్రారంభించే పంబన్ రైలు వంతెన ప్రత్యేకతేంటీ?

Pamban Rail Bridge:ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ పంబన్ వంతెన ప్రారంభించనన్నారు. ఈ బ్రిడ్జ్‌ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలవబోతోంది.

Pamban Rail Bridge: భారత దేశ రైల్వే నెట్‌వర్క్‌లో ఇంకో మైలు రాయి. ఏప్రిల్ 6, 2025న దేశం రామనవమి జరుపుకుంటున్న టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామేశ్వరంలో పంబన్ రైలు వంతెన ప్రారంభించనున్నారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. చాలా ఏళ్ల నుంచి ఇదో కలల ప్రాజెక్టుగా మారిపోయింది. ఇన్నాళ్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలక ఆనందానికి అవదుల్లేవు. 

ఉత్తరాన ఆయోధ్య రాముడి ఆలయం ఉంటే దక్షిణాన రాముడు కట్టించిన వంతెన ఉంది. అలాంటి శ్రీరాముడు నడయాడిన ప్రాంతం నిర్మింతమైన వంతెన ప్రారంభం మర్చిపోలేని ఘట్టం. రామేశ్వరం తమిళనాడులోని తీరప్రాంత పట్టణం. ఇది పురాణాలతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశం.  

కొత్త బ్రిడ్జి ఎందుకు నిర్మించారు

పంబన్ రైలు వంతెన ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్‌ నుంచి రామేశ్వరం ద్వీపం వరకు 2.08 కిలోమీటర్లు విస్తరించి ఉంది. బ్రిటీష్ కాలంలో 1914లో ఇక్కడ ఓ బ్రిడ్జ్‌ నిర్మించారు. వందేళ్ల పాటు సేవలు అందించిన పాతి వంతెన అది శిథిలావస్థకు చేరుకుంది. అందుకే దాన్ని 2022 డిసెంబర్‌లో క్లోజ్ చేశారు. అద్భుతమైన డిజైన్‌తో పాత వంతెన కంటే వెయి రెట్లు మన్నిక కలిగిన అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త వంతెన నిర్మాణం చేపట్టారు. 

2019లో శంకుస్థాపన చేసిన మోదీ

రామనాథ్ స్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికుల కోసం స్థానికుల కోసం వంతెనే చాలా కీలకం. రామేశ్వరాన్ని భారత్‌తో అనుసంధానించేది కూడా ఇదే వంతెన. అందుకే పాత వంతెనకు రిపేర్లు చేసినా ప్రయోజనం లేదని గ్రహించిన ప్రభుత్వం కొత్త బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. 2019లో కొత్త వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 

నేటి కాలంలో ఇంజినీరింగ్ అద్భుతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే 2019లో పునాదిరాయి పడింది. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా జరగుతుంది. 550 కోట్ల రూపాయల అంచనాలతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్‌ వికాస్ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రారిభించింది. తుపానుల తాకిడి, కరోనా అలజడి ఇలా చాలా సమస్యలు ఈ వంతెనకు అడ్డుపడ్డాయి. ప్రజల ఆకాంక్ష, ఇంజినీర్ల పట్టుదల, ప్రభుత్వ సంకల్పంతో మానవ అద్భుతం ఆవిష్కృతమైంది. 

ఇందులో 99 స్పాన్లు ఉన్నాయి. 72.5 మీటర్ల నిటారుగా ఉంటే లిఫ్ట్‌ స్పాన్ మరో అద్భుతం. ఇక్కడ ఉండే లిఫ్టులను 17 మీటర్ల ఎత్తు వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. దీన్ని చూసిన వాళ్లు ఇంజినీర్ల ప్రతిభను కొనియాడకుండా ఉండలేరు. సాధారణంగా రోడ్డులకు అడ్డగా రైల్వే ట్రాక్‌లు నిర్మించి ప్రత్యేకంగా గేట్లు పెట్టినట్టుగానే ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. సముద్రానికి అడ్డంగా వంతెన రైల్వే ట్రాక్ వేశారు. అయితే ఈ రైల్వే ట్రాక్ కారణంగా ఓడలు వెళ్లి వచ్చేందుకు ఇబ్బంది ఉందని ప్రత్యేకంగా లిఫ్ట్‌లు పెట్టారు. 

ఓడలు వచ్చినప్పుడు రైల్వే ట్రాక్‌ ఓడ ఎత్తు వరకు పైకి లేస్తుంది. పాత బ్రిడ్జ్ ని మనుషులే లేపేవాళ్లు. దీనికి చాలా సమయం పట్టేది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండేలా హైడ్రాలిక్ యంత్రాలతో ఈ రైల్వే ట్రాక్‌ను పైకి లేపుతారు. ఇది దాదాపు 17 మీటర్ల ఎత్తు వరకు లేపవచ్చు. అది కూడా ఐదు నిమిషాల్లో ప్రక్రియ పూర్తి కానుంది. దీని వల్ల రైళ్ల ప్రయాణానికి కూడా అంతరాయం లేకుండా నిర్మాణాలు చేపట్టారు.  

తుప్పు పట్టకుండా ఏర్పాట్లు

సాధారణంగా సముద్ర ప్రాంతంలో కట్టడాలు త్వరగా తుప్పు పట్టేస్తాయి. అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు ఈ బ్రిడ్జ్‌కు పాలీసిలోక్సేన్ పూత పూశారు. సముద్ర వాతావరణాన్ని తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది.    

పురాతనాలతో సంబంధం

చార్‌ధామ్ తీర్థయాత్ర ప్రదేశాల్లో రామనాథస్వామి ఆలయం ఒకటిగా ఉంది. అలాంటి ప్రదేశానికి దారి చూపే రైలు వంతెన శ్రీరామనవమి రోజున ప్రారంభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంతో శ్రీరాముడికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉందని చెబుతారు. ఇక్కడ ఉన్న ధనుష్కోడి ప్రాంతంలోనే సీతను రక్షించడానికి లంక వెళ్లేందుకు రామసేతు నిర్మించాడని పురాణాలు చెబుతాయి.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం రామేశ్వరం చేరుకొని మధ్యాహ్నం వంతెన ప్రారంభిస్తారు. రామేశ్వరం తాంబరం రైల్ సర్వీస, కోస్ట్ గార్డ్ షిప్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రామనాథస్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రార్థనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget