అన్వేషించండి

ఇండియాకి ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది, ఒకే దేశం ఒకే ఎన్నిక కమిటీపై బీజేపీ నేతల ప్రశంసలు

One Nation One Election: ఒకే దేశం ఒకే ఎన్నికపై కమిటీ వేయడాన్ని కేంద్రం సమర్థించుకుంటోంది.

One Nation One Election:


ప్రత్యేక కమిటీ..

ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ వేయడాన్ని సమర్థించుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇది భారత దేశానికి ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్ అని అసో సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. One Nation, One Election కి సంబంధించి బిల్‌ని ప్రవేశపెట్టేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చినట్టూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కేవలం కమిటీ మాత్రమే వేశామని, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

"ప్రస్తుతానికి కమిటీ మాత్రమే ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అన్ని అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించిన తరవాతే దీనిపై పూర్తిస్థాయిలో చర్చిస్తాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో మరో రెండు మూడు రోజుల్లో ఖరారవుతుంది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 1967వరకూ లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ విప్లవాత్మక నిర్ణయం అనే భావిస్తున్నాను."

- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా కేంద్ర నిర్ణయాన్ని సమర్థించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌తో ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకోవచ్చని అన్నారు. 

"ఇది చాలా మంచి ప్రతిపాదన. దేశంలో పదేపదే ఎన్నికలు జరగడం వల్ల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా పలు చోట్ల అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు అంతరాయం కలుగుతోంది. విలువైన వనరులు వృథా అవుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వల్ల డబ్బు వృథా కాకుండా అడ్డుకోవచ్చు"

- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం

ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరం అని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించడం మంచి ఆలోచన అని వెల్లడించారు. 

"ఎన్నికలు పదేపదే రావడం వల్ల కొత్త అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. కొత్త పాలసీలనూ ప్రవేశపెట్టడానికి వీల్లేకుండా పోతోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం అత్యవసరం. ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను"

- యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 

 

టాప్ హెడ్ లైన్స్

Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Breaking News: గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
గచ్చిబౌలిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఆరో అంతస్తు నుంచి దూకడంతో విషాదం
US Woman Liz Shocked Indian Medicine Prices Cancer: అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
New Jersey Indian Grocery Store Parval Sale: కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా !
కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా ! వీడియో

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Embed widget