అన్వేషించండి

Earthquakes List in India: భారతదేశాన్ని అల్లాడించిన అతిపెద్ద భూకంపాలు ఇవే!

Earthquakes List in India: భారతదేశాన్ని కూడా భూకంపాలు అల్లాడించాయి. చాలా రాష్ట్రాల్లో అతిపెద్ద భూకంపాలు సంభవించి ఆనేక ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లాయి. ఆ జాబితాను ఓసారి చూద్దామా..!

Earthquakes List in India: టర్కీ-సిరియాలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 5000 మందికిపైగా చనిపోగా 15 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే మన దేశంలోనూ ఇలాంటి పెద్ద పెద్ద భూకంపాలు చాలా సార్లు వచ్చాయి. 

1. గుజరాత్ భూకంపం (2001)
26 జనవరి 2001న భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్‌ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది ఉదయం 8.40 గంటలకు సంభవించగా.. దాదాపు రెండు నిమిషాల పాటు కొనసాగింది. అధిక తీవ్రత కారణంగా ఇది వాయువ్య భారతదేశం అంతటా, పొరుగు దేశం పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో కనిపించింది. ఈ విపత్తుతో అనేక గ్రామాలు, పట్టణాలు ధ్వంసం అయ్యాయి. 20,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.


2. బిహార్ భూకంపం (1934), బిహార్-నేపాల్ భూకంపం
భారతదేశ చరిత్రలో ఇది అత్యంత విధ్వంసకర భూకంపాలలో ఒకటి. ఇది జనవరి 15వ తేదీ 1934న బిహార్‌ను తాకింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైంది. ఈ విపత్తులో 30 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎక్కువగా ఉత్తర బిహార్, నేపాల్ పరిసర ప్రాంతాలను ప్రభావితం చేసింది. బిహార్‌లోని ముంగేర్, పూర్నియా, చంపారన్, ముజఫర్‌పూర్, నేపాల్‌లోని ఖాట్మండు, పటాన్, భక్తపూర్ ప్రాంతాల‌్లో భూకంపం తీవ్రంగా ప్రభావితమైంది.

3. మహారాష్ట్ర భూకంపం (1993)
మహారాష్ట్ర భూకంపాన్ని లాతూర్ భూకంపం అని కూడా అంటారు. ఇది భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీ 1993 ఉదయం 3.56 గంటలకు సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. భూకంప కేంద్రం లాతూర్ జిల్లాలోని కిల్లారి గ్రామంలో ఉంది. ఈ భూకంపంలో 20 వేల మందికిపైగా మరణించారు. లాతూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ఇది కాకుండా ఈ విపత్తులో దాదాపు 52 గ్రామాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) స్థాపించబడింది.

4. అస్సాం భూకంపం (1950)
అస్సాం భూకంపం 20వ శతాబ్దంలో సంభవించిన అత్యంత వినాశకరమైన భూకంపాల‌్లో ఒకటి. దీనిని మెడోగ్ భూకంపం లేదా అస్సాం-టిబెట్ భూకంపం అని కూడా అంటారు. ఇది 1950 ఆగస్టు 15న రాత్రి 7.39 గంటలకు రిక్టర్ స్కేలుపై 8.6 తీవ్రతతో సంభవించింది. దీని కేంద్రం టిబెట్‌లోని రిమా వద్ద ఉంది. ఇది టిబెట్, అస్సాం రెండింటినీ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ భూకంపంలో దాదాపు 5000 మంది మరణించగా.. వారిలో 1500 మంది అస్సాంకు చెందినవారే.

5. ఉత్తరకాశీ భూకంపం (1991)
ఉత్తరకాశీ భూకంపాన్ని గర్వాల్ భూకంపం అని కూడా అంటారు. ఇది ఉత్తర భారతదేశంలోని గర్హ్వాల్ హిమాలయాల్లో 20 అక్టోబర్ 1991 ఉదయం 2.53 గంటలకు సంభవించింది. బాడీ వేవ్ డేటా ఆధారంగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా ఉంది. ఐఎండీ ప్రకారం.. దాని కేంద్రం ఉత్తరకాశీకి 160 కి.మీ దూరంలో అల్మోరా సమీపంలో ఉంది. ఇది ప్రధానంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ, తెహ్రీ, చమోలి జిల్లాలను ప్రభావితం చేసింది. అధికారిక సమాచారం ప్రకారం, 1294 గ్రామాలలో నివసిస్తున్న 3 లక్షల 7 వేల మంది ప్రజలు ప్రభావితమయ్యారు మొత్తం 768 మంది చనిపోయారు. సుమారు 5000 మంది గాయపడ్డారు. 3 వేల పశువులు కూడా మృతి చెందాయి. దీని ప్రకంపనలు భారతదేశ రాజధాని నగరం న్యూఢిల్లీ వరకు అనుభూతి చెందాయి.

6. జబల్‌పూర్ భూకంపం (1997)
భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో 22 మే 1997 ఉదయం 421 గంటలకు జబల్ పూర్ లో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కోశంఘాట్ గ్రామానికి సమీపంలో ఉంది. జియాలజిస్ట్ డాక్టర్ వి. సుబ్రమణ్యన్ ప్రకారం.. ఈ భూకంపానికి కారణం నర్మదా లోపంపై కదలిక. జబల్‌పూర్, సియోని, చింద్వారా మండల్ జిల్లాలు ఈ భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. 30 మందికి పైగా మరణించారు. ఇది కాకుండా ఈ విపత్తు కారణంగా 887 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. ఇందులో 8 వేల 546 ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 52 వేల 690 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా ప్రభావిత జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేఖాంశ భూమి పగుళ్లు కూడా గమనించబడ్డాయి.

7. సిక్కిం భూకంపం (2011)
సిక్కిం భూకంపాన్ని 2011 హిమాలయ భూకంపం అని కూడా అంటారు. ఇది 18 సెప్టెంబర్ 2011 సాయంత్రం 6.10 గంటలకు సిక్కిం, నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న కాంచనజంగా పరిరక్షణ ప్రాంతంలో సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. దాని కేంద్రం సిక్కింలోని గాంగ్‌టక్‌కు వాయువ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో సిక్కిం-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉంది. దీని ప్రభావం భూటాన్, నేపాల్, దక్షిణ టిబెట్, బంగ్లాదేశ్‌తో సహా ఈశాన్య భారతదేశం అంతటా కనిపించింది. ఈ భూకంపంలో దాదాపు 110 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది సిక్కింకు చెందినవారు. సోనిపట్ జిల్లాలో జరిగిన కొద్ది రోజులకే ఈ భూకంపం సంభవించింది

8. హిందూ మహాసముద్రం భూకంపం (2004)
హిందూ మహాసముద్రం భూకంపాన్ని బాక్సింగ్ డే సునామీ అని కూడా పిలుస్తారు. ఇది 26 డిసెంబర్ 2004న ఉదయం 7.58 గంటలకు సంభవించింది. దీని కేంద్రం ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా పశ్చిమ తీరంలో ఉంది. ఇది మెర్కల్లీ తీవ్రత స్కేల్‌పై 9.1-9.3గా నమోదైన సముద్రగర్భ మెగాథ్రస్ట్ భూకంపం. ఈ సునామీ వల్ల హిందూ మహాసముద్రం పక్కనే ఉన్న దేశాలు ప్రభావితం అయ్యాయి. ఈ విపత్తులో 2 లక్షల మందికి పైగా మరణించారు.

9. కాశ్మీర్ భూకంపం (2005)
కశ్మీర్ భూకంపం అక్టోబర్ 8వ తేదీ 2005న ఉదయం 8.050 గంటలకు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. దీని కేంద్రం పాకిస్థాన్‌లోని పీఓకే వద్ద ఉన్నట్లు గుర్తించారు. భారతదేశం, పాకిస్తాన్‌, చైనా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో కూడా ఇది కనిపించింది. ఈ విపత్తు కారణంగా 80 వేల మందికి పైగా మరణించారు. సుమారు 70 వేల మంది గాయపడ్డారు. సుమారు 3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. అయితే 65 శాతానికి పైగా మరణాలు పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్‌లో మాత్రమే నమోదయ్యాయి.

10. అండమాన్ & నికోబార్ భూకంపం (1941)
1941 అండమాన్ భూకంపం భారతదేశంలోని అండమాన్, నికోబార్‌లో సంభవించిన బలమైన భూకంపాలలో ఒకటి. ఇది జూన్ 26వ తేదీ 1941 రాత్రి 11.52 గంటలకు సంభవించింది. ఇది 8.1 ఎండబ్ల్యూ పరిమాణంలో కొలుస్తారు. దాని హైపోసెంటర్ చాలా లోతుగా లేదు. కాబట్టి భారతదేశం తూర్పు తీరం, శ్రీలంక, కొలంబోతో సహా దీవుల అంతటా భయంకరమైన ప్రకంపనలు ఏర్పడ్డాయి. అండమాన్ దీవులు, పొరుగు దేశాలైన థాయిలాండ్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ఈ భూకంపం సునామీ కారణంగా సుమారు 8 వేల మంది మరణించారని చెబుతుంటారు. కానీ మృతుల సంఖ్యపై ఇప్పటికీ సరైన గణాంకాలు లేవు.

11. కిన్నౌర్ భూకంపం (1975)
కిన్నౌర్ భూకంపం జనవరి 19వ తేదీ 1975 ఉదయం 8.02 గంటలకు సంభవించింది. ఉపరితల తరంగ తీవ్రత స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. దీని తీవ్రత కారణంగా భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. దీని భూకంప కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగంలో కిన్నౌర్ జిల్లాలో ఉంది. దాదాపు 50 మంది ఈ విపత్తు కారణంగా మరణించారు. ఈ భూకంపం హిందూస్థాన్-టిబెట్ రహదారికి నష్టం కలిగించింది. రాష్ట్రంలోని వివిధ మఠాలు, భవనాలు, నిర్మాణ పనులను ప్రభావితం చేసింది. భూకంప కేంద్రం వద్ద అనేక పగుళ్లు ఏర్పడ్డాయి.

12. కోయనానగర్ భూకంపం (1967)
కోయినానగర్ భూకంపం డిసెంబర్ 11వ తేదీ 1967న భారతదేశంలోని నైరుతి ప్రాంతంలోని కోయినా డ్యామ్‌కు సమీపంలో సంభవించింది. ఉపరితల వేవ్ మాగ్నిట్యూడ్ స్కేల్‌పై దీని పరిమాణం 6.5గా కొలుస్తారు. 338 అడుగుల ఎత్తు, 2800 అడుగుల పొడవు ఉన్న కోయినా డ్యామ్ ఈ భూకంపం కేంద్ర-ప్రాంతంలో ఉన్నందున నిర్మాణాత్మకంగా దెబ్బతింది. జబల్‌పూర్, సియోని, చింద్వారా, మండల్ జిల్లాలు ఈ భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు కారణంగా దాదాపు 200 మంది మరణించారు. 887 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. వీటిలో 8 వేల 546 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 52 వేల 690 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

13. కాంగ్రా భూకంపం (1905)
కాంగ్రా లోయలో ఏప్రిల్ 4వ తేదీ 1905 ఉదయం 6.19 గంటలకు కంగ్రా భూకంపం సంభవించింది. ప్రస్తుతానికి ఈ ప్రాంతం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌కు చెందింది. ఉపరితల తరంగ తీవ్రత స్కేల్‌లో ఈ భూకంపం 7.8గా నమోదైంది. ఈ భూకంపంలో సుమారు 20 వేల మంది మరణించారు. దాదాపు 53 వేల పశువులు కూడా చనిపోయాయి. కాంగ్రా కోట, కాంగ్రా ఆలయం, సిధ్‌నాథ్ దేవాలయం వంటి చారిత్రక కట్టడాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బైజంత్ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. ఆ సమయంలో (1905) ఈ విపత్తు కారణంగా జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి అయ్యే ఖర్చు దాదాపు 3 మిలియన్లు.

14. అంజర్ భూకంపం (1956)
అంజర్ భూకంపం జూలై 21వ తేదీ 1956న 3.32 గంటలకు సంభవించింది. ఇది ఉపరితల తరంగ పరిమాణంపై 6.1గా నమోదైంది. మొర్కల్లీ తీవ్రత స్కేల్‌లో దాని గరిష్ట తీవ్రత IXగా గుర్తించబడింది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని అంజర్ పట్టణంలో అత్యధిక విధ్వంసం జరిగంది. ఇతర ప్రభావిత పట్టణాలు కేరా, భుజ్, భచౌ, కాండ్లా, గాంధీధామ్. దాని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ విపత్తు వల్ల దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 గ్రామాలకు చెందిన 3 వేల ఇళ్లు భారీ పగుళ్లను అభివృద్ధి చేశాయి.

15. చమోలీ భూకంపం (1999)
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో మార్చి 29న భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. చమోలీతో పాటు, ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్, రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ, బాగేశ్వర్, పౌరీ గర్వాల్ వంటి అనేక ఇతర జిల్లాలపై ఈ భూకంపం ప్రభావం పడింది. చమోలి, రుద్రప్రయాగ ఈ భూకంపంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, సిమ్లా, హరిద్వార్, సహరాన్‌పూర్, బిజ్నోర్, మీరట్ మొదలైన ప్రాంతాలపైనా ఈ భూకంపం ప్రభావం చూపించింది. దాదాపు 103 మంది మరణించారు. దాదాపు 50 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు 2 వేల గ్రామాలు ఈ విపత్తులో దెబ్బతిన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Embed widget