అన్వేషించండి

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు

National News: జమిలి ఎన్నికల బిల్లులపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ విషయంలో కేంద్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి 2 బిల్లులను తొలగించారు.

Central Government Re Thiniking On Jamaili Elections: జమిలీ ఎన్నికల (Jamili Elections) బిల్లులపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా.. లోకసభ బిజినెస్ జాబితా నుంచి ఈ 2 బిల్లులను తొలగించారు. తొలుత ఈ నెల 16న లోక్‌సభ (Loksabha) ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లు ప్రవేశపెడతారని కేంద్రం ప్రకటించింది. అయితే, ఉన్న పళంగా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ నెల 20 వరకే పార్లమెంట్ సమావేశాలు జరగనుండగా.. సెషన్‌లో బిల్లు పెడతారా అన్న అంశంపై సందేహాలు నెలకొన్నాయి. అసలు ఉన్నట్లుండి బిల్లు ఆపాలన్న నిర్ణయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అమిత్ షా కీలక వ్యాఖ్యలు

'జమిలి ఎన్నికల'ను ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' కొత్తగా వచ్చింది కాదని.. గతంలో కూడా భారత్‌లో ఈ విధానాన్ని అనుసరించామని చెప్పారు. 1952లో అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగాయని.. దేశంలో మూడుసార్లు జమిలి ఎన్నికలు నిర్వహించామని అన్నారు. 'కేరళలోని సీపీఐ (ఎం) ప్రభుత్వాన్ని మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విచ్ఛిన్న చేసిన తర్వాత ఈ విధానం మరుగున పడింది. 1971లో ఇందిరాగాంధీ హయాంలో కేవలం ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో లోక్‌సభ గడువు ముగియక ముందే రద్దు చేశారు. నాటి నుంచి దేశంలో ఎన్నికలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలు అసంబద్ధమైనవి.' అని అమిత్ షా పేర్కొన్నారు.

జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం లేదని హోంమంత్రి అన్నారు. దేశంలో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల భారీగా ఖర్చు కావడం సహా సమయం కూడా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజాధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు. ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఆయా అసెంబ్లీలు/లోక్‌సభకు మాత్రమే ఐదేళ్లలో మిగిలి ఉన్న కాలం కోసం మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని అసెంబ్లీ, లోక్‌సభతో పాటే జమిలి ఎన్నికలు జరుగుతాయన్నారు. కేంద్ర కేబినెట్ 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లుకు ఆమోదం తెలిపిన కొన్ని గంటల తర్వాత అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. ఈ బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడింది.

Also Read: Pakistan first Hindu police officer: పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్లలో ఒకే ఒక్కడు రాజేందర్ - హిందువే కానీ పాకిస్థానీ !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
AP Local Body Elections: స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
AP Congress new incharge: ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు - పీసీ మోహన్ రాకతో జాతకం మారుతుందా? ఓటు బ్యాంకు తిరిగొస్తుందా?
Saifabad పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
పీఎస్‌లో పీఏ, పీఆర్వోలపై దాడిపై కేటీఆర్ మండిపాటు.. నిజం కాదన్న ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Embed widget