అన్వేషించండి

Cycle Yatra Beyond Borders: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి

Warangal News: సైకిల్‌పై ప్రపంచాన్నే చుట్టేస్తున్నాడో యువకుడు. తండ్రి కోరికను ఇలా నెరవేరుస్తున్నాడు. తక్కువ ఖర్చుతో దేశాలు తిరిగి రావడమే కాకుండా ఆక్టివ్ మొబిలిటీపై అవగాహన కల్పిస్తున్నాడు.

Warangal News Today: వరంగల్‌ జిల్లా గిర్మాజీపేట గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, సైక్లింగ్ ద్వారా ప్రపంచ దేశాలను అన్వేషిస్తున్నాడు. భారతదేశాన్ని అతి తక్కువ ఖర్చుతో అన్వేషించాలని రంజిత్ తండ్రి కలగన్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి సమయంలో తన తండ్రిని కోల్పోయిన రంజిత్, ఆ కలను సాకారం చేసేందుకు సైక్లింగ్‌ను ఎంచుకున్నాడు. తండ్రి ఆశయాన్ని కొనసాగించడమే కాకుండా, ఆక్టివ్ మొబిలిటీ (Active Mobility) పట్ల అవగాహన పెంచడాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడు.  

Cycle Yatra Beyond Borders: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి

రంజిత్ మొదట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాడు. ఆ తర్వాత లడఖ్, ఇండియా చైనా బోర్డర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో పర్యటించాడు. ఈ ప్రయాణంలో వివిధ ప్రాంతాల సంస్కృతి, జీవన శైలులను అన్వేషించాడు. భారతదేశం గుండా సాగిన ఈ ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. సైక్లింగ్ ద్వారా రంజిత్ థాయ్‌లాండ్, మలేషియా, చైనా, సింగపూర్, నేపాల్,  కంబోడియా, తైవాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, మంగోలియా, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాల్లోని సైక్లింగ్ మార్గాలను అన్వేషిస్తూ, ఆక్టివ్ మొబిలిటీ ప్రాముఖ్యతను చాటుతున్నాడు. "సైక్లింగ్ అనేది ఆరోగ్యకరమైన జీవన శైలికి నాంది. ఇది మన శారీరక, మానసిక స్థితిని కూడా సమతుల్యంగా ఉంచుతుంది," అని ఆయన చెబుతున్నాడు. 


Cycle Yatra Beyond Borders: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి

Also Read: ఇల్లు కూల్చినా EMI కట్ అవుతోంది - హైడ్రా బాధితుల కన్నీటి వెతలు

రంజిత్ తన యూట్యూబ్ ఛానల్ ‘రంజిత్ ఆన్ వీల్స్’ ద్వారా తన అనుభవాలను పంచుకుంటూ ఆక్టివ్ మొబిలిటీ గురించి అవగాహన కల్పిస్తున్నాడు. "ప్రతి ఊరు ఒక కథను చెబుతుంది, ప్రతి పరిచయం ఒక అనుభవాన్ని మిగులుస్తుంది," అని ఆయన అంటాడు. సైక్లింగ్ ద్వారా ఆయా దేశాల్లో కొత్త మనుషులతో పరిచయం కావడం, వారి ఆచారాలను గమనించడం, ఆహారాన్ని ఆస్వాదించడం ద్వారా మనిషికి జీవన గమనం పై కొత్త దృక్పథం కలుగుతుందని రంజిత్ విశ్వసిస్తున్నాడు. ఈ ప్రయాణంలో రంజిత్‌కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాతావరణ మార్పులు, భాషా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, ఈ అనుభవాలే తనకు జీవిత పాఠాలు నేర్పిస్తున్నాయు అని చెబుతున్నాడు రంజిత్. 


Cycle Yatra Beyond Borders: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి

"ప్రతి ఛాలెంజ్ నన్ను నేను మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తుంది. సైక్లింగ్ నాకు ఈ  అవకాశం కల్పించింది," అని ఆయన తెలిపారు. తండ్రి కలను సాకారం చేసే దిశగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచయాత్రగా మారింది. మనుషుల మధ్య సంబంధాలు, సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, జీవన శైలిలోని వైవిధ్యాన్ని అన్వేషించడమే కాకుండా, తన ప్రయాణం ద్వారా రంజిత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంలా చూస్తున్నాడు. అటు అనిమల్ రైట్స్ గురించి కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు రంజిత్. 2022లో తన పెంపుడు కుక్క భగీరితో కలిసి, రంజిత్ భారత-చైనా సరిహద్దు వరకు సైక్లింగ్ చేసి, మూగజీవాల హక్కుల కోసం ప్రజల్లో అవగాహన కల్పించాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న రంజిత్ Brisbaneలో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా 3వ టెస్ట్ మ్యాచ్ కు హాజరయ్యాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రంజిత్, ఎమ్. ఫార్మసీ చదువు పూర్తి చేసి, తన యూట్యూబ్ ఛానెల్ ‘రంజిత్ ఆన్ వీల్స్’ ద్వారా సైక్లింగ్ అనుభవాలను పంచుకుంటూ, ఆక్టివ్ మొబిలిటీ పట్ల యువతలో చైతన్యం నింపుతున్నాడు. "మీ కలలు సాధారణమైనవిగా అనిపించవచ్చు, కానీ వాటిని నెరవేర్చే మీ ప్రయాణమే అసలైన విజయం" అని రంజిత్ తెలిపాడు.

Also Read: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Embed widget