అన్వేషించండి

Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం

National Lok Adalat: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పరిహారం విషయంలో 14 ఏళ్ల పోరాటం తర్వాత న్యాయం జరిగింది. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైంది.

Victim Family Get Compensation After 14 Years: ఓ కుటుంబం 14 ఏళ్ల పోరాటం అనంతరం వారికి రూ.1.99 కోట్ల పరిహారం అంది న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో (National Lok Adalat) ఓ కుటుంబానికి సంబంధించిన ఏళ్లుగా నలుగుతోన్న కేసు పరిష్కారమైంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ వ్యక్తి భార్య, కుమార్తెకు రూ.1.99 కోట్ల చెక్కును అందజేశారు. 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిశోర్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందగా.. ఆయన భార్య శ్వేత, కుమార్తె సుదీక్షణ్ నందినీరెడ్డిలు రూ.2 కోట్ల పరిహారం కోసం మోటారు వాహనాల ప్రమాదాల కేసుల ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ కాలం విచారణ సాగింది. చివరకు ఈ ఏడాది జూన్‌లో రూ.1.08 కోట్ల పరిహారం మాత్రమే చెల్లించాలని.. లారీ యజమాని, బజాజ్ ఇన్సూరెన్స్ తదితరులకు ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.

లోక్ అదాలత్‌లో పరిష్కారం..

ఈ క్రమంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారించి కేసును పరిష్కరించింది. ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చి బాధితులకు రూ.1.99 కోట్ల చెక్కును పరిహారంగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని న్యాయమూర్తుల చేతుల మీదుగా అందజేసినట్లు హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్దిని తెలిపారు. కమిటీ ఛైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి సూచనల మేరకు నిర్వహించిన లోక్ అదాలత్‌లో 225 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. ఇందులో మోటారు వాహనాల చట్టం కింద 169 కేసులతో పాటుగా కార్మికుల పరిహారం, సిటీ సివిల్ కోర్టు అప్పీళ్లు, కుటుంబ వివాదాలను పరిష్కరించి మొత్తం 1,100 మంది లబ్ధిదారులకు రూ.15.93 కోట్ల పరిహారాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు.

11.56 లక్షల కేసులు పరిష్కారం

రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 11.56 లక్షల కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సభ్య కార్యదర్శి సీహెచ్.పంచాక్షరి తెలిపారు. ఇందులో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 2,702 సివిల్ కేసులు, 6.11 లక్షల క్రిమినల్ కేసులు ఉన్నాయని.. బాధితులకు పరిహారంగా రూ.161.05 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో భాగంగా 5.42 లక్షల ప్లీలిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్‌ల సూచనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Also Read: Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget