అన్వేషించండి

మోదీ అమిత్‌షా పాపాత్ములు, వాళ్లు రావడం వల్లే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం - మమతా సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee: కోల్‌కత్తాలో మ్యాచ్ పెట్టి ఉంటే కచ్చితంగా ఇండియా గెలిచి ఉండేదని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee Dig At PM Modi:

ఫైనల్ మ్యాచ్‌పై దీదీ వ్యాఖ్యలు..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup Final Match) గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో ఇండియా అన్ని మ్యాచ్‌లు గెలిచిందని, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా హాజరైన ఫైనల్ మ్యాచ్‌ మాత్రం ఓడిపోయిందని అన్నారు. వాళ్లు రావడం వల్లే భారత్ కప్ గెలుచుకోలేకపోయిందని విమర్శించారు. మోదీ, అమిత్‌షా లాంటి పాపాత్ములు రావడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కత్తాలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడే సమయంలో ఈ కామెంట్స్ చేశారు. గుజరాత్‌లో కాకుండా కోల్‌కత్తాలోనే, ముంబయిలోనో ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉండేదని అన్నారు. కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకుని ప్రాక్టీస్ చేశారని అన్నారు. 

"కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనో లేదంటే ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే భారత్ కచ్చితంగా కప్ గెలిచేది. వాళ్లు కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని చూశారు. కానీ మన ప్లేయర్స్ అందుకు ఒప్పుకోలేదు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకున్నారు. క్రీడలకు సంబంధించిన అన్ని ఫెడరేషన్స్‌పైనా రాజకీయ ఆధిపత్యం పెరిగిపోతోంది. క్రికెట్‌లోనే కాదు కబడ్డీలోనూ కాషాయాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాషాయ రంగు త్యాగానికి నిదర్శనం. కానీ బీజేపీకి ఆ స్థాయి లేదు"

- మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి

కాషాయాన్ని రుద్దేస్తున్నారు..

అంతకు ముందు కూడా మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పలు కీలక సంస్థలపై కాషాయాన్ని రుద్దేందుకు కుట్ర జరుగుతోందని మండి పడ్డారు. కచ్చితంగా మన ఇండియన్ ప్లేయర్స్ కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్‌ అవుతారని అన్నారు. 

"ఇప్పుడు బీజేపీ ప్రతిదాన్నీ కాషాయంతో నింపేయాలని చూస్తోంది. ఇండియన్ ప్లేయర్స్‌ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వాళ్లు కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్ అవుతారు. కానీ బీజేపీ మాత్రం వాళ్ల జెర్సీలను కూడా కాషాయ రంగులోకి మార్చేయాలని చూస్తోంది. బ్లూ జెర్సీలను కాషాయంగా మార్చేయాలని చూస్తున్నారు"

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ODI World Cup 2023 ఫైనల్ మ్యాచ్‌ని గుజరాత్‌లో కాకుండా లఖ్‌నవూలో పెట్టుంటే కచ్చితంగా ఇండియా గెలిచేదని అన్నారు. వరల్డ్‌ కప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్‌లో మాత్రం చతికిలబడిపోయింది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. దీనిపై ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

"World Cup 2023 final మ్యాచ్‌ని గుజరాత్‌లో పెట్టారు. అలా కాకుండా లఖ్‌నవూలో పెట్టి ఉంటే టీమిండియా కచ్చితంగా గెలిచేది. ఇండియన్ టీమ్‌కి చాలా మంది ఆశీర్వాదాలు లభించేవి. ఆ విష్ణుమూర్తితో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆశీర్వాదాలతో ఇండియా తప్పకుండా గెలిచి ఉండేది. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌లో ఏదో లోపం ఉన్నట్టుగా తెలుస్తోంది"

- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్

Also Read: J&K's Rajouri Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

టాప్ హెడ్ లైన్స్

Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget