అన్వేషించండి

మోదీ అమిత్‌షా పాపాత్ములు, వాళ్లు రావడం వల్లే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం - మమతా సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee: కోల్‌కత్తాలో మ్యాచ్ పెట్టి ఉంటే కచ్చితంగా ఇండియా గెలిచి ఉండేదని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee Dig At PM Modi:

ఫైనల్ మ్యాచ్‌పై దీదీ వ్యాఖ్యలు..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup Final Match) గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో ఇండియా అన్ని మ్యాచ్‌లు గెలిచిందని, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా హాజరైన ఫైనల్ మ్యాచ్‌ మాత్రం ఓడిపోయిందని అన్నారు. వాళ్లు రావడం వల్లే భారత్ కప్ గెలుచుకోలేకపోయిందని విమర్శించారు. మోదీ, అమిత్‌షా లాంటి పాపాత్ములు రావడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కత్తాలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడే సమయంలో ఈ కామెంట్స్ చేశారు. గుజరాత్‌లో కాకుండా కోల్‌కత్తాలోనే, ముంబయిలోనో ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉండేదని అన్నారు. కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకుని ప్రాక్టీస్ చేశారని అన్నారు. 

"కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనో లేదంటే ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే భారత్ కచ్చితంగా కప్ గెలిచేది. వాళ్లు కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని చూశారు. కానీ మన ప్లేయర్స్ అందుకు ఒప్పుకోలేదు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకున్నారు. క్రీడలకు సంబంధించిన అన్ని ఫెడరేషన్స్‌పైనా రాజకీయ ఆధిపత్యం పెరిగిపోతోంది. క్రికెట్‌లోనే కాదు కబడ్డీలోనూ కాషాయాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాషాయ రంగు త్యాగానికి నిదర్శనం. కానీ బీజేపీకి ఆ స్థాయి లేదు"

- మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి

కాషాయాన్ని రుద్దేస్తున్నారు..

అంతకు ముందు కూడా మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పలు కీలక సంస్థలపై కాషాయాన్ని రుద్దేందుకు కుట్ర జరుగుతోందని మండి పడ్డారు. కచ్చితంగా మన ఇండియన్ ప్లేయర్స్ కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్‌ అవుతారని అన్నారు. 

"ఇప్పుడు బీజేపీ ప్రతిదాన్నీ కాషాయంతో నింపేయాలని చూస్తోంది. ఇండియన్ ప్లేయర్స్‌ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వాళ్లు కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్ అవుతారు. కానీ బీజేపీ మాత్రం వాళ్ల జెర్సీలను కూడా కాషాయ రంగులోకి మార్చేయాలని చూస్తోంది. బ్లూ జెర్సీలను కాషాయంగా మార్చేయాలని చూస్తున్నారు"

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ODI World Cup 2023 ఫైనల్ మ్యాచ్‌ని గుజరాత్‌లో కాకుండా లఖ్‌నవూలో పెట్టుంటే కచ్చితంగా ఇండియా గెలిచేదని అన్నారు. వరల్డ్‌ కప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్‌లో మాత్రం చతికిలబడిపోయింది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. దీనిపై ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

"World Cup 2023 final మ్యాచ్‌ని గుజరాత్‌లో పెట్టారు. అలా కాకుండా లఖ్‌నవూలో పెట్టి ఉంటే టీమిండియా కచ్చితంగా గెలిచేది. ఇండియన్ టీమ్‌కి చాలా మంది ఆశీర్వాదాలు లభించేవి. ఆ విష్ణుమూర్తితో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆశీర్వాదాలతో ఇండియా తప్పకుండా గెలిచి ఉండేది. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌లో ఏదో లోపం ఉన్నట్టుగా తెలుస్తోంది"

- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్

Also Read: J&K's Rajouri Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Bangladesh Bengali Language: ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
Embed widget