అన్వేషించండి

మోదీ అమిత్‌షా పాపాత్ములు, వాళ్లు రావడం వల్లే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం - మమతా సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee: కోల్‌కత్తాలో మ్యాచ్ పెట్టి ఉంటే కచ్చితంగా ఇండియా గెలిచి ఉండేదని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee Dig At PM Modi:

ఫైనల్ మ్యాచ్‌పై దీదీ వ్యాఖ్యలు..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup Final Match) గురించి ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో ఇండియా అన్ని మ్యాచ్‌లు గెలిచిందని, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా హాజరైన ఫైనల్ మ్యాచ్‌ మాత్రం ఓడిపోయిందని అన్నారు. వాళ్లు రావడం వల్లే భారత్ కప్ గెలుచుకోలేకపోయిందని విమర్శించారు. మోదీ, అమిత్‌షా లాంటి పాపాత్ములు రావడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కత్తాలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడే సమయంలో ఈ కామెంట్స్ చేశారు. గుజరాత్‌లో కాకుండా కోల్‌కత్తాలోనే, ముంబయిలోనో ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉండేదని అన్నారు. కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకుని ప్రాక్టీస్ చేశారని అన్నారు. 

"కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనో లేదంటే ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పెట్టి ఉంటే భారత్ కచ్చితంగా కప్ గెలిచేది. వాళ్లు కాషాయ జెర్సీలు ఇచ్చి ఆడించాలని చూశారు. కానీ మన ప్లేయర్స్ అందుకు ఒప్పుకోలేదు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మాత్రం కాషాయ జెర్సీలు వేసుకున్నారు. క్రీడలకు సంబంధించిన అన్ని ఫెడరేషన్స్‌పైనా రాజకీయ ఆధిపత్యం పెరిగిపోతోంది. క్రికెట్‌లోనే కాదు కబడ్డీలోనూ కాషాయాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాషాయ రంగు త్యాగానికి నిదర్శనం. కానీ బీజేపీకి ఆ స్థాయి లేదు"

- మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి

కాషాయాన్ని రుద్దేస్తున్నారు..

అంతకు ముందు కూడా మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పలు కీలక సంస్థలపై కాషాయాన్ని రుద్దేందుకు కుట్ర జరుగుతోందని మండి పడ్డారు. కచ్చితంగా మన ఇండియన్ ప్లేయర్స్ కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్‌ అవుతారని అన్నారు. 

"ఇప్పుడు బీజేపీ ప్రతిదాన్నీ కాషాయంతో నింపేయాలని చూస్తోంది. ఇండియన్ ప్లేయర్స్‌ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వాళ్లు కచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్ అవుతారు. కానీ బీజేపీ మాత్రం వాళ్ల జెర్సీలను కూడా కాషాయ రంగులోకి మార్చేయాలని చూస్తోంది. బ్లూ జెర్సీలను కాషాయంగా మార్చేయాలని చూస్తున్నారు"

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ODI World Cup 2023 ఫైనల్ మ్యాచ్‌ని గుజరాత్‌లో కాకుండా లఖ్‌నవూలో పెట్టుంటే కచ్చితంగా ఇండియా గెలిచేదని అన్నారు. వరల్డ్‌ కప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్‌లో మాత్రం చతికిలబడిపోయింది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. దీనిపై ఇప్పటికే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

"World Cup 2023 final మ్యాచ్‌ని గుజరాత్‌లో పెట్టారు. అలా కాకుండా లఖ్‌నవూలో పెట్టి ఉంటే టీమిండియా కచ్చితంగా గెలిచేది. ఇండియన్ టీమ్‌కి చాలా మంది ఆశీర్వాదాలు లభించేవి. ఆ విష్ణుమూర్తితో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆశీర్వాదాలతో ఇండియా తప్పకుండా గెలిచి ఉండేది. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌లో ఏదో లోపం ఉన్నట్టుగా తెలుస్తోంది"

- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్

Also Read: J&K's Rajouri Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP DesamVizag Police About Sensational Attack | వైజాగ్‌లో కుటుంబంపై జరిగిన దాడి గురించి స్పందించిన పోలీసులు | ABP DesamPavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP DesamWhat if RCB Vs CSK Match Cancelled | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Rains: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
BJP MLAs Meet Revanth Reddy : రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
Embed widget