అన్వేషించండి

President Kovind on Covid19: నిజమైన దేశభక్తులు సైనికులే.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి కోవింద్

కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా ఈసారి రిపబ్లిక్‌ డే వేడుకలు సాదాసీదాగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగించారు.

73వ రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని దూర్‌దర్శన్, ఆల్‌ఇండియా రేడియో ప్రపంచానికి వినిపించాయి. మన ప్రజాస్వామ్యంలోని వైవిధ్యం, చైతన్యం ప్రపంచమే ప్రశంసిస్తోందన్నారు రాష్ట్రపతి.

"ఒకే జాతి అనే స్పిరిట్‌ను ప్రతి ఏడాది రిపబ్లిక్‌డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఏడాది కరోనా కారణంగా చాలా నార్మల్‌గా జరుపుకుంటున్నాం. కానీ స్పిరిట్‌ మాత్రం తగ్గలేదు." - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

President Kovind on Covid19: నిజమైన దేశభక్తులు సైనికులే.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి కోవింద్

"దేశభక్తిని మన సైనికులు ముందుకు తీసుకెళ్తున్నారు. రాత్రి పగలు నిద్రహారాలు లేకుండా దేశాన్ని, దేశ ప్రజలను మన జవాన్లు, పోలీసులు కాపాడుతున్నారు. వాళ్ల కృషి కారణంగానే సరిహద్దుల్లో, దేశంలో శాంతి పరిఢవిల్లుతోంది. దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు." - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

కరోనా ప్రోటోకాల్‌ పాటించడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు రాష్ట్రపతి కోవింద్. 

"మనం ఓ మహమ్మారితో పోరాడుతున్నాం. ఈ టైంలో కరోనా ప్రోటోకాల్ పాటించడం మనందరి విధి. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా రోగులను కాపాడుతున్నారు. "- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

"ప్రాథమిక బాధ్యతలు నిర్వహిస్తూ మన స్థాయిలో మనం దేశ సేవ చేయాలి. కోట్ల మంది ప్రజలకు ముందుకొచ్చి స్వచ్ఛభారత్‌ అభియాన్, కొవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఓ మహోద్యమంలా మార్చారు." - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

"వైరస్‌ తన రూపాన్ని మార్చుకొని మానవాళిపై తిరుగుబాటు చేస్తోంది. లెక్కలేనన్ని కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. బాధను వ్యక్తం చేయడానికి మాటలు చాలడం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్లను రక్షించుకోవడమే ప్రధాన కర్తవ్యం కావాలి." - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

మహమ్మారి ఇంకా విస్తృతంగా వ్యాపిస్తోందని, మనం అప్రమత్తంగా ఉండాలని, అజాగ్రత్త వద్దని హితవులు పలికారు రాష్ట్రపతి కోవింద్. ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలను కొనసాగించాలని అన్నారు.

స్వరాజ్యం కోసం  శ్రమించి ప్రజలను ఆ దిశగా నడిపించిన  స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్బంగా స్మరించుకున్నారు రాష్ట్రపతి కోవింద్. 

రిపబ్లిక్‌డే 2022 వేడుకలు చాలా సాధారణంగా జరుగుతున్నాయి. దేశంలో థర్డ్‌ వేవ్‌ చాలా ఉద్ధృతంగా ఉన్న సింపుల్‌గా వేడుకలు జరపడానికి నిర్ణయించింది ప్రభుత్వం. 

ఉదయం పదిన్నరకు రాజ్‌పథ్‌ వద్ద సెలబ్రేషన్స్‌ స్టార్ట్ అవుతాయి. ఈ వేడుకులకు డబుల్ డోస్ వేసుకున్న వాళ్లనే అనుమతిస్తున్నారు. 15ఏళ్ల లోపు పిల్లలను రానివ్వడం లేదు. 

సాధారణంగా కవాతు చూసేందుకు అవకాశం లేని వర్గాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌తోపాటు 'బీటింగ్ రిట్రీట్' వేడుకను చూడటానికి ఆటో-రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, సఫాయి కర్మచారిలు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను ఆహ్వానించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Dhurandhar Record Collections : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ! ఆలయంలో పుష్పాలంకరణ చూస్తే చూపు తిప్పుకోలేరు!
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Dhurandhar Record Collections : బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' - 2025లో అత్యధిక వసూళ్లు... స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డులివే!
Weakest Currency : ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ ఈ దేశానిదే.. ఇక్కడ పదివేలు అక్కడ నలభై లక్షలు పైమాటే
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Year Ender 2025 : మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
Embed widget