అన్వేషించండి

India at 2047 Summit Live: ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా 2047 సమ్మిట్ ప్రారంభం.. చీఫ్ గెస్ట్‌గా ప్రధాని మోదీ, లైవ్ వీక్షించండి

PM Modi vision for Vikasit Bharat | భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ పలుమార్లు చెప్పారు. నేడు ఏబీపీ నెట్వర్క్ సదస్సులో ఆయన పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు.

ABP Network India@2047 Summit: ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికత కలిగిన దేశామైన భారతదేశం ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రపంచ వేదికపై భారతదేశం కీలక పాత్రను పోషిస్తోంది. సరికొత్త సవాళ్లను ఎదుర్కొని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చోటు కోసం నిరంతరం కృషి జరుగుతోంది. భాతదేశం 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని.. స్వాతంత్య్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తిచేసుకుకోనున్న శుభ సమయంలో ఆ కల సాకారం కావాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. 

అందులో భాగంగానే వందేళ్లకు పైగా అనుభవం ఉన్న ఏబీపీ న్యూస్ నెట్‌వర్క్ శత వసంత భారతానికి ఘన స్వాగతం పలుకుతోంది. నేడు (మే 6వ  తేదీన) ఢిల్లీలోని భారత మండపంలో ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న India@2047  కాంక్లేవ్ ప్రారంభమైంది. ABP నెట్‌వర్క్ డైరెక్టర్ ధృబ ముఖర్జీ వెల్కమ్ స్పీచ్‌తో సమావేశాన్ని ప్రారంభించారు, భారత్ స్వాతంత్య్రం పొంది 2047లో శతాబ్దం పూర్తి చేసుకోనుందని.. '2047లో ఏమి ఆశించాలి?' ('What to expect in 2047?') అనే  అంశంపై పలు సెషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొని తమ అభిప్రాయాలు షేర్ చేసుకోనున్నారు. నేటి సాయంత్రం ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌ను ABP నెట్‌వర్క్ ఈ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. భారత్ @2047 రోడ్‌మ్యాప్‌పై భవిష్యత్ లక్ష్యాలను మోదీ ప్రస్తావించనున్నారు.

ABP నెట్‌వర్క్ ఈ సదస్సు ద్వారా భారతదేశాన్ని ముందుకు నడిపించే భవిష్యత్ ఆలోచనలను, పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి వేదికను అందిస్తుంది. ఇండియా @ 2047లో పలు రంగాల ప్రముఖుల ఆలోచనల సమ్మేళనం జరుగుతుంది. భారతదేశం 2047లో స్వాతంత్ర్యం 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రపంచ వ్యాప్తంగా మేటి దేశంగా, నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా మారాలని వ్యూహాలు రచిస్తోంది. 

ABP నెట్‌వర్క్ సదస్సు కాస్త భిన్నంగా కనిపిస్తుంటుంది. ఎందుకటే ఇది కేవలం ఒక చర్చా వేదిక మాత్రమే కాదు. కొందరు ప్రముఖుల ఆలోచనల సమాహారం. ఇది రాబోయే సంవత్సరాలలో  ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని నిర్దేశించే దిశగా స్పష్టమైన, సరైన లక్ష్యంతో ముందుకు సాగడానికి సదస్సు ప్రేరేపిస్తుంది.

ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథి

ABP నెట్‌వర్క్ ప్రత్యేక కార్యక్రమం India@2047 SUMMIT లో ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు, భవిష్యత్ నిర్దేశకులు ఈ సమ్మిట్‌లో  పాల్గొంటున్నారు. భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, టీవీ హోస్ట్ బేర్ గ్రిల్స్, అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా, రేమాండ్స్ ఎండీ గౌతమ్ సింఘానియా, బాక్సర్ లవ్లీనా బోర్గోహోం, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.

ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చూడండి

ABP న్యూస్ (హిందీ)- https://www.abplive.com/
ABP న్యూస్ (ఇంగ్లీష్)- https://news.abplive.com/
ABP న్యూస్ యూట్యూబ్- https://www.youtube.com/watch?v=nyd-xznCpJc

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget