అన్వేషించండి

భవిష్య భారతావనికి దిశా నిర్దేశం India@2047; ఏబీపీ కాంక్లేవ్‌కు ప్రధాని మోదీ

India@2047: శత వసంతాల వికసిత భారతావని లక్ష్యంగా ఏబీపీ నెట్‌వర్క్ కూడా ముందడుగు వేస్తోంది. India@ 2047 పేరుతో నిర్వహిస్తున్న సమ్మేళనానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా వస్తున్నారు.

India@2047 ABP Network's Summit: ఇంకో 22 ఏళ్లకి... నవ్య భారతావని స్వతంత్ర దేశంగా శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 1947లో స్వాతంత్రం పొంది వజ్రోత్సవాలు కూడా జరుపుకున్న భారతావని అనేక రంగాల్లో ప్రపంచ స్థాయిలో  నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా... విద్య, విజ్ఞాన, సాంస్కృతిక రంగాల్లో మార్గదర్శిగా.. ప్రబల సైనిక శక్తిగా..భవిష్యత్ ఆర్థిక శక్తిగా భారత్‌ను ప్రపంచం కీర్తిస్తోంది. ఈ డెబ్బై ఏడేళ్ల కాలంలో ప్రజ్వలమైన శక్తిగా భారత్ నిలిచింది. అయితే స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే అత్యున్నత శక్తిగా భారత్ ఎదగాలనే సంకల్పాన్ని ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్నారు. శత వసంతాల నాటికి వికసిత భారతాన్ని సాకారం చేయాలని పిలుపునిచ్చారు. దీని కోసం అన్నిరంగాలకూ లక్ష్యాలను విధించారు. ఆ దిశగా దేశం పయనిస్తోంది. అందులో భాగంగానే.. మీడియా రంగంలో వందేళ్లకు పైగా అనుభవం ఉన్న ఏబీపీ గ్రూప్.. శత వసంత భారతానికి స్వాగతం పలుకుతోంది.  ఏబీపీ నెట్‌వర్క్ మే 6వ  తేదీన ఢిల్లీలోని భారత మండపంలో India@2047  కాంక్లేవ్ ను నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసాన్ని అందించనున్నారు.

INDIA@2047 ఏంటంటే..?
భారత్... ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటైన ఈ దేశం ఇప్పుడు చరిత్ర గమనంలో ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది. సాంప్రదాయ, వారసత్వ విజ్ఞానంతో.. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ.. 2047 నాటికి శత వసంతాల స్వతంత్ర భారతావని వికసిత భారత్‌గా ఎదిగేందకు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళుతోంది.

ఈ స్ఫూర్తితోనే ABP Network India @ 2047 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ముఖ్యులు పాల్గొనే ఈ లీడర్‌షిప్‌ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్రమోదీ లీడ్ చేయనున్నారు.  దేశ, విదేశాలకు చెందిన విజనరీలు, పారిశ్రామిక దిగ్గజాలు, భవిష్యత్ నిర్దేశకులు ఈ సమ్మిట్‌లో  భారత భవిష్యత్‌ మార్గాన్ని ఆవిష్కరించనున్నారు.

India @ 2047 అనేక ఆలోచనల సమాహారం, కొత్త వ్యూహాలకు కార్యస్థానం, ఆధునిక భారతానికి పునాదులైన యువతకు మార్గనిర్దేశాన్ని అందించే కీలక సందేశం. ఇప్పటికే ప్రపంచ స్థాయి లక్ష్యాలతో ఉన్న 2047 రోడ్‌మ్యాప్‌పై మరింత స్పష్టంగా ఈ కాంక్లేవ్ చర్చించనుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే:  India 2047 అనేది దేశీయంగా గ్లోబల్ స్థాయిలో భారత భవిష్యత్‌ స్థానాన్ని నిర్దేశించడం కోసం ఒక స్పష్టమైన విజన్‌తో చర్చించే వేదిక.

ఇది సాధారణంగా జరిగే రాజకీయ, పారిశ్రామిక సమ్మేళనం కాదు. అంతే కాదు.. ఇది కేవలం భారత లీడర్లకు మాత్రమే పరిమితం అయింది కూడా కాదు.


భవిష్య భారతావనికి దిశా నిర్దేశం India@2047; ఏబీపీ కాంక్లేవ్‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసం

భారత మండపంలో మే 6 వ తేదీన ఉదయం ఈ సమ్మిట్ ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ కీలకోపన్యాసంతో ముగుస్తుంది. My Vision @2047 | India Full Speed Ahead అనే థీమ్‌పై ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ఆయన కాకుండా రచయత, హిస్టారియన్ విక్రమ్ సంపత్, అంతర్జాతీయ టీవీ హోస్ట్ Bear Grylls, యాక్టర్ Aamir Khan,  Amul MD జయేన్ మెహతా, రేమాండ్స్ ఎండీ గౌతమ్ సింఘానియా, క్రికెటర్లు మిథాలీరాజ్, గౌతం గంభీర్ ఇంకా పలువురు వివిధ సెషన్లలో పాల్గొంటారు.


భవిష్య భారతావనికి దిశా నిర్దేశం India@2047; ఏబీపీ కాంక్లేవ్‌కు ప్రధాని మోదీ

ఈ సమ్మేళనం ఎందుకంటే…

India 2047  కేవలం ప్రసంగాలకు పరిమితమయ్యే వేదిక కాదు. దేశాన్ని భవిష్యత్ గమనం వైపు నడిపించే ఓ చోదక శక్తిగా ఉపయోగపడనుందని ABP NETWORK విశ్వసిస్తోంది.  రాబోయే కొన్నేళ్లలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను అత్యున్నత స్థాయిలో నిలపాలన్న లక్ష్యానికి  ఓ స్పష్టమైన రూపాన్ని అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Lok Sabha: బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
K Annamalai New Political Party: అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Crisis in TMC - Mamatha's resilience test | ఓటమిని మించిన ప్రమాదంలో మమత పార్టీ
Crisis in TMC - Mamatha's resilience test | ఓటమిని మించిన ప్రమాదంలో మమత పార్టీ
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget