అన్వేషించండి

Nitish Uturn: ఇంకెన్ని కూటములు- నితీష్‌ యూటర్న్స్‌పై తీవ్ర చర్చ

Bihar CM Nitish Kumar: 20 ఏళ్లుగా బీహార్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని వదలని రాజకీయ చాణుక్యుడు నితీష్‌ కుమార్‌. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో...అవసరాన్ని బట్టి గోడదూకడంలో నితీష్‌ ముందుటారు.

Bihar Politics : నితీష్‌ కుమార్‌ (Nitish Kumar) 20 ఏళ్లుగా బీహార్‌ (Bihar)ముఖ్యమంత్రి (Chief Minister) పీఠాన్ని వదలని రాజకీయ చాణుక్యుడు . ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో...అవసరాన్ని బట్టి గోడదూకడంలో నితీష్‌ ముందుటారు. ఎప్పుడు ఎవరికి హ్యాండిస్తాడో...ఎప్పుడు ఎవరితో కలుస్తాడో...రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేరు. తలపండిన రాజకీయ నేతలు, పండితులు కూడా నితీష్‌ కుమార్‌ వ్యూహాలను పసి గట్టలేరు. పదవి కోసం ఎంతకైన దిగజారుతాడు. రాజకీయ విలువలు గురించి అవసరం లేదు. సీఎం పదవి తర్వాతే ఏదైనా అంటాడు. సీట్లు ఎవరికి ఎక్కువున్నా సీఎం పదవి తనదే అంటారు నితీష్ కుమార్‌. 2013 నుంచి ఇప్పటికి నాలుగుసార్లు కూటముల మార్చేశారు నితీష్. ఎన్నిసార్లు కూటములు ఫిరాయించినా..20 ఏళ్లుగా ఆయనే ముఖ్యమంత్రి.

జనతాదళ్‌తో పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ

మహాగడ్‌బంధన్‌కు రాంరాం చెప్పారు. నితీష్‌ కుమార్‌...యూటర్న్ తీసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు ఆయన కూటమిలు మార్చేశారు. మొదట్నుంచి నితీష్‌ రాజకీయ రూటే సపరేటు... జనతాదళ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నితీష్‌... ఆ పార్టీ తరపున 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో ఆ పార్టీని చీల్చి సమతాపార్టీ పెట్టుకున్నారు. 1996లో లోక్‌సభకు ఎన్నికైన ఆయన అటల్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2003లో తన పార్టీని జేడీయూలో విలినం చేసేసారు. ఆ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి ఆయనకు తిరుగులేకుండా పోయింది. 

2005లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు

2005లో బీజేపీతో చేతులు కలిపిన ఆయన ఘనవిజయం సాధించి తొలిసారి బీహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 2010లోనూ బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. కానీ 2013లో బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంతో నితీష్‌ కమలంతో తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీలతో కలిపి మహాగడ్‌బంధన్‌ ఏర్పాటు చేశారు. అయితే 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో సీఎంగా రాజీనామా చేసి మాంజీని ఆ పీఠంపై కూర్చోపెట్టారు. 2015లో మాంజీని దించేసి తాను మరోసారి సీఎం అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే 2017లో మహాగడ్‌బంధన్‌కు హ్యాండిచ్చి కమలం గూటికి చేరిపోయారు. ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో...సీబీఐ లాలుప్రసాద్‌ ఇంట్లో సోదాలు చేయడంతో ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమికి గుడ్‌ బై చెప్పారు. 2020లో తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో మళ్లీ బీజేపీని వదిలి మహాగడ్‌బంధన్‌ అంటూ కూటమిని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ కంటే జేడీయూకు తక్కువమంది ఎమ్మెల్యేలున్నా నితీషే సీఎం అయ్యారు. మళ్లీ రెండేళ్లు కూడా కాకముందే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. 

మోడీ హవాతోనే బీజేపీ చెంతకు

రకరకాల కారణాలతో కూటములు మార్చే నితీష్‌ ఈసారి బయటకు రావడానికి కారణం ఇండియా కూటమి ప్రధాన మంత్రి ఫేస్‌ కాలేకపోవడమే అంటున్నారు. ఇండియా కన్వీనర్‌గా ఖర్గేను ప్రకటించడంతో ఇక తనకు ఛాన్స్ రాదని నితీష్‌ డిసైడైనట్లు కనిపిస్తోంది. పైగా మరోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందన్న అంచనాలు కూడా ఆయన్ను ఆలోచనలో పడేశాయి. ఉత్తరాదిలో ప్రధాని మోడీ హవా కొనసాగుతోంది. పైగా కర్పూరి ఠాకూర్‌కు భారతరత్నతో బీహార్‌లో పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మార్చేశారు మోడీ... దీంతో నితీష్‌కుమార్‌ జాగ్రత్తపడ్డారు. మోడీని ఢీ కొట్టలేని పరిస్థితులు, బలం లేకపోవడంతో బీజేపీతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget