అన్వేషించండి

Live TV: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ- కేంద్రం ముమ్మరం కసరత్తు

Live TV: లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది.

Live TV: సాధారణంగా మొబైల్లో టీవీ చూడాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి సగటున రోజుకు 1.5 జీబీ డేటా వాడేస్తున్నాడు. ఉన్న డేటా అంతా టీవీ చూడటానికే అయిపోతే ఇతర అవసరాలకు ఏం వాడుకోవాలి? ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయాలి, యూట్యూబ్ చూడాలి, క్రికెట్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు అయితే మరీ కష్టం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఇంటర్నెట్ లేకుండా టీవీ సేవలు అందించేందుకు యత్నిస్తోంది.

మామూలుగా మనం టీవీ చూడాలంటే కేబుల్ టీవీ ఆపరేటర్, డైరెక్ట్ టు హోం కనెక్షన్లను ఏర్పాటు చేయించుకుంటాం. కాలం మారే కొద్ది ఓటీటీ యాప్స్‌లో లైవ్ టీవీ వచ్చేస్తోంది. అయితే ఇందుకోసం ఇంట్లో వైఫై ఉంటే సరే. లేని వారి పరిస్థితి ఏంటి? ఫోన్‌లో ఉన్న డేటా అంతా అయిపోయినట్లే. వాటన్నింటికి పరిష్కారం చూపిస్తూ ఇంటర్నెట్ లేకుండా నేరుగా మొబైల్లో టీవీ చూసేలా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది.

లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది. డైరెక్ట్-టు-హోమ్ (DTH) సేవల తరహాలో  "డైరెక్ట్-టు-మొబైల్" (D2M) ద్వారా ఈ సేవలు అందించేందుకు అడుగులు వేస్తోంది. ఈ సాంకేతికతతో మొబైల్ ఫోన్‌లో డేటా కనెక్షన్ అవసరం లేకుండా వినియోగదారులు తమ మొబైల్‌లలో టీవీ చూడొచ్చు. వినియోగదారును ఆకట్టుకునేలా ఈ డైరెక్ట్ టు మొబైల్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), IIT-కాన్పూర్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  

ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నా.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సాంకేతికతతో తమకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న డేటా ప్లాన్ల ద్వారా ఆదాయం తగ్గిపోతుందని, నష్టం జరుగుతుందనే భయాన్ని టెలికం ఆపరేటర్లు, వారితో పాటు డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్లు వ్యక్తం చేయొచ్చు. ఈ ఆలోచనలను వారు తిరష్కరించే అవకాశం ఉంది. వీడియోలు చూడడం ద్వారా డేటా వేగంగా అయిపోతుంది. దీంతో వినియోగదారులు మరో సారి రీచార్జ్ చేసుకోవడం ద్వారా టెలికం సంస్థలు ఆదాయం ఆర్జిస్తున్నాయి. అయితే  ఈ D2M విధానంతో వారి ఆదాయ మార్గాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా 5G వ్యాపార వ్యూహాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన టెలికం ఆపరేటర్ల నుంచి వ్యక్తం అవుతోంది. 

దీనిపై ఓ అధికారి స్పందిస్తూ.. డైరెక్ట్ టు మొబైల్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాట్లు చెప్పారు. దీనిపై టెలికాం ఆపరేటర్లతో సహా అన్ని వాటాదారులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాబోయే సమావేశంలో DoT, MIB, IIT-కాన్పూర్, టెలికాం, ప్రసార రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇది సాద్యమైతే భారత దేశంలో మరో సాంకేతిక విప్లవం దిశగా అడుగులు చేసినట్లు అవుతందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget