అన్వేషించండి

Live TV: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ- కేంద్రం ముమ్మరం కసరత్తు

Live TV: లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది.

Live TV: సాధారణంగా మొబైల్లో టీవీ చూడాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి సగటున రోజుకు 1.5 జీబీ డేటా వాడేస్తున్నాడు. ఉన్న డేటా అంతా టీవీ చూడటానికే అయిపోతే ఇతర అవసరాలకు ఏం వాడుకోవాలి? ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయాలి, యూట్యూబ్ చూడాలి, క్రికెట్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు అయితే మరీ కష్టం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఇంటర్నెట్ లేకుండా టీవీ సేవలు అందించేందుకు యత్నిస్తోంది.

మామూలుగా మనం టీవీ చూడాలంటే కేబుల్ టీవీ ఆపరేటర్, డైరెక్ట్ టు హోం కనెక్షన్లను ఏర్పాటు చేయించుకుంటాం. కాలం మారే కొద్ది ఓటీటీ యాప్స్‌లో లైవ్ టీవీ వచ్చేస్తోంది. అయితే ఇందుకోసం ఇంట్లో వైఫై ఉంటే సరే. లేని వారి పరిస్థితి ఏంటి? ఫోన్‌లో ఉన్న డేటా అంతా అయిపోయినట్లే. వాటన్నింటికి పరిష్కారం చూపిస్తూ ఇంటర్నెట్ లేకుండా నేరుగా మొబైల్లో టీవీ చూసేలా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది.

లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది. డైరెక్ట్-టు-హోమ్ (DTH) సేవల తరహాలో  "డైరెక్ట్-టు-మొబైల్" (D2M) ద్వారా ఈ సేవలు అందించేందుకు అడుగులు వేస్తోంది. ఈ సాంకేతికతతో మొబైల్ ఫోన్‌లో డేటా కనెక్షన్ అవసరం లేకుండా వినియోగదారులు తమ మొబైల్‌లలో టీవీ చూడొచ్చు. వినియోగదారును ఆకట్టుకునేలా ఈ డైరెక్ట్ టు మొబైల్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), IIT-కాన్పూర్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  

ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నా.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సాంకేతికతతో తమకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న డేటా ప్లాన్ల ద్వారా ఆదాయం తగ్గిపోతుందని, నష్టం జరుగుతుందనే భయాన్ని టెలికం ఆపరేటర్లు, వారితో పాటు డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్లు వ్యక్తం చేయొచ్చు. ఈ ఆలోచనలను వారు తిరష్కరించే అవకాశం ఉంది. వీడియోలు చూడడం ద్వారా డేటా వేగంగా అయిపోతుంది. దీంతో వినియోగదారులు మరో సారి రీచార్జ్ చేసుకోవడం ద్వారా టెలికం సంస్థలు ఆదాయం ఆర్జిస్తున్నాయి. అయితే  ఈ D2M విధానంతో వారి ఆదాయ మార్గాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా 5G వ్యాపార వ్యూహాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన టెలికం ఆపరేటర్ల నుంచి వ్యక్తం అవుతోంది. 

దీనిపై ఓ అధికారి స్పందిస్తూ.. డైరెక్ట్ టు మొబైల్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాట్లు చెప్పారు. దీనిపై టెలికాం ఆపరేటర్లతో సహా అన్ని వాటాదారులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాబోయే సమావేశంలో DoT, MIB, IIT-కాన్పూర్, టెలికాం, ప్రసార రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇది సాద్యమైతే భారత దేశంలో మరో సాంకేతిక విప్లవం దిశగా అడుగులు చేసినట్లు అవుతందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Venu Swamy Prediction: బీజేపీని డ్యామేజ్ చేయనున్న కాక్రోచ్‌ జనతా పార్టీ.. త్వరలో జైలుకు సీజేపీ నేతలు: వేణు స్వామి జోస్యం
బీజేపీని డ్యామేజ్ చేయనున్న కాక్రోచ్‌ జనతా పార్టీ.. త్వరలో జైలుకు CJP నేతలు: వేణు స్వామి జోస్యం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Embed widget