అన్వేషించండి

Live TV: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ- కేంద్రం ముమ్మరం కసరత్తు

Live TV: లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది.

Live TV: సాధారణంగా మొబైల్లో టీవీ చూడాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి సగటున రోజుకు 1.5 జీబీ డేటా వాడేస్తున్నాడు. ఉన్న డేటా అంతా టీవీ చూడటానికే అయిపోతే ఇతర అవసరాలకు ఏం వాడుకోవాలి? ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయాలి, యూట్యూబ్ చూడాలి, క్రికెట్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు అయితే మరీ కష్టం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఇంటర్నెట్ లేకుండా టీవీ సేవలు అందించేందుకు యత్నిస్తోంది.

మామూలుగా మనం టీవీ చూడాలంటే కేబుల్ టీవీ ఆపరేటర్, డైరెక్ట్ టు హోం కనెక్షన్లను ఏర్పాటు చేయించుకుంటాం. కాలం మారే కొద్ది ఓటీటీ యాప్స్‌లో లైవ్ టీవీ వచ్చేస్తోంది. అయితే ఇందుకోసం ఇంట్లో వైఫై ఉంటే సరే. లేని వారి పరిస్థితి ఏంటి? ఫోన్‌లో ఉన్న డేటా అంతా అయిపోయినట్లే. వాటన్నింటికి పరిష్కారం చూపిస్తూ ఇంటర్నెట్ లేకుండా నేరుగా మొబైల్లో టీవీ చూసేలా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది.

లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది. డైరెక్ట్-టు-హోమ్ (DTH) సేవల తరహాలో  "డైరెక్ట్-టు-మొబైల్" (D2M) ద్వారా ఈ సేవలు అందించేందుకు అడుగులు వేస్తోంది. ఈ సాంకేతికతతో మొబైల్ ఫోన్‌లో డేటా కనెక్షన్ అవసరం లేకుండా వినియోగదారులు తమ మొబైల్‌లలో టీవీ చూడొచ్చు. వినియోగదారును ఆకట్టుకునేలా ఈ డైరెక్ట్ టు మొబైల్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), IIT-కాన్పూర్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  

ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నా.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సాంకేతికతతో తమకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న డేటా ప్లాన్ల ద్వారా ఆదాయం తగ్గిపోతుందని, నష్టం జరుగుతుందనే భయాన్ని టెలికం ఆపరేటర్లు, వారితో పాటు డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్లు వ్యక్తం చేయొచ్చు. ఈ ఆలోచనలను వారు తిరష్కరించే అవకాశం ఉంది. వీడియోలు చూడడం ద్వారా డేటా వేగంగా అయిపోతుంది. దీంతో వినియోగదారులు మరో సారి రీచార్జ్ చేసుకోవడం ద్వారా టెలికం సంస్థలు ఆదాయం ఆర్జిస్తున్నాయి. అయితే  ఈ D2M విధానంతో వారి ఆదాయ మార్గాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా 5G వ్యాపార వ్యూహాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన టెలికం ఆపరేటర్ల నుంచి వ్యక్తం అవుతోంది. 

దీనిపై ఓ అధికారి స్పందిస్తూ.. డైరెక్ట్ టు మొబైల్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాట్లు చెప్పారు. దీనిపై టెలికాం ఆపరేటర్లతో సహా అన్ని వాటాదారులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాబోయే సమావేశంలో DoT, MIB, IIT-కాన్పూర్, టెలికాం, ప్రసార రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇది సాద్యమైతే భారత దేశంలో మరో సాంకేతిక విప్లవం దిశగా అడుగులు చేసినట్లు అవుతందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget