Hyderabad surrogacy racket: ఉత్తరాదిలో పసికందుల కిడ్నాప్ - హైదరాబాద్లో అమ్మకాలు - గుజరాత్లో పట్టుబడిన ముఠా
Hyderabad surrogacy racket: హైదరాబాద్ సరోగసి రాకెట్ చిన్నది కాదని.. ఉత్తరాది నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అమ్ముతున్నారని బయటపడింది. గుజరాత్ లో ఓ కిడ్నాపర్ల ముఠాను పట్టుకోవడంతో అసలు లింక్ బయటకు వచ్ిచంది.

Dholka gang sold infants to childless couple: హైదరాబాద్లోని సృష్టి ఇన్ఫెర్టిలిటీ ఆస్పత్రి డాక్టర్ నమ్రత నిర్వాకం దేశవ్యాప్తంగా బయటడుతోంది. చైల్డ్ ట్రాఫికర్లతో ఓ పెద్ద ముఠాను ఆమె ఆర్గనైజ్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గుజరాత్ లో ఓ నిరుపేద కుటుంబం నుంచి నెలల వయసున్న ఓ బాలికను దుండగులు అపహరించారు. పోలీసులు ఆ కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారు. వారికి హైదరాబాద్లోని ఐవీఎఫ్ సెంటర్లతో లింకులు ఉన్నాయని.. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో హైదరాబాద్ ఐవీఎఫ్ సెంటర్లు లింకప్ అయి.. బిడ్డల్ని అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అహ్మదాబాద్లోని ధోల్కాలో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే నిరుపేద కుటుంబంలోని ఏడు నెలల బాలికను మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అహ్మదాబాద్ రూరల్ పోలీసు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ జాట్ నేతృత్వంలోని పోలీసులు ఈ కేసును చేధించారు. మొదట, ఈ కిడ్నాప్లో ట్రాఫికింగ్ ముఠా, భిక్షగాళ్ల ముఠా లేదా సంతానం లేని దంపతుల ప్రమేయం ఉండవచ్చని అనుమానించారు. సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణ ద్వారా కిడ్నాపర్లను గుర్తించారు.
ఈ ఘటన వెనుక మనీషా సోలంకి (ధోల్కా నివాసి, ఖేడా స్వస్థలం) ఉన్నట్లు తేలింది. ఆమెతో పాటు నలుగురు సహచరులు బినాల్ సోలంకి (ధోల్కా), జయేష్ బెల్దార్ (రాజ్కోట్), మహేష్ సోలంకి (ఖేడా), సిద్ధాంత్ జగ్తాప్ (నాసిక్, మహారాష్ట్ర) - అరెస్టయ్యారు. కిడ్నాపర్లు బాలికను అహ్మదాబాద్ నుండి ప్రైవేట్ వాహనంలో ఛత్రపతి సంభాజీనగర్ (మహారాష్ట్ర)కు తీసుకెళ్లారు, అక్కడ వారు ఒక సహచరుడిని కలవాలని ప్లాన్ చేశారు. పోలీసులు బాలికను రక్షించారు. విచారణలో మనీషా సోలంకి గతంలో నాలుగు ఇతర కిడ్నాప్లలో పాల్గొన్నట్లు తేలింది. ఈ ముఠా సంతానం లేని దంపతులకు శిశువులను అమ్మడం లేదా IVF కేంద్రాలకు సరఫరా చేయడం ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్లో నిమగ్నమై ఉన్నట్లుగా గుర్తించారు.
IVF સેન્ટરથી બાળક ચોરી અન્ય રાજ્યમાં વેચવાનું રેકેટ : નિસંતાન દંપતીને ચોરેલું બાળક 2.50 લાખમાં વેચતા, એગ ડોનર મહિલાઓનો થતો ઉપયોગ https://t.co/TKte92T6XL#Gujarat #Ahmedabad #Racket #Stealing #Children pic.twitter.com/oCVeWDLnNM
— Divya Bhaskar (@Divya_Bhaskar) August 3, 2025
ఒక్కో శిశువును 3 లక్షల రూపాయలకు విక్రయించినట్లు వెల్లడైంది. ఈ రాకెట్ హైదరాబాద్తో సంబంధం కలిగి ఉందని, అక్కడ సరోగసీ కేంద్రాల ద్వారా ఈ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా శిశువులను కిడ్నాప్ చేసి, సరోగసీ పేరుతో IVF కేంద్రాలకు లేదా సంతానం లేని జంటలకు విక్రయించేదని తేలింది. ఈ రాకెట్లో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులు , సంస్థల గురించి మరిన్ని వివరాలను గుర్తించేందుకు పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్ లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాకంతో ఇప్పుడు ఇతర ఫెర్టిలిటీ సెంటర్ల పైనా అధికారులు దృష్టి సారించారు. సరోగసి పేరుతో బిడ్డల్ని అమ్ముతున్నారన్న అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నారు.





















