అన్వేషించండి

Narmada cruise: జబల్‌పూర్ జల సమాధి - విహారయాత్రలో తీరని విషాదంలో తొమ్మిది మంది బలి - అసలు తప్పెవరిది?

Narmada tragedy: మధ్యప్రదేశ్‌లోని ఆహ్లాదకరమైన విహారయాత్ర కోసం క్రూయిజ్ ఎక్కిన సుమారు 40 మంది పర్యాటకులు, అకస్మాత్తుగా వచ్చిన తుఫాను ధాటికి విలవిల్లాడారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Narmada cruise tragedy: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో పర్యాటకుల విహారయాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. బర్గి డ్యామ్ రిజర్వాయర్‌లో పర్యాటకులతో వెళ్తున్న క్రూయిజ్ బోట్ అకస్మాత్తుగా మునిగిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు తోడై ఈ ఘోర ప్రమాదానికి దారితీశాయని జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ వెల్లడించిన ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  
 
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్ రిజర్వాయర్‌లో పర్యాటకుల నవ్వులు మృత్యుఘోషగా మారాయి. ఆహ్లాదకరమైన విహారయాత్ర కోసం క్రూయిజ్ ఎక్కిన సుమారు 40 మంది పర్యాటకులు, అకస్మాత్తుగా వచ్చిన తుఫాను ధాటికి జలసమాధి అయ్యారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో, ఒక తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని గట్టిగా హత్తుకుని మరణించిన దృశ్యం చూసి రెస్క్యూ టీమ్ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రాణభయంతో అల్లాడుతూ ఆ తల్లి చేసిన చివరి ప్రయత్నం మాతృత్వానికి నిదర్శనంగా మిగిలిపోయింది.

 సెంటర్ ఆఫ్ గ్రావిటీ శాపమై 

ప్రమాదానికి అసలు కారణం బోటు బ్యాలెన్స్ తప్పడమేనని అధికారులు ప్రకటించారు.  గాలి తీవ్రత పెరగడంతో పై అంతస్తులో ఉన్న పర్యాటకులు భయాందోళనతో అటు ఇటు పరుగులు తీశారు. అందరూ ఒకేసారి ఒకవైపుకు చేరడంతో బోటు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోయి ఊగిసలాడటం మొదలైంది. ఈ క్రమంలో కింది భాగంలోకి నీరు చేరడంతో బోటు క్షణాల్లో మునిగిపోయింది. కింది అంతస్తులో ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేక లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన 28 మంది ప్రాణాలతో బయటపడ్డా, తమ కళ్లముందే ఆత్మీయులు మునిగిపోవడం చూసి కోలుకోలేకపోతున్నారు.

 హెచ్చరికలు ఉన్నా నిర్లక్ష్యం ఎందుకు? 

ఈ ప్రమాదంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి ఒకరోజు ముందే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ, పర్యాటక బోటుకు అనుమతి ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. 2006 నుంచి నడుస్తున్న ఈ సర్వీసులో ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని బయటపెట్టింది. నిబంధనల ప్రకారం బోటు బలమైన గాలులను తట్టుకుంటుందని భావించినా, ప్రయాణికుల కదలికల వల్ల కలిగే అస్థిరతను అంచనా వేయడంలో సిబ్బంది విఫలమయ్యారు.   

 బాధ్యులపై కఠిన చర్యలు 

ఈ విషాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, హెల్పర్ ,  టికెట్ కౌంటర్ ఇన్‌చార్జ్‌లను విధుల నుంచి తొలగించారు. దీనిపై ఉన్నత స్థాయి శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఒక చిన్నారి ప్రాణంతో సహా తొమ్మిది మందిని బలిగొన్న ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి విచారకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా క్రూయిజ్ ఆపరేషన్ల కోసం కఠినమైన  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల బ్యాలెన్సింగ్,  అత్యవసర రక్షణ చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురానున్నారు. కానీ, పోయిన ప్రాణాలను ఏ నిబంధనలు తిరిగి తీసుకురాలేవు. జబల్‌పూర్ జలాల్లో కలిసిన ఆ చిన్నారి నవ్వులు, ఆ తల్లి త్యాగం వ్యవస్థలోని లోపాలకు నిరంతర హెచ్చరికగా మిగిలిపోతాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DK Shivakumar: కాంగ్రెస్ దక్షిణాది బాస్ డీకే శివకుమార్ - కర్ణాటక సీఎం పీఠంతో పాటు తెలంగాణను గెలిపించే టాస్క్.. రాహుల్ గాంధీ బిగ్ స్కెచ్!
కాంగ్రెస్ దక్షిణాది బాస్ డీకే శివకుమార్ - కర్ణాటక సీఎం పీఠంతో పాటు తెలంగాణను గెలిపించే టాస్క్.. రాహుల్ గాంధీ బిగ్ స్కెచ్!
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
Top EV Sales In India: ఇంధన ధరల సమస్యతో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన డిమాండ్.. టాప్ కంపెనీలు ఇవే
ఇంధన ధరల సమస్యతో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన డిమాండ్.. టాప్ కంపెనీలు ఇవే
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
Peddi Nizam Bookings: 'పెద్ది'కి టెన్షన్ లేదు... తెలంగాణలోనూ టికెట్ రేట్స్ పెరిగాయ్... కాసేపటిలో బుకింగ్స్ మొదలు
'పెద్ది'కి టెన్షన్ లేదు... తెలంగాణలోనూ టికెట్ రేట్స్ పెరిగాయ్... కాసేపటిలో బుకింగ్స్ మొదలు
Embed widget