News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Presidential Polls-2022: క్షమించండి, రాష్ట్రపతి అభ్యర్థిగా నేను నిలబడలేను, దీదీకి ధన్యవాదాలు-ఫరూక్ అబ్దుల్లా

రాష్ట్రపతి ఎన్నికల పోటీలో నిలబడాలనే ఆసక్తి తనకు లేదని ఎంపీ ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జమ్ము, కశ్మీర్ అభివృద్ధిపైనే దృష్టిసారిస్తానని వెల్లడించారు.

FOLLOW US: 
Share:

రాష్ట్రపతిగా పోటీ చేయలేను-ఫరూక్ అబ్దుల్లా

ప్రస్తుతానికి దేశ రాజకీయాల్లో రాష్ట్రపతి ఎన్నికల వేడి బాగానే రాజుకుంది. ప్రతిపక్షాలన్నీ భాజపాపై దాడిని ఈ ఎన్నికల నుంచే మొదలు పెట్టాలని భావిస్తున్నాయి. భాజపాయేతర పార్టీలన్నీ ఏకమై ఉమ్మడి రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాయి. అయితే ఈ జాబితాలో చాలా మంది పేర్లే వినిపించాయి. మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీతో పాటు ప్రధానంగా అందరి నోటా వినిపించిన పేరు ఫరూక్ అబ్దుల్లా. లోక్‌సభ ఎంపీగా, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లాకి మంచి రాజకీయ అనుభవముందని, ఆయననే ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని పలువురు ప్రతిపక్ష నేతలు ప్రతిపాదించారు. అయితే ఫరూక్ అబ్దుల్లా ఇందుకు భిన్నంగా స్పందించారు. ఈ పోటీలో నిలబడాలనే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. ఆ జాబితాలో నుంచి తన పేరు తొలగించాలని ప్రతిపక్షాలను కోరినట్టు వెల్లడించారు. 

జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం...

తనకు ఎందుకు ఆసక్తి లేదో కూడా వివరించారు ఫరూక్ అబ్దుల్లా. ప్రస్తుతానికి జమ్ము, కశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ ప్రాంత అభివృద్ధిని పక్కన పెట్టి దేశ రాజకీయాల్లోకి రావాలని అనుకోవటం లేదని అంటున్నారు. జమ్ము, కశ్మీర్ ప్రాంతానికి చేయాల్సిది చాలా ఉందని, ఇక్కడ పురోగతి ఎలా సాధించాలి అనే అంశంపైన తాను పూర్తిగా దృష్టి సారిస్తున్నానని వెల్లడించారు. తన పేరు సూచించినందుకు దీదీకి కృతజ్ఞతలు తెలిపిన ఫరూక్ అబ్దుల్లా, తనకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేతలకూ ధన్యవాదాలు చెప్పారు.

 

విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు చాలా రోజులుగా మేధోమథనం సాగిస్తున్నాయి. మొదట కాంగ్రెస్ ఈ బాధ్యతను తీసుకుని ప్రతిపక్షాలను కలుపుకుని పోయేందుకు గట్టిగానే కృషి చేసింది. అయితే పలు పార్టీలు కాంగ్రెస్‌ అభిప్రాయాలతో విభేదించటం వల్ల పూర్తి స్థాయిలో చర్చలు సఫలం కాలేదు. ఈ లోగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యత 
తీసుకున్నారు. చకచకా పావులు కదిపి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించేలా అందరూ సహకరించాలని కోరారు. దాదాపు నాలుగు రోజుల చర్చల తరవాత మమతా బెనర్జీ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశామని స్పష్టం చేశారు దీదీ.  "మేం ఎన్నుకునే అభ్యర్థికి అందరమూ మద్దతునివ్వాలని నిర్ణయించాం. ఎన్నో నెలలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్‌ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తాం" అని అన్నారు మమతా బెనర్జీ. దీదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Published at : 18 Jun 2022 04:59 PM (IST) Tags: jammu and kashmir Presidential polls Farooq Abdullah Presidential Polls 2022

ఇవి కూడా చూడండి

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్

ABP Desam Top 10, 10 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 10 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

CPI Ramakrishna: జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తికాదు, కేసీఆర్ కు పట్టిన గతే! సీపీఐ రామకృష్ణ సంచలనం

Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!

Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!

టాప్ స్టోరీస్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?