అన్వేషించండి

Caste Based Census: ప్రధానితో బిహార్ నేతల భేటీ.. కులాలవారీగా జనగణనపై డిమాండ్

కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలతో కలిసి బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ అంశంపై మోదీ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కులాల వారీగా జనగణన చేపట్టాలని  10 మంది నేతల బృందంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయంపై మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనను ప్రధాని ఓపికగా విన్నరాని నితీశ్ పేర్కొన్నారు.

" రాష్ట్రంలో కులాలవారీగా జనగణన చేపట్టాలనే మా ప్రతిపాదనను ప్రధాని నిశింతగా విన్నారు. ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని మేం ప్రధానిని కోరాం. ఈ అంశంపై అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసినట్లు గుర్తుచేశాం. కులాలవారీగా జనగణన చేపట్టాలని బిహార్ వాసులు మాత్రమే కాదు దేశం మొత్తం కోరుకుంటుంది. మా ప్రతిపాదనను శాంతంగా విన్న ప్రధానికి కృతజ్ఞతలు.                        "
- నితీశ్ కుమార్, బిహార్ సీఎం

ప్రధానిని కలిసిన బృందంలో బిహార్ ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు. ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఈ బృందంలో ఉన్నారు.

" కులాలవారీ జనగణన కేవలం బిహార్ లో చేయాలని మేం అడగలేదు. మొత్తం దేశంలో ఈ గణన జరగాలని కోరాం. దీనిపై ప్రధాని సరైన నిర్ణయం తీసుకోవాలి. దీని వల్ల దేశంలో ఉన్న పేదలకు లబ్ది చేకూరుతుంది. అయినా జంతువులు, చెట్లను లెక్కించినప్పుడు కులాలను ఎందుకు లెక్కించకూడదు. జనగణన అనేది పక్కాగా ప్రభుత్వం వద్ద లేకుంటే సంక్షేమ పథకాలు ఎలా అందుతాయి.                   "
- తేజస్వీ యాదవ్, బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత

గత నెలలో పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రమే లెక్కిస్తామని కేంద్రం చేసిన ప్రకటన నేపథ్యంలో కుల గణన అంశం బయటకొచ్చింది. బిహార్ వంటి రాష్ట్రాల్లో మండల్ కమిషన్‌ కాలం నుంచే ఓబీసీలదే రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగుతోంది. వెనుకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉండటం వల్ల కులగణన చేపట్టాలని బిహార్‌ రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో కోరుతున్నారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. కానీ కేంద్రం ఇందుకు విముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష బృందంతో ప్రధానిని నేడు నితీశ్ కుమార్​​ కలిశారు.

టాప్ హెడ్ లైన్స్

బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన, మోదీతో భేటీ ! సరిహద్దు వివాదంపై కీలక మలుపు ఉండబోతోందా?
బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన, మోదీతో భేటీ ! సరిహద్దు వివాదంపై కీలక మలుపు ఉండబోతోందా?
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
Breaking News: ఐపీఎస్ PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget