News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Caste Based Census: ప్రధానితో బిహార్ నేతల భేటీ.. కులాలవారీగా జనగణనపై డిమాండ్

కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలతో కలిసి బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ అంశంపై మోదీ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

FOLLOW US: 
Share:

కులాల వారీగా జనగణన చేపట్టాలని  10 మంది నేతల బృందంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయంపై మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనను ప్రధాని ఓపికగా విన్నరాని నితీశ్ పేర్కొన్నారు.

" రాష్ట్రంలో కులాలవారీగా జనగణన చేపట్టాలనే మా ప్రతిపాదనను ప్రధాని నిశింతగా విన్నారు. ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని మేం ప్రధానిని కోరాం. ఈ అంశంపై అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసినట్లు గుర్తుచేశాం. కులాలవారీగా జనగణన చేపట్టాలని బిహార్ వాసులు మాత్రమే కాదు దేశం మొత్తం కోరుకుంటుంది. మా ప్రతిపాదనను శాంతంగా విన్న ప్రధానికి కృతజ్ఞతలు.                        "
- నితీశ్ కుమార్, బిహార్ సీఎం

ప్రధానిని కలిసిన బృందంలో బిహార్ ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు. ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఈ బృందంలో ఉన్నారు.

" కులాలవారీ జనగణన కేవలం బిహార్ లో చేయాలని మేం అడగలేదు. మొత్తం దేశంలో ఈ గణన జరగాలని కోరాం. దీనిపై ప్రధాని సరైన నిర్ణయం తీసుకోవాలి. దీని వల్ల దేశంలో ఉన్న పేదలకు లబ్ది చేకూరుతుంది. అయినా జంతువులు, చెట్లను లెక్కించినప్పుడు కులాలను ఎందుకు లెక్కించకూడదు. జనగణన అనేది పక్కాగా ప్రభుత్వం వద్ద లేకుంటే సంక్షేమ పథకాలు ఎలా అందుతాయి.                   "
- తేజస్వీ యాదవ్, బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత

గత నెలలో పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రమే లెక్కిస్తామని కేంద్రం చేసిన ప్రకటన నేపథ్యంలో కుల గణన అంశం బయటకొచ్చింది. బిహార్ వంటి రాష్ట్రాల్లో మండల్ కమిషన్‌ కాలం నుంచే ఓబీసీలదే రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగుతోంది. వెనుకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉండటం వల్ల కులగణన చేపట్టాలని బిహార్‌ రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో కోరుతున్నారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. కానీ కేంద్రం ఇందుకు విముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష బృందంతో ప్రధానిని నేడు నితీశ్ కుమార్​​ కలిశారు.

Published at : 23 Aug 2021 03:03 PM (IST) Tags: PM Modi Prime Minister Nitish Kumar bihar chief minister bihar cm Tejashwi Yadav caste based census

ఇవి కూడా చూడండి

Telanagna Politics: కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?

Telanagna Politics: కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్

NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్

ABP Desam Top 10, 6 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 6 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్

Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్

టాప్ స్టోరీస్

CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

CM  Revanth  :  మాట నిలబెట్టుకున్న రేవంత్ -  దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్‌

MLA Raja Singh: ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీజేపీ - కారణమేంటో చెప్పిన రాజాసింగ్‌

BRS News : అటు టిక్కెట్ రాలేదు ఇటు పదవీ ఊడింది - ఈ బీఆర్ఎస్ నేతలకు ఏడుపొక్కటే తక్కువ !

BRS News :  అటు టిక్కెట్ రాలేదు ఇటు పదవీ ఊడింది - ఈ బీఆర్ఎస్ నేతలకు ఏడుపొక్కటే తక్కువ !

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్ - ఫోటో వైరల్
×