అన్వేషించండి

పాకిస్థాన్‌లో భారత్‌ టార్గెటెడ్ కిల్లింగ్స్‌ పాల్పడుతోంది - ఓ రిపోర్ట్ సంచలన ఆరోపణలు

Targeted Assassinations: భారత్ ఇతర దేశాల్లో టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఓ రిపోర్ట్ సంచలన ఆరోపణలు చేసింది.

India Targeted Assassinations: పాకిస్థాన్‌లో భారత్‌ కొంత మంది ఉగ్రవాదులను టార్గెట్ చేసి మరీ చంపుతోందంటూ UK daily The Guardian చేసిన ఆరోపణల్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఆరోపించిన ఆ రిపోర్ట్‌ని వ్యతిరేకించింది. ఇవి ఒట్టి పుకార్లేనని, కేవలం భారత్‌పై విద్వేషంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండి పడింది. ఇటీవలే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. వేరే దేశాల్లో ఇలా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడడం భారత్ పాలసీ కాదని తేల్చి చెప్పారు. భారత్‌కి ముప్పు ఉందనుకున్న వాళ్లని లక్ష్యంగా పెట్టుకుని హతమారుస్తున్నారంటూ ఈ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. 2019లో పుల్వామా అటాక్ జరిగిన తరవాత RAW ఏజెన్సీ ఇప్పటి వరకూ 20 మందిని చంపినట్టు వెల్లడించింది. పాకిస్థాన్‌లో కొన్ని ఇంటర్వ్యూలు చేయడంతో పాటు,అక్కడి నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నట్టు వివరించింది ఆ నివేదిక. ఓ భారత అధికారి గురించి ప్రస్తావిస్తూ...రష్యా, ఇజ్రాయేల్‌ ఇంటిలిజెన్స్‌ వర్గాల పని తీరుని వివరించింది. ఇజ్రాయేల్‌ ఇంటిలిజెన్స్ విభాగం మొస్సాద్ (Mossad) రష్యా ఇంటిలిజెన్స్ KGB ఇదే విధంగా వేరే దేశాల్లోని వ్యక్తుల్ని చంపిస్తున్నాయని, ఈ దేశాల నుంచే భారత్ స్ఫూర్తి పొందిందని ఆరోపించింది. అంతే కాదు. పాకిస్థాన్ అధికారులు ఈ హత్యలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు అందించినట్టు స్పష్టం చేసింది. అయితే..వీటిని వెరిఫై మాత్రం చేయలేదని వెల్లడించింది. 

గతంలోనూ ఇవే ఆరోపణలు..

ఇండియన్ ఇంటిలిజెన్స్‌కి చెందిన స్లీపర్ సెల్స్ ఈ హత్యలకు పాల్పడినట్టు ఈ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇలా భారత్‌పై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కెనడా, అమెరికా కూడా ఇలానే ఆరోపించాయి. గత సెప్టెంబర్‌లో కెనడాలోని ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇక అమెరికాలోని మరో ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ని హత్య చేయాలి చూశారని, ఆ కుట్రను తాము అడ్డుకున్నట్టు అమెరికా వెల్లడించింది. అయితే..ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. వీటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. భద్రత విషయానికి వచ్చినప్పుడు కచ్చితత్వంతోనే ఉంటామని తెలిపింది. ఆ తరవాత విచారణ చేపట్టగా భారత్‌కి చెందిన ఓ అధికారి గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ని హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు తేలిందని ఇండియా స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా ఓ రిపోర్ట్ భారత్‌పై ఆరోపణలు చేయడం సంచలనమవుతోంది. దీనిని ఇండియా ఖండిస్తున్నప్పటికీ పదేపదే ఇలాంటి ఆరోపణలు రావడమే కీలకంగా మారింది.  

Also Read: Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ పార్టీ తలరాతని మార్చేస్తుందా? పాంచ్ న్యాయ్‌ పాచిక పారుతుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
AI Impact In India:భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Mowgli 2025 OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Embed widget