అన్వేషించండి

పాకిస్థాన్‌లో భారత్‌ టార్గెటెడ్ కిల్లింగ్స్‌ పాల్పడుతోంది - ఓ రిపోర్ట్ సంచలన ఆరోపణలు

Targeted Assassinations: భారత్ ఇతర దేశాల్లో టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఓ రిపోర్ట్ సంచలన ఆరోపణలు చేసింది.

India Targeted Assassinations: పాకిస్థాన్‌లో భారత్‌ కొంత మంది ఉగ్రవాదులను టార్గెట్ చేసి మరీ చంపుతోందంటూ UK daily The Guardian చేసిన ఆరోపణల్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఆరోపించిన ఆ రిపోర్ట్‌ని వ్యతిరేకించింది. ఇవి ఒట్టి పుకార్లేనని, కేవలం భారత్‌పై విద్వేషంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండి పడింది. ఇటీవలే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. వేరే దేశాల్లో ఇలా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడడం భారత్ పాలసీ కాదని తేల్చి చెప్పారు. భారత్‌కి ముప్పు ఉందనుకున్న వాళ్లని లక్ష్యంగా పెట్టుకుని హతమారుస్తున్నారంటూ ఈ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. 2019లో పుల్వామా అటాక్ జరిగిన తరవాత RAW ఏజెన్సీ ఇప్పటి వరకూ 20 మందిని చంపినట్టు వెల్లడించింది. పాకిస్థాన్‌లో కొన్ని ఇంటర్వ్యూలు చేయడంతో పాటు,అక్కడి నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నట్టు వివరించింది ఆ నివేదిక. ఓ భారత అధికారి గురించి ప్రస్తావిస్తూ...రష్యా, ఇజ్రాయేల్‌ ఇంటిలిజెన్స్‌ వర్గాల పని తీరుని వివరించింది. ఇజ్రాయేల్‌ ఇంటిలిజెన్స్ విభాగం మొస్సాద్ (Mossad) రష్యా ఇంటిలిజెన్స్ KGB ఇదే విధంగా వేరే దేశాల్లోని వ్యక్తుల్ని చంపిస్తున్నాయని, ఈ దేశాల నుంచే భారత్ స్ఫూర్తి పొందిందని ఆరోపించింది. అంతే కాదు. పాకిస్థాన్ అధికారులు ఈ హత్యలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు అందించినట్టు స్పష్టం చేసింది. అయితే..వీటిని వెరిఫై మాత్రం చేయలేదని వెల్లడించింది. 

గతంలోనూ ఇవే ఆరోపణలు..

ఇండియన్ ఇంటిలిజెన్స్‌కి చెందిన స్లీపర్ సెల్స్ ఈ హత్యలకు పాల్పడినట్టు ఈ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇలా భారత్‌పై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కెనడా, అమెరికా కూడా ఇలానే ఆరోపించాయి. గత సెప్టెంబర్‌లో కెనడాలోని ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇక అమెరికాలోని మరో ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ని హత్య చేయాలి చూశారని, ఆ కుట్రను తాము అడ్డుకున్నట్టు అమెరికా వెల్లడించింది. అయితే..ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. వీటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. భద్రత విషయానికి వచ్చినప్పుడు కచ్చితత్వంతోనే ఉంటామని తెలిపింది. ఆ తరవాత విచారణ చేపట్టగా భారత్‌కి చెందిన ఓ అధికారి గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ని హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు తేలిందని ఇండియా స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా ఓ రిపోర్ట్ భారత్‌పై ఆరోపణలు చేయడం సంచలనమవుతోంది. దీనిని ఇండియా ఖండిస్తున్నప్పటికీ పదేపదే ఇలాంటి ఆరోపణలు రావడమే కీలకంగా మారింది.  

Also Read: Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ పార్టీ తలరాతని మార్చేస్తుందా? పాంచ్ న్యాయ్‌ పాచిక పారుతుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
Cameras in factories: కార్మికుల తలలకు కెమెరాలు - ఏఐకి అన్నీ నేర్పించి రోబోలను తెచ్చుకునేందుకేనా?
కార్మికుల తలలకు కెమెరాలు - ఏఐకి అన్నీ నేర్పించి రోబోలను తెచ్చుకునేందుకేనా?
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
AP Police Holiday: ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం
ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget