అన్వేషించండి

పాకిస్థాన్‌లో భారత్‌ టార్గెటెడ్ కిల్లింగ్స్‌ పాల్పడుతోంది - ఓ రిపోర్ట్ సంచలన ఆరోపణలు

Targeted Assassinations: భారత్ ఇతర దేశాల్లో టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఓ రిపోర్ట్ సంచలన ఆరోపణలు చేసింది.

India Targeted Assassinations: పాకిస్థాన్‌లో భారత్‌ కొంత మంది ఉగ్రవాదులను టార్గెట్ చేసి మరీ చంపుతోందంటూ UK daily The Guardian చేసిన ఆరోపణల్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడుతోందని ఆరోపించిన ఆ రిపోర్ట్‌ని వ్యతిరేకించింది. ఇవి ఒట్టి పుకార్లేనని, కేవలం భారత్‌పై విద్వేషంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండి పడింది. ఇటీవలే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. వేరే దేశాల్లో ఇలా టార్గెటెడ్ కిల్లింగ్స్‌కి పాల్పడడం భారత్ పాలసీ కాదని తేల్చి చెప్పారు. భారత్‌కి ముప్పు ఉందనుకున్న వాళ్లని లక్ష్యంగా పెట్టుకుని హతమారుస్తున్నారంటూ ఈ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. 2019లో పుల్వామా అటాక్ జరిగిన తరవాత RAW ఏజెన్సీ ఇప్పటి వరకూ 20 మందిని చంపినట్టు వెల్లడించింది. పాకిస్థాన్‌లో కొన్ని ఇంటర్వ్యూలు చేయడంతో పాటు,అక్కడి నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నట్టు వివరించింది ఆ నివేదిక. ఓ భారత అధికారి గురించి ప్రస్తావిస్తూ...రష్యా, ఇజ్రాయేల్‌ ఇంటిలిజెన్స్‌ వర్గాల పని తీరుని వివరించింది. ఇజ్రాయేల్‌ ఇంటిలిజెన్స్ విభాగం మొస్సాద్ (Mossad) రష్యా ఇంటిలిజెన్స్ KGB ఇదే విధంగా వేరే దేశాల్లోని వ్యక్తుల్ని చంపిస్తున్నాయని, ఈ దేశాల నుంచే భారత్ స్ఫూర్తి పొందిందని ఆరోపించింది. అంతే కాదు. పాకిస్థాన్ అధికారులు ఈ హత్యలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు అందించినట్టు స్పష్టం చేసింది. అయితే..వీటిని వెరిఫై మాత్రం చేయలేదని వెల్లడించింది. 

గతంలోనూ ఇవే ఆరోపణలు..

ఇండియన్ ఇంటిలిజెన్స్‌కి చెందిన స్లీపర్ సెల్స్ ఈ హత్యలకు పాల్పడినట్టు ఈ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇలా భారత్‌పై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కెనడా, అమెరికా కూడా ఇలానే ఆరోపించాయి. గత సెప్టెంబర్‌లో కెనడాలోని ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇక అమెరికాలోని మరో ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ని హత్య చేయాలి చూశారని, ఆ కుట్రను తాము అడ్డుకున్నట్టు అమెరికా వెల్లడించింది. అయితే..ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. వీటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. భద్రత విషయానికి వచ్చినప్పుడు కచ్చితత్వంతోనే ఉంటామని తెలిపింది. ఆ తరవాత విచారణ చేపట్టగా భారత్‌కి చెందిన ఓ అధికారి గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ని హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు తేలిందని ఇండియా స్పష్టం చేసింది. ఇప్పుడు ఏకంగా ఓ రిపోర్ట్ భారత్‌పై ఆరోపణలు చేయడం సంచలనమవుతోంది. దీనిని ఇండియా ఖండిస్తున్నప్పటికీ పదేపదే ఇలాంటి ఆరోపణలు రావడమే కీలకంగా మారింది.  

Also Read: Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ పార్టీ తలరాతని మార్చేస్తుందా? పాంచ్ న్యాయ్‌ పాచిక పారుతుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
Automatic Climate Control: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget