అన్వేషించండి

Kabul Blast Update: కాబూల్‌లో మరో బాంబు పేలుడు.. సూసైడ్ బాంబర్‌పై అమెరికా దాడి..

వరుస బాంబు పేలుళ్లు అఫ్గానిస్తాన్ ప్రజలను వణికిస్తున్నాయి. జంట పేలుళ్లు జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే మరో పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది.

వరుస బాంబు పేలుళ్లు అఫ్గానిస్తాన్ ప్రజలను వణికిస్తున్నాయి. జంట పేలుళ్లు జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే మరో పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో కొద్దిసేపటి క్రితం మరో బాంబు పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాబూల్‌లోని ఖవాజా బుగ్రా, పీడీ 15 ప్రాంతంలో పేలుడు జరిగినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. కాబూల్ విమానాశ్రయానికి ఉత్తరం వైపున ఉన్న ఒక ఇంటిని రాకెట్ ఢీకొట్టిందని, దీంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సూసైడ్ బాంబర్‌పై అమెరికా దాడి..
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో ఆత్మాహుతి దాడి త్రుటిలో తప్పినట్లు తెలుస్తోంది. విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడికి యత్నించిన ఒక వ్యక్తిని అమెరికా బలగాలు మట్టుబెట్టాయనే వార్తలు వస్తున్నాయి.  అమెరికా తమ దేశ పౌరుల తరలింపు ప్రక్రియను చేపడుతున్న వేళ ఆత్మాహుతి దాడికి ఓ వాహనంలో సిద్ధంగా ఉన్న వ్యక్తిపై (సూసైడ్ బాంబర్‌) యూఎస్ బలగాలు వైమానిక దాడి జరిపాయని తాలిబన్‌ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. మరణించిన వ్యక్తి ఐసిస్‌-కె ఉగ్రవాదిగా గుర్తించారు. 

రాబోయే రెండు రోజుల్లో కాబూల్ విమానాశ్రయంలో మరోసారి బాంబు పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈరోజు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పౌరులంతా కాబూల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని సూచించారు. కాబూల్‌లోని అమెరికన్ రాయబార కార్యాలయం కూడా ఈరోజు ఉదయం అక్కడి అమెరికన్లకు హెచ్చరిక జారీ చేసింది. కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో బాంబు దాడి జరగవచ్చని విశ్వసనీయ సమాచారం అందిందని.. కాబట్టి పౌరులంతా కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాలను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. అగ్రరాజ్యం హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పేలుడు సంభవించింది. 

కాబూల్ విమానాశ్రయం వెలుపల గురువారం జరిగిన జంట పేలుళ్లలో 180 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది సహా చిన్నారులు ఉన్నారు. ఈ పేలుళ్లకు తామే కారణమని ఐసిస్-కే ఉగ్రవాదులు ప్రకటించారు. దాడి జరిగిన కొద్ది గంటలకే అమెరికా ప్రతీకారంగా డ్రోన్ దాడులకు దిగింది. అఫ్గానిస్తాన్‌లో నంగహర్‌ ప్రావిన్స్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరసాన్‌ స్థావరాలపై మానవ రహిత డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఇందులో ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాది హతమైనట్లు పెంటగాన్ ప్రకటించింది. డ్రోన్ దాడులను ఇంతటితో ఆపబోమని, మరిన్ని దాడులు చేస్తామని ఐసిస్-కే ఉగ్రవాదులకు బైడెన్‌ హెచ్చరికలు జారీ చేశారు. తమ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

Also Read: Kabul Attack Warning: 24-36 గంటల్లో మరో ఉగ్ర దాడి జరిగే ఛాన్స్.. బైడెన్ హెచ్చరిక, కీలక ఆదేశాలు

Also Read: India-Afghan Relations: తాలిబన్ల పాలన భారత్ కు నష్టమే!.. అఫ్గాన్ లో భారత్ ఖర్చు పెట్టిన సొమ్మెంతో తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Tesla Y in india: ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Rambha: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget