అన్వేషించండి

India-Afghan Relations: తాలిబన్ల పాలన భారత్ కు నష్టమే!.. అఫ్గాన్ లో భారత్ ఖర్చు పెట్టిన సొమ్మెంతో తెలుసా!

అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక ఆ దేశంలో పరిస్థితులు క్షీణించాయి. భారత్ అఫ్గాన్ సంబంధాలపై ఈ ప్రభావం పడింది. అయితే ఇప్పటి వరకూ అఫ్గాన్ కు భారత్ అందించిన సాయం ఎంతో తెలుసా?

అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో పరిస్థితులు భయంకరంగా మారిపోతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది.  తాలిబన్లు షరియా చట్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మరోసారి రాక్షస రాజ్యం వచ్చిందని అఫ్గాన్ వాసులు భయపడుతున్నారు. అఫ్గాన్ కు అండగా ఉంటామన్న మాటని తప్పి ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికా తన సేనలు ఉపసంహరించుకుంది. రాత్రికి రాత్రే కాబూల్‌ వాసులను రోడ్లపై వదిలేసింది. అమెరికా ఇలా చేయడంపై రకరకాల వాదనలున్నాయి. అయితే ఆప్ఘనిస్తాన్‌ పునర్నిర్మాణానికి భారత్ సహకారం అందించింది. ఇప్పటి వరకూ  రూ.22 వేల కోట్లు అఫ్గాన్ అందించింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో ఈ రూ. 22 వేల కోట్లు బూడిదలో పోసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. 

భారత్ సొమ్ము అఫ్గాన్ లో ఖర్చు 

2020 నవంబర్‌లో జెనీవాలో జరిగిన సమావేశంలో అఫ్గానిస్థాన్ లోని  34 ప్రాంతాల్లో 400 పనులు చేపట్టినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. కిందటేడాది రూ.600 కోట్లతో 100 కమ్యూనిటీ హాల్స్ కట్టినట్లు తెలిపారు.  

సల్మా డ్యామ్

సల్మా డ్యామ్ ను హెరాత్‌ ప్రాంతంలో నిర్మించారు. దీనిని అఫ్గాన్- ఇండియా ఫ్రెండ్ షిప్ డ్యామ్ అని చెబుతారు. ప్రధాని నరేంద్రమోదీ, అప్పటి అఫ్గాన్ అధ్యక్షుడు కలిసి 2016లో దీనిని  ప్రారంభించారు .ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. దీనికి అయిన ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లు. ఇది కూడా తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయింది.  

Also Read: Explosion Outside Kabul airport: కాబూల్‌లో జంట పేలుళ్లు.. 72 మంది మృతి

జరాంజ్-దెలారాం హైవే..

అఫ్గాన్ లోని 218 కిలోమీటర్ల హైవే ఈ ప్రాజెక్టు. దీనిని రూట్ 6 ఓ 6 అంటారు.  ఈ ప్రాజెక్టు సముద్ర మార్గం ద్వారా చేసే వ్యాపారానికి చాలా ముఖ్యం. ఈ హైవే ఇరాన్ లో భారత్ నిర్మిస్తున్న చార్‌బాహర్ నౌకాశ్రయం నుంచి అఫ్గాన్ లోని ప్రముఖ జాతీయ రహదారిని నేరుగా కలుపుతుంది. దీని కోసం దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో 11 మంది భారతీయులు, 129 మంది అఫ్గాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: Kabul Airport: వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం...తరలింపు ఆగదు... కాబూల్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అఫ్గానిస్తాన్‌ పార్లమెంట్

తాలిబన్లు బందూకులు పట్టుకుని ప్రెస్‌మీట్లు పెట్టిన పార్లమెంట్ భవనం నిర్మించింది కూడా భారతే.  ఇందుకోసం రూ.670 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ 2015లో ఈ మాట చెప్పారు. విద్యుత్, టెలికాం రంగాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. భారత్‌ అఫ్గానిస్తాన్‌లో చాలా ఆసుపత్రులు కట్టించింది. 2019 నాటికి రెండు దేశాల మధ్య దైపాక్షిక వాణిజ్యం విలువ రూ.9600 కోట్లు. తాలిబన్ల రాకతో ఈ వాణిజ్యానికి బ్రేక్ పడింది. అఫ్గాన్ నుంచి భారత్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్  దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో వీటి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. 

పాక్ తో తాలిబన్ల దోస్తీ

అఫ్గాన్- భారత్‌ మైత్రీ బంధానికి ప్రతీకగా చెప్పుకునే సల్మా డ్యామ్ పై గతంలో తాలిబన్లు రాకెట్లతో దాడులు చేశారు. అఫ్గాన్ సైనికులు వాటిని అడ్డుకున్నారు. భారత్ తో తాలిబన్లు ఎలా వ్యవహరిస్తారో పెద్ద ప్రశ్నగా మారింది.  కాందహార్‌ హైజాక్‌ భారత్ ఎప్పటికీ మర్చిపోలేదు. అప్పట్లో ఓ విమానాన్ని పాక్ తీవ్రవాదులు హైజాక్ చేసి తాలిబన్ల ఆధీనంలో ఉన్న కాందహార్‌కు తీసుకెళ్లింది. దేశం ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది పాక్ తాలిబన్ల మైత్రికి సంకేతం. అఫ్గాన్ ను ఆక్రమించుకునేందుకు పాక్ సహాయం అందించింది. దీంతో తాలిబన్లు పాకిస్తాన్ కాదని భారత్ తో సంబంధాలు కొనసాగిస్తారనేది సందేహమే. తాలిబన్ల అఫ్గాన్ తో భారత్ వ్యవహారాలు ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. 

 

Also Read: Afghanistan Drone Attack: కాబుల్ పేలుళ్లపై అమెరికా ప్రతీకారం.. ఆ శిబిరాలపై యూఎస్ డ్రోన్ దాడులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Center statement on fuel issue: కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
Best Affordable Bikes: 4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ
4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget