అన్వేషించండి

India-Afghan Relations: తాలిబన్ల పాలన భారత్ కు నష్టమే!.. అఫ్గాన్ లో భారత్ ఖర్చు పెట్టిన సొమ్మెంతో తెలుసా!

అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమయ్యాక ఆ దేశంలో పరిస్థితులు క్షీణించాయి. భారత్ అఫ్గాన్ సంబంధాలపై ఈ ప్రభావం పడింది. అయితే ఇప్పటి వరకూ అఫ్గాన్ కు భారత్ అందించిన సాయం ఎంతో తెలుసా?

అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో పరిస్థితులు భయంకరంగా మారిపోతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది.  తాలిబన్లు షరియా చట్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మరోసారి రాక్షస రాజ్యం వచ్చిందని అఫ్గాన్ వాసులు భయపడుతున్నారు. అఫ్గాన్ కు అండగా ఉంటామన్న మాటని తప్పి ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికా తన సేనలు ఉపసంహరించుకుంది. రాత్రికి రాత్రే కాబూల్‌ వాసులను రోడ్లపై వదిలేసింది. అమెరికా ఇలా చేయడంపై రకరకాల వాదనలున్నాయి. అయితే ఆప్ఘనిస్తాన్‌ పునర్నిర్మాణానికి భారత్ సహకారం అందించింది. ఇప్పటి వరకూ  రూ.22 వేల కోట్లు అఫ్గాన్ అందించింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో ఈ రూ. 22 వేల కోట్లు బూడిదలో పోసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. 

భారత్ సొమ్ము అఫ్గాన్ లో ఖర్చు 

2020 నవంబర్‌లో జెనీవాలో జరిగిన సమావేశంలో అఫ్గానిస్థాన్ లోని  34 ప్రాంతాల్లో 400 పనులు చేపట్టినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. కిందటేడాది రూ.600 కోట్లతో 100 కమ్యూనిటీ హాల్స్ కట్టినట్లు తెలిపారు.  

సల్మా డ్యామ్

సల్మా డ్యామ్ ను హెరాత్‌ ప్రాంతంలో నిర్మించారు. దీనిని అఫ్గాన్- ఇండియా ఫ్రెండ్ షిప్ డ్యామ్ అని చెబుతారు. ప్రధాని నరేంద్రమోదీ, అప్పటి అఫ్గాన్ అధ్యక్షుడు కలిసి 2016లో దీనిని  ప్రారంభించారు .ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. దీనికి అయిన ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లు. ఇది కూడా తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయింది.  

Also Read: Explosion Outside Kabul airport: కాబూల్‌లో జంట పేలుళ్లు.. 72 మంది మృతి

జరాంజ్-దెలారాం హైవే..

అఫ్గాన్ లోని 218 కిలోమీటర్ల హైవే ఈ ప్రాజెక్టు. దీనిని రూట్ 6 ఓ 6 అంటారు.  ఈ ప్రాజెక్టు సముద్ర మార్గం ద్వారా చేసే వ్యాపారానికి చాలా ముఖ్యం. ఈ హైవే ఇరాన్ లో భారత్ నిర్మిస్తున్న చార్‌బాహర్ నౌకాశ్రయం నుంచి అఫ్గాన్ లోని ప్రముఖ జాతీయ రహదారిని నేరుగా కలుపుతుంది. దీని కోసం దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో 11 మంది భారతీయులు, 129 మంది అఫ్గాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: Kabul Airport: వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం...తరలింపు ఆగదు... కాబూల్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అఫ్గానిస్తాన్‌ పార్లమెంట్

తాలిబన్లు బందూకులు పట్టుకుని ప్రెస్‌మీట్లు పెట్టిన పార్లమెంట్ భవనం నిర్మించింది కూడా భారతే.  ఇందుకోసం రూ.670 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ 2015లో ఈ మాట చెప్పారు. విద్యుత్, టెలికాం రంగాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. భారత్‌ అఫ్గానిస్తాన్‌లో చాలా ఆసుపత్రులు కట్టించింది. 2019 నాటికి రెండు దేశాల మధ్య దైపాక్షిక వాణిజ్యం విలువ రూ.9600 కోట్లు. తాలిబన్ల రాకతో ఈ వాణిజ్యానికి బ్రేక్ పడింది. అఫ్గాన్ నుంచి భారత్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్  దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో వీటి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. 

పాక్ తో తాలిబన్ల దోస్తీ

అఫ్గాన్- భారత్‌ మైత్రీ బంధానికి ప్రతీకగా చెప్పుకునే సల్మా డ్యామ్ పై గతంలో తాలిబన్లు రాకెట్లతో దాడులు చేశారు. అఫ్గాన్ సైనికులు వాటిని అడ్డుకున్నారు. భారత్ తో తాలిబన్లు ఎలా వ్యవహరిస్తారో పెద్ద ప్రశ్నగా మారింది.  కాందహార్‌ హైజాక్‌ భారత్ ఎప్పటికీ మర్చిపోలేదు. అప్పట్లో ఓ విమానాన్ని పాక్ తీవ్రవాదులు హైజాక్ చేసి తాలిబన్ల ఆధీనంలో ఉన్న కాందహార్‌కు తీసుకెళ్లింది. దేశం ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది పాక్ తాలిబన్ల మైత్రికి సంకేతం. అఫ్గాన్ ను ఆక్రమించుకునేందుకు పాక్ సహాయం అందించింది. దీంతో తాలిబన్లు పాకిస్తాన్ కాదని భారత్ తో సంబంధాలు కొనసాగిస్తారనేది సందేహమే. తాలిబన్ల అఫ్గాన్ తో భారత్ వ్యవహారాలు ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. 

 

Also Read: Afghanistan Drone Attack: కాబుల్ పేలుళ్లపై అమెరికా ప్రతీకారం.. ఆ శిబిరాలపై యూఎస్ డ్రోన్ దాడులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget