అన్వేషించండి

Ram Mandir: అయోధ్య ఆలయానికి మొదటి రోజే రూ.3 కోట్ల విరాళాలు, 5 లక్షల మంది భక్తులు

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి తొలిరోజే రూ.3 కోట్ల విరాళాలు వెల్లువెత్తాయి.

Ayodhya Ram Mandir Donations: జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం (Ayodhya Ram Mandir) ఎంతో ఘనంగా ముగిసింది. ఆ మరుసటి రోజు నుంచే భక్తుల సందర్శనకు అవకాశమిచ్చారు. ఆలయ నిర్మాణ పనులు ఇంకొన్ని మిగిలి ఉన్నాయి. ఇవన్నీ 2025 నాటికి పూర్తవుతాయని అంచనా. అయితే...ఇప్పటికీ అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు అంటే..జనవరి 23వ తేదీనే దాదాపు రూ.3 కోట్ల విరాళాలు వచ్చినట్టు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తరవాత 10 డొనేషన్ కౌంటర్‌లు ఏర్పాటు చేసినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. జనవరి 23న కొందరు భక్తులు నేరుగా నగదు రూపంలో విరాళాలు ఇవ్వగా మరి కొందరు ఆన్‌లైన్‌లో డొనేట్ చేశారు. ఈ లెక్కంతా తీస్తే రూ.3.17 కోట్ల వరకూ జమైందని అనిల్ మిశ్రా వెల్లడించారు. ఆ ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా భక్తులు రామ మందిరానికి (Ram Mandir) పోటెత్తారు. మరుసటి రోజు కూడా దాదాపు ఇదే స్థాయిలో భక్తులు వచ్చినట్టు ట్రస్ట్ వెల్లడించింది. అయితే...భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ పద్ధతి ప్రకారం ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యతను RSS తీసుకుంది. సంఘ్‌ వర్కర్స్‌ ఇప్పటికే రంగంలోకి దిగి ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. అదే సమయంలో దర్శనానికి వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. క్యూ లైన్‌లో వెళ్లేలా వాళ్లకు సూచనలు చేస్తున్నారు. ఇక నుంచి భక్తుల తాకిడి రోజురోజుకీ పెరిగే అవకాశాలున్నాయని ట్రస్ట్ అంచనా వేస్తోంది. 

భారీ విరాళాలు..

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అందించారు. వి దిలీప్ కుమార్ అనే డైమండ్ బిజినెస్ మ్యాన్ కుటుంబం రామయ్యకు తన వంతుగా 101 కేజీల బంగారాన్ని విరాళం ఇచ్చారు. ఆలయంలో నిర్మించిన తలుపులకు బంగారం పూత పూయడం తెలిసిందే. అయితే మార్కెట్‌లో ఉన్న ధర ఆధారంగా చూస్తే.. వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ ఫ్యామిలీ రామాలయానికి దాదాపు రూ.68 కోట్లు రామ మందిరం ట్రస్టుకు విరాళం అందించినట్లు తెలుస్తోంది. రామయ్య గుడి నిర్మాణానికి వచ్చిన భారీ విరాళం ఇదే. అయోధ్య రామ మందిర నిర్మాణానికి రెండో అతిపెద్ద విరాళాన్ని ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు అందించారు. రామ మందిరం కోసం మొరారీ బాపు రూ. 11.3 కోట్లను అందించారు. అమెరికా, బ్రిటన్, కెనడాలోని తన అనుచరుల విరాళాల ద్వారా నిధులు 8 కోట్లు రూపాయలు జమకూర్చినట్లు సమాచారం. సూరత్ కు చెందిన మరో వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ ఢోలాకియా రూ.11 కోట్లు విరాళం ఇచ్చారు. శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకుడే ఈ డోలాకియా. 

Also Read: హనీమూన్‌కి గోవా తీసుకెళ్తానని అయోధ్యకి తీసుకెళ్లిన భర్త, విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget