అన్వేషించండి

Top Headlines Today: విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌ల్లో పోటీకి కూటమి దూరం, హైకోర్టుకు చేరిన 'స్థానికత' వివాదం- నేటి టాప్ న్యూస్

Telangana News Today | మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు ప్రవేశాలలో స్థానికత వివాదం హైకోర్టుకు చేరింది.

Andhra Pradesh News Todady | ఆ రోజు ఇంటిపైకి దాడికి రాలేదు, కక్ష పెట్టుకోవద్దు- నీకూ ఓ కొడుకు ఉన్నాడు- చంద్రబాబుకు జోగి రమేష్ హెచ్చరిక 
ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై కక్ష పెట్టుకున్నారని అందుకే తన కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేయించారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఇంటిపైకి ఆ రోజు దాడికి వెళ్లాలన్న కక్షతోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. అసలు ఆరోజు తాను దాడి చేయడానికి వెళ్లలేదని కేవలం చంద్రబాబును కలిసేందుకు మాత్రమే వెళ్లాలని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్‌రెడ్డిపై అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్‌ తెలియజేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లినట్టు వివరించారు. చంద్రబాబును కలిసి నిరసన తెలియజేసి వ్యవస్థను సరిచేయాలనే చెప్పడానికే అలా చేశానని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌ల్లో పోటీకి కూటమి దూరం- బొత్స గెలుపు లాంఛ‌న‌మే 
విశాఖ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌యం ఖాయ‌మైంది. కూటమి పార్టీలు పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించడంతో వైసీపీ అభ్య‌ర్థి బొత్స ఎన్నిక ఏక‌గ్రీవం అయ్యింది. నిన్న‌టి వ‌ర‌కు ప‌లు ర‌కాలుగా క‌స‌ర‌త్తులు చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు, చివ‌రికి పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. నామినేష‌న్ చివ‌రి రోజున ఈ పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణయం తీసుకోవ‌డంతో బొత్స గెలుపు ఖ‌రారైంది. బొత్సాతోపాటు ఒకే ఒక్క నామినేష‌న్ దాఖ‌లైంది. షేక్ ష‌ఫీ అనే వ్య‌క్తి స్వతంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జేసీ- ఇంట్లోనూ తనిఖీలు భారీగా నగదు స్వాధీనం
ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటూ రంగారె‌డ్డి జిల్లాకు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతోపాటు కలెక్టరేట్‌లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ మదన్‌మోహన్ రెడ్డి కూడా అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఓ వ్యక్తికి చెందిన భూమి నిషేధితజాబితాలో ఉంది. దాన్ని నార్మలైజ్ చేసి నిషేధిత జాబితా నుంచి తప్పించేలా ధరణి పోర్టల్‌లో మార్పులకు రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఈ పని చేసేందుకు ఆయన డబ్బులు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

జోగి రమేష్ కుమారుడు అరెస్టు- అగ్రిగోల్డ్ భూముల స్కామ్‌లో కీలక మలుపు
అగ్రిగోల్డ్ భూముల స్కామ్ కీలక మలుపు తిరిగింది. ఉదయం నుంచి వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ ఆయన కుమారుడిని అరెస్టు చేసింది. జోగి రమేష్ కుమారుడు ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించారని... మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పి అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఐదు గంటలకు ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

హైకోర్టుకు చేరిన 'స్థానికత' వివాదం, మెడికల్ సీట్ల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ (కాంపీటెంట్) కోటా కింద 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను ఆగస్టు 3న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. నుంచి ఆగస్టు 13తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఈ గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget