అన్వేషించండి

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

డైరీ ఉత్పత్తులు వల్ల కొంతమందికి చర్మ అలర్జీ, మొటిమలు సమస్య ఎక్కువగా వస్తుంది. వేసవిలో పెరుగు తింటే ఆ సమస్య ఎక్కువేనని భయపడతారు. అది నిజమేనా?

ఎండకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాల జాబితాలో పెరుగు ఉంటుంది. వేసవిలో పొట్ట ఆరోగ్యంగా, చల్లగా ఉండాలంటే పెరుగు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రొబయోటిక్స్ ఉన్నాయి. మంచి మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కానీ పెరుగు తిన్న తర్వాత కొంతమందికి మొటిమలు, చర్మ అలర్జీలు, జీర్ణ సమస్యలు, శరీరంలో అధిక వేడిగా అనిపించడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. పెరుగులో వేడి చేసే లక్షణాలు కంటే శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి.

ఆయుర్వేదం ప్రకారం, ప్రాచీన భారతీయ వైద్య విధానం ప్రకారం వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. వాత, పిత్త, కఫ దోషాలపై ఆదరపడి ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే పెరుగుకి బదులు మజ్జిగ తీసుకోవడం మంచిదని సూచిస్తారు.

పెరుగు శరీరంలో వేడిని ఎందుకు పెంచుతుంది?

శరీరానికి చలువ చేస్తుందని పెరుగు తింటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం పెరుగు రుచిలో పుల్లగా ఉంటుంది. జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. ఇది కఫ, పిత్త దోషాల్లో ఎక్కువ, వాత దోషంలో తక్కువ. అందుకే ఏ సీజన్ లో అయినా పెరుగు తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వేసవిలో పెరుగు తింటే కొందరికి శరీరంలో వేడి పెరుగుతుంది. అలాగే ఆరోగ్యమని భావించి అధికంగా తీసుకుంటే ముఖంపై మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కానీ పెరుగుని సరైన పద్ధతిలో తీసుకునే ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు.

పెరుగు తినే మార్గాలు

పెరుగుని వేసవిలో రోజూ తినకూడదు. రాళ్ళ ఉప్పు, ఎండు మిర్చి, జీలకర్ర వంటి మసాలా దినుసులు జోడించుకుని మజ్జిగ రూపంలో మాత్రమే రోజూ తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. పెరుగులో నీటిని కలిపినప్పుడు అది వేడి ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. నీరు వేడిని తగ్గిస్తుంది. పెరుగుకు శీతలీకరణ ప్రభావాన్ని పెంచుతుంది. అందుకే వేసవిలో దాన్ని తీసుకోవాలని అనుకుంటే అందులో నీరు ఎక్కువగా వేసుకుని మజ్జిగ అన్నం మాదిరిగా చేసుకుంటే తింటే మంచిది. దీని వల్ల శరీరానికి చల్లదనంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు చేకూరతాయి.

అలాగే పెరుగుని వేడి చేయకూడదు. వేడి  వేడి అన్నంలో పెరుగు వేసుకుని తినకూడదు. ఎందుకంటే వేడి తగలడం వల్ల అది దాని సహజమైన లక్షణాలని కోల్పోతుంది. కఫ దోషం ఎక్కువగా ఉన్నందున ఊబకాయం ఉన్నవాళ్ళు పెరుగుకు దూరంగా ఉండటం మంచిది. అంతే కాదు ఆయుర్వేదం ప్రకారం పండ్లతో కలపకూడదు. సమ్మర్ సీజన్ లో చాలా మంది చేసే తప్పు పెరుగు అన్నంలో మామిడి కాయ కలుపుకుని తింటారు. కానీ ఇది మంచి కలయిక కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget