అన్వేషించండి

Home Remedies for Cough : దగ్గును తగ్గించే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు.. వాతావరణం మారినప్పుడు వీటిని ఫాలో అయిపోండి

Home Remedies : వాతావరణం మారగానే దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే తక్షణ ఉపశమనం కోసం కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. అవేంటంటే..

Home Remedies for Cough and Cold : పొడివాతవరణంలో.. లేదా సీజన్ మారే సమయంలో వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సీజనల్ ఇన్​ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా దగ్గు(Cough), జలుబు (Cold) సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. పెద్దల నుంచి పిల్లల వరకు వాతావరణ మార్పుల వల్ల గొంతు నొప్పి(Sore Throat), దుమ్ము, ధూళి వల్ల కలిగే అలర్జీలతో ఇబ్బంది పడతారు.  దగ్గు ఉంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా మారిపోతుంది. సరిగ్గా నిద్ర పోలేరు. గుండెల్లో నొప్పిగా ఉండడంతో పాటు చాలా అలసటగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మెడిసన్స్, సిరప్​లు వాడితో ప్రయోజనంగా ఉంటుంది. 

కొన్ని ఇంటి చిట్కాలతో కూడా దగ్గు, కఫం, జలుబు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్తున్నారు డాక్టర్ దీపికా రాణా. మీకు వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు వంటి సమస్యలు వస్తే సహజమైన నివారణలను ట్రై చేయవచ్చని సూచిస్తున్నారు. దగ్గు, గొంతునొప్పి, కఫం నుంచి వెంటనే ఉపశమనం ఇవ్వడంలో ఇవి మంచి ప్రయోజనాలు ఇస్తాయని చెప్తున్నారు. 

అల్లం-తేనె (Ginger-Honey Remedy)

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపు, నొప్పిని తగ్గిస్తాయి. అయితే తేనె గొంతును మృదువుగా చేస్తుంది. ఒక టీస్పూన్ అల్లం రసం తీసి.. అందులో అర టీస్పూన్ తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల దగ్గు నుంచి తక్షణ ఉపశమనం దొరుకుతుంది. అలాగే అల్లాన్ని నీటిలో వేసి మరిగించి.. దానిలో తేనె కలిపి తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

పాలల్లో పసుపు (Milk Turmeric Remedy)

పసుపును సహజమైన యాంటీబయాటిక్​గా చెప్తారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు వేసి తాగితే మంచిదట. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభించడంతో పాటు.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెప్తోంది.

తులసి, మిరియాల టీ (Basil and Peppar Remedy)

తులసి ఆకులు, మిరియాలు రెండూ దగ్గును నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కొన్ని తులసి ఆకులను మరిగించి.. దానిలో మిరియాల పొడి వేసుకుని.. కొంచెం తేనె కలిపి టీ తయారు చేసుకోవచ్చు. దీనిని రోజూ తాగితే గొంతుకు ఉపశమనం వస్తుంది.నఅంతేకాకుండా కఫాన్ని తొలగించడంలో కూడా సహాయం చేస్తుంది.

ఆవిరి తీసుకోవడం (Steam Remedy)

గొంతు నొప్పి, దగ్గును తగ్గించుకోవాలనుకుంటే మీరు ఆవిరి తీసుకోవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనికోసం మీరు నీటిని మరిగించి దానిలో వాము లేదా పుదీనా చుక్కలు వేసుకోవాలి. దానిని ఆవిరి తీసుకోవడం వల్ల గొంతు తేమగా మారుతుంది. కఫం సులభంగా బయటకు వస్తుంది. దగ్గు, జలుబు కూడా తగ్గుతుంది.

పుక్కిలించడం (Gargling with Salt Water)

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల దగ్గు, గొంతు నొప్పికి తగ్గుతుంది. ఇది చాలా పాతకాలం నాటి చిట్కా. బట్ వెరీ ఎఫెక్టివ్. గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇది మంచి ప్రయోజనాలు ఇస్తుంది. 

కాబట్టి పెద్దల నుంచి పిల్లలవరకు దగ్గు, కఫం, జలుబు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాలు కచ్చితంగా ప్రయత్నించండి. ఇవి ఎంత ట్రై చేసినా.. దగ్గు, గొంతు నొప్పి తగ్గకపోతే కచ్చితంగా వైద్య సేవలు తీసుకోండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget